T20 World Cup: భారత్‌కు ఇంకా ఛాన్సుందా?

టీ20 ప్రపంచకప్‌లో ఫేవరెట్‌ జట్టనుకున్న టీమ్‌ఇండియా తొలి మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌తో చేతిలో చావు దెబ్బ తినింది. అయితే, న్యూజిలాండ్‌తోనైనా గెలిచి సెమీస్‌ రేసులో...

Updated : 01 Nov 2021 08:29 IST

కోహ్లీసేన సెమీస్‌ చేరాలంటే..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో ఫేవరెట్‌ జట్టనుకున్న టీమ్‌ఇండియా తొలి మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌తో చేతిలో చావు దెబ్బతింది. అయితే, న్యూజిలాండ్‌తోనైనా గెలిచి సెమీస్‌ రేసులో ఉంటుందని భావించిన అభిమానులకు మళ్లీ నిరాశే మిగిలింది. ఇక మన జట్టు మిగిలిన మ్యాచ్‌ల్లో అఫ్గానిస్థాన్‌, స్కాట్లాండ్‌, నమీబియాలతో ఆడాల్సి ఉంది. ఈ మూడింటిలోనూ కోహ్లీసేన గెలవొచ్చు. అయితే ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించడంతో పాక్‌ దాదాపు సెమీస్‌ చేరినట్లే. ఇక మనలాగే మూడు చిన్న జట్లతో మ్యాచ్‌లు ఆడాల్సిన న్యూజిలాండ్‌ వాటిపై గెలిస్తే ముందంజ వేస్తుంది. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా ఇంకా సెమీస్‌ చేరాలంటే.. ప్రమాదకర జట్టుగా ఈ మధ్య మంచి ప్రదర్శన చేస్తున్న అఫ్గానిస్థాన్‌ కివీస్‌ను ఓడిస్తుందేమో చూడాలి. అప్పుడు భారత్‌ మిగతా మూడు మ్యాచ్‌ల్లోనూ ఘనంగా గెలవడమే కాకుండా న్యూజిలాండ్‌ కన్నా మెరుగైన రన్‌రేట్‌ సాధిస్తే సెమీస్‌ చేరే అవకాశాలు ఉంటాయి. అయితే అది నిజమవ్వాలంటే అద్భుతాలే జరగాలి. టైటిల్‌ ఫేవరెట్‌గా భావించిన టీమ్‌ఇండియా చివరికి ఇలా అద్భుతాలపై ఆశలు పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని