IND vs PAK: ఇది టీమ్ఇండియాకు అత్యంత ఘోర పరాభవం: గావస్కర్
ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియా తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలవ్వడంపై దిగ్గజ ఆటగాళ్లు స్పందించారు...
ఇంటర్నెట్డెస్క్: ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియా తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలవ్వడంపై దిగ్గజ ఆటగాళ్లు స్పందించారు. మ్యాచ్ అనంతరం జరిగిన విశ్లేషణ కార్యక్రమంలో మాజీ సారథి సునీల్ గావస్కర్ మాట్లాడుతూ.. ఇది భారత జట్టుకు అత్యంత ఘోర పరాభవమని చెప్పాడు. అయితే, రాబోయే మ్యాచ్ల్లో టీమ్ఇండియా పుంజుకుంటుందని, ప్రపంచకప్లో మిగతా జట్లను ఓడించి ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. జరిగిన దాని గురించి ఆలోచించకుండా ఇకపై ఆడాల్సిన మ్యాచ్ల మీద దృష్టిసారించాలని సూచించాడు.
మరోవైపు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం ఈ ఓటమిపై ట్విటర్ వేదికగా స్పందించాడు. పాకిస్థాన్ బాగా ఆడిందని మెచ్చుకున్నాడు. తొలి మ్యాచ్లోనే అద్భుత ప్రదర్శన చేసి టోర్నీలో శుభారంభం చేసిందన్నాడు. అలాగే టీమ్ఇండియా ఈ ఓటమి నుంచి బలంగా పుంజుకుంటుందని అభిప్రాయపడ్డాడు. ఈ క్రమంలోనే వీవీఎస్ లక్ష్మణ్ సైతం పాకిస్థాన్ను అభినందిస్తూనే టీమ్ఇండియా బలంగా పుంజుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రపంచకప్ టోర్నీల్లో టీమ్ఇండియాతో వరుస ఓటములను దాటడానికి పాకిస్థాన్ అద్భుతమైన ప్రదర్శన చేసిందని, షహీన్ అఫ్రిది ఆదిలోనే రెండు వికెట్లు తీసి పాక్ను ఆధిపత్యంలో నిలబెట్టాడని వీవీఎస్ ప్రశంసించాడు. అలాగే ఛేదనలో ఆ జట్టు ఓపెనర్లు బాబర్, రిజ్వాన్ అత్యద్భుతంగా ఆడారన్నాడు. ఇకపై టీమ్ఇండియా చేయాల్సింది చాలా ఉందని, అయితే.. బలంగా పుంజుకునే శక్తి కోహ్లీసేనకు ఉందని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని