T20 World cup: ఆస్ట్రేలియా చిన్న అవకాశం కూడా ఇవ్వలేదు: విలియమ్సన్
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఒక చిన్న అవకాశం కూడా ఇవ్వలేదని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు...
ఇంటర్నెట్డెస్క్: టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఒక చిన్న అవకాశం కూడా ఇవ్వలేదని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. ఆదివారం రాత్రి జరిగిన తుదిపోరులో కంగారూలు తొలిసారి పొట్టి ప్రపంచకప్ను ముద్దాడిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం విలియమ్సన్ మాట్లాడుతూ.. ‘మేం గెలవడానికి ప్రయత్నాలు చేసినా పిచ్ సహకరించలేదు. ఈ దుబాయ్ పిచ్ కాస్త కఠినంగా ఉంది. మేం పలు భాగస్వామ్యాలు నిర్మించి పోరాడేందుకు కావాలిసినంత లక్ష్యాన్ని నిర్దేశించడం బాగుంది. కానీ, ఆస్ట్రేలియా దాన్ని సునాయాసంగా ఛేదించింది. అదో అద్భుతమైన జట్టు. ఈ క్రమంలోనే మేం గెలుపొందడానికి అన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది’ అని చెప్పుకొచ్చాడు.
‘మా ఆటగాళ్లు కచ్చితమైన ప్రణాళికలతో వచ్చి ఆడినా ఆస్ట్రేలియా ప్లేయర్లు చిన్న అవకాశం కూడా ఇవ్వలేదు. అయితే, మా జట్టు అంకితభావం పట్ల నేను గర్వపడుతున్నా. తుదిపోరు వరకూ వచ్చి మా అత్యుత్తమ ప్రదర్శన చేసినా సరిపోలేదు. యూఏఈలో ఒక పిచ్తో మరో పిచ్కు పోలికే లేదు. అన్ని పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకుసాగాం. ఈ మ్యాచ్లో విజయం సాధించిన ఆస్ట్రేలియాకు క్రెడిట్ దక్కుతుంది. ఈరోజు వాళ్లు మ్యాచ్ను మలుపు తిప్పారు. ఫైనల్కు చేరేసరికి మాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఏ ఆటలోనైనా గెలుపోటములు సహజమే. అందులో ఏదైనా జరగొచ్చు’ అని న్యూజిలాండ్ కెప్టెన్ విచారం వ్యక్తం చేశాడు.
అతిపెద్ద విజయం..గర్వంగా ఉంది: ఆరోన్ ఫించ్
ఇక ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ మాట్లాడుతూ.. తమ జట్టు తరఫున తొలి టీ20 ప్రపంచకప్ అందుకోవడం కెప్టెన్గా గర్వంగా ఉందన్నాడు. ‘ఇది అతిపెద్ద విజయం. ఈ ఘనత సాధించిన తొలి ఆస్ట్రేలియా జట్టుగా నిలవడం అద్భుతంగా ఉంది. మా జట్టులో పలువురు అత్యద్భుత వ్యక్తిగత ప్రదర్శనలు చేశారు. మరికొన్ని మ్యాచ్ల్లో జట్టుగా రాణించాం. వార్నర్ పని అయిపోయిందని చాలా మంది విమర్శలు చేశారు. అలాంటప్పుడే అతడు మరింత బాగా ఆడతాడు. నా మటుకు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అంటే ఆడం జంపా. ఇక మిచెల్ మార్ష్ ఇన్నింగ్స్ ఆరంభించిన తీరు అమోఘం. వేడ్, స్టోయినిస్ కూడా ఈ టోర్నీలో బాగా ఆడారు’ అని ఫించ్ సంతోషం వ్యక్తం చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్