IND vs PAK: భారత్ ఓటమికి కారణాలు చెప్పిన సచిన్.. ఇంతకీ ఏమన్నాడు..?
టీ20 ప్రపంచకప్లో పాకిస్థా్న్ చేతిలో టీమ్ఇండియా ఓటమికి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే టీమ్ఇండియా మాజీ కెప్టెన్, బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ సైతం...
ఇంటర్నెట్డెస్క్: టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ చేతిలో టీమ్ఇండియా ఓటమికి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే టీమ్ఇండియా మాజీ కెప్టెన్, బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ సైతం ఈ మ్యాచ్పై తన విశ్లేషణను పంచుకున్నాడు. ఫేస్బుక్లో ఓ వీడియో పోస్టు చేసిన సచిన్ ఇలా చెప్పుకొచ్చాడు.. ఈ మ్యాచ్లో పాకిస్థాన్ పూర్తి ఆధిపత్యం చెలాయించిందని, పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్నా భారత్ ఇంచుమించు 20-25 పరుగులు తక్కువ స్కోర్ సాధించిందని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా షహీన్ అఫ్రిది విసిరిన అప్ఫ్రంట్ బంతులను ఎదుర్కొనే సమయంలో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ సరైన ఫుటవర్క్తో కనిపించలేదన్నాడు. పాక్ పేసర్ గంటకు 140కిమీ వేగంతో బంతులు విసురుతుంటే.. మన బ్యాట్స్మెన్ అందుకు తగ్గట్టు క్రీజులో లేరన్నాడు. మరోవైపు పాక్ జట్టు తమ బౌలర్లను కచ్చితమైన ప్రణాళికతో సమర్థవంతంగా వినియోగించుకుందని, ఒకరి తర్వాత ఒకరిని అవసరాలకు తగ్గట్టు బౌలింగ్ చేయించిందని సచిన్ వివరించాడు.
అలాగే టీమ్ఇండియా చాలా రోజులుగా పాకిస్థాన్తో మ్యాచ్లు ఆడలేదని, దీంతో ఆ జట్టును అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుందని సచిన్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే టీమ్ఇండియా ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయిందని గుర్తుచేశాడు. సూర్యకుమార్ రెండు షాట్లు బాగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడన్నాడు. అనంతరం కోహ్లీ, పంత్ భాగస్వామ్యం నిర్మించాలని చూసినా అవసరమైనంత ధాటిగా ఆడలేదని అభిప్రాయపడ్డాడు. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం భారత్ అవకాశాలను దెబ్బ తీసిందన్నాడు. మరోవైపు పాక్ లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా ఆదిలోనే వికెట్లు తీయలేకపోయిందని సచిన్ వివరించాడు. అలా చేసిఉంటే పరిస్థితులు మరోలా ఉండేవని, దాంతో పాక్ బ్యాట్స్మెన్ ఒత్తిడిలోకి వెళ్లేవారని పేర్కొన్నాడు. భారత బ్యాటింగ్ సమయంలో పాకిస్థాన్ అదే చేసిందని స్పష్టం చేశాడు. ఇక పాక్ ఓపెనర్లు రిజ్వాన్, బాబర్ మెల్లిగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ టీమ్ఇండియాపై ఒత్తిడి తెచ్చారన్నాడు. తేలికైన బంతుల్ని బౌండరీలకు తరలిస్తూనే సింగిల్స్, డబుల్స్తో ఇన్నింగ్స్ను నిర్మించారని తెలిపాడు. అయితే, టీమ్ఇండియా కీలక సమయాల్లో ఒత్తిడి పెంచి పైచేయి సాధించే అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయిందని దిగ్గజ బ్యాట్స్మెన్ తన అభిప్రాయాలు వ్యక్తం చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని