T20 World Cup: సెలబ్రేషన్స్లో ధోనీని కాపీ కొట్టిన అసిఫ్ అలీ
టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ వరుసగా మూడు మ్యాచ్లు గెలిచి సెమీస్ బెర్తు ఖాయం చేసుకునేందుకు దగ్గరైంది. శుక్రవారం రాత్రి అఫ్గానిస్థాన్తో జరిగిన ఉత్కంఠపోరులో...
ఇంటర్నెట్డెస్క్: టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ వరుసగా మూడు మ్యాచ్లు గెలిచి సెమీస్ బెర్తు ఖాయం చేసుకునేందుకు దగ్గరైంది. శుక్రవారం రాత్రి అఫ్గానిస్థాన్తో జరిగిన ఉత్కంఠపోరులో అద్భుత విజయం సాధించిన పాక్ జట్టు ప్రస్తుతం గ్రూప్-2లో టాప్లో నిలిచింది. అయితే, ఆ మ్యాచ్ అనంతరం పాక్ బ్యాట్స్మన్ అసిఫ్ అలీ టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీలా ‘గన్షాట్ సెలబ్రేషన్స్’ చేసుకోవడమే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ధోనీ భారత జట్టులో చేరిన కొత్తలో శ్రీలంకపై అద్భుత శతకం సాధించాక తన బ్యాట్తో గన్షాట్ సెలబ్రేషన్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆపై పలు సందర్భాల్లోనూ ఇలాగే సంబరాలు చేసుకున్నాడు.ఇప్పుడు అఫ్గాన్పై గెలిచాక అసిఫ్ కూడా అలాగే బ్యాట్ పైకెత్తి గన్తో షూట్ చేస్తున్నట్లు పోజులిచ్చాడు. దీంతో నెటిజన్లు వాళ్లిద్దరి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకొని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు అసిఫ్ ఈ మ్యాచ్లో చివర్లో వచ్చి.. కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నాడు. 12 బంతుల్లో 24 పరుగులు అవసరమైన వేళ ఒకే ఓవర్లో నాలుగు సిక్సులు బాది పాకిస్థాన్కు అద్భుత విజయం అందించాడు. అతడు ఏడు బంతుల్లోనే 25 పరుగులు చేసి అఫ్గాన్తో ఘోర పరాభవాన్ని తప్పించాడు. ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం ధోనీలా సంబరాలు చేసుకున్నాడు. అంతకుముందు న్యూజిలాండ్తో తలపడిన మ్యాచ్లోనూ అసిఫ్ (27; 12 బంతుల్లో 1x4, 3x6) చివర్లో ధాటిగా ఆడి పాకిస్థాన్ను గెలిపించాడు. ఇలా అతడు వరుసగా రెండు మ్యాచ్లు గెలిపించడంతో అభిమానులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె