IND vs PAK: టీమ్ఇండియా అంతా మ్యాచ్ విన్నర్లే..
‘క్లాస్లో ఉన్నప్పుడు ఎవ్వడైనా ఆన్సర్ చెప్తాడు. కానీ, ఎగ్జామ్లో రాసినోడే టాపర్ అవుతాడు’ ఇది జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్. టీమ్ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్లకు సరిగ్గా సరిపోతుంది.
పాకిస్థాన్ కన్నా పటిష్ఠంగా భారత్
‘క్లాస్లో ఉన్నప్పుడు ఎవ్వడైనా ఆన్సర్ చెప్తాడు. కానీ, ఎగ్జామ్లో రాసినోడే టాపర్ అవుతాడు’ ఇది జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్. టీమ్ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్లకు సరిగ్గా ఇది సరిపోతుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు ఎన్నో హోరాహోరీ మ్యాచ్లు జరిగినా వన్డే, టెస్టు క్రికెట్లో వాస్తవికంగా దాయాది జట్టుదే పైచేయి. కానీ, ప్రపంచకప్పుల విషయానికొస్తే టీమ్ఇండియానే టాప్. మరీ ముఖ్యంగా టీ20 ప్రపంచకప్పుల్లో భారత్దే సంపూర్ణ ఆధిపత్యం. ఇక ఈ ఆదివారం రెండు జట్ల మధ్య మరో హోరాహోరీ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత జట్ల బలాబలాలేంటో తెలుసుకుందాం.
200వ చారిత్రక మ్యాచ్ ఎవరిది?
ఇప్పటివరకూ ఇరు జట్ల మధ్య మొత్తం 199 అంతర్జాతీయ మ్యాచ్లు జరిగాయి. 1947లో భారత్, పాక్ విడిపోయాక రెండు దేశాలు ఐసీసీలో శాశ్వత సభ్యత్వ దేశాలుగా చేరాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని రసవత్తర పోరులు జరిగినా వేటికవే ప్రత్యేకం. అందులో పాకిస్థాన్ మొత్తం 86 మ్యాచ్లు కైవసం చేసుకోగా భారత్ 70 విజయాలు సాధించింది. ఐసీసీ ఈవెంట్లు కాకుండా ద్వైపాక్షిక సిరీస్లు లేదా ఇతర టోర్నీల్లో పాకిస్థాన్దే పైచేయి. ఇరు జట్ల మధ్య జరిగిన మొత్తం 59 టెస్టుల్లో పాకిస్థాన్ 12, టీమ్ఇండియా 9 విజయాలు సాధించాయి. మరో 38 టెస్టులు డ్రాగా ముగిశాయి. అలాగే 132 వన్డేల్లో దాయాది జట్టు 73, భారత్ 55 విజయాలు సాధించాయి. ఇక టీ20ల్లో మొత్తం 8 మ్యాచ్లు జరగ్గా టీమ్ఇండియానే 6 నెగ్గింది. పాకిస్థాన్ 1 మ్యాచ్ గెలుపొందింది. ఇందులో ఐదు మ్యాచ్లు ప్రపంచకప్లలో జరిగినవే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఇరు జట్ల మధ్య ఆదివారం జరిగే 200వ చారిత్రక మ్యాచ్లో టీమ్ఇండియానే ఫేవరెట్గా కనిపిస్తోంది.
ఇక్కడంతా మ్యాచ్ విన్నర్లే..
ప్రస్తుత టీమ్ఇండియా పాకిస్థాన్ కన్నా అన్ని విభాగాల్లో బలంగా ఉంది. బ్యాటింగ్లో ప్రపంచంలోని ఏ జట్టుకు తీసిపోని విధంగా సీనియర్లు, జూనియర్లు రెచ్చిపోతున్నారు. ఈవారం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లతో ఆడిన రెండు వార్మప్ మ్యాచ్ల్లోనూ ఇదే విషయం స్పష్టమైంది. మరోవైపు ఇటీవలే ముగిసిన ఐపీఎల్లో భారత ఆటగాళ్లంతా జోరు చూపించారు. సన్నాహక మ్యాచ్ల్లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ లాంటి ఆటగాళ్లు తమ బ్యాటింగ్ పవర్ చూపించి పాకిస్థాన్తో కీలకపోరుకు ముందు ఫామ్లోకి వచ్చారు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య, రిషభ్ పంత్ చెలరేగితే టీమ్ఇండియాకు తిరుగుండదు. ఆల్రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్ తుదిజట్టులో స్థానం కోసం పోటీపడుతున్నారు. అయితే, ఇందులో జడేజా కచ్చితంగా ఉంటాడనే చెప్పొచ్చు. ఐపీఎల్లో అతడు బంతితో పాటు బ్యాట్తోనూ రాణించిన సంగతి తెలిసిందే. అతడికి తోడుగా మరో స్పిన్నర్ ఎంపికైనా లేక శార్దూల్ ఠాకూర్ను తీసుకున్నా పాకిస్థాన్తో మ్యాచ్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. చివరగా బౌలింగ్లో జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భువి వికెట్లు తీయకపోయినా వార్మప్ మ్యాచ్లో తక్కువ పరుగులిచ్చి పొదుపుగా బౌలింగ్ చేశాడు. దీంతో ఎలా చూసిన టీమ్ఇండియా మొత్తం మ్యాచ్ విన్నర్లే కనిపిస్తున్నారు.
అక్కడ నలుగురైదుగురే..
మరోవైపు పాకిస్థాన్ జట్టులో నలుగురైదుగురు మినహాయిస్తే మిగతా ఆటగాళ్ల గురించి పెద్దగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్, కెప్టెన్ బాబర్ అజామ్, ఫకర్ జమాన్ మాత్రమే టాప్ ఆర్డర్లో పరుగులు చేస్తూ ఫామ్లో ఉన్నారు. టీమ్ఇండియా వీరిని కట్టడి చేస్తే పాకిస్థాన్ భారీ స్కోర్ చేయకుండా అడ్డుకునే వీలుంది. బౌలింగ్లో షాహీన్ అఫ్రిది ఒక్కడే కాస్త ఫరవాలేదనిపిస్తున్నాడు. మరోవైపు హారిస్ రౌఫ్, హసన్ అలీ ఎప్పుడెలా బంతులేస్తారో అర్థంకాని పరిస్థితి. దీంతో టీమ్ఇండియా బ్యాట్స్మెన్ వీరిపై ఆధిపత్యం చలాయిస్తే పరుగుల వరద పారించొచ్చు. అందుకు ఇటీవల పాక్ ఆడిన రెండు వార్మప్ మ్యాచ్లే నిదర్శనం. వెస్టిండీస్పై సునాయాస విజయం సాధించిన ఆ జట్టు దక్షిణాఫ్రికాతో భారీ స్కోర్ సాధించినా ఓటమిపాలైంది. పాక్ బౌలర్లను సఫారీలు దంచికొట్టారు. దీంతో టీమ్ఇండియా బ్యాట్స్మెన్ సైతం తొలి మ్యాచ్లో రెచ్చిపోతే పని తేలికవుతుంది. అయితే, పాక్ను తేలిగ్గా తీసుకుంటే పొరపాటే. తమదైన రోజు ఆ జట్టు ఎంతటి గొప్ప జట్టునైనా ఓడించగలదు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ఎంత బాగా ఆడితే అంత మంచిది. మరోవైపు దక్షిణాఫ్రికాతో ఓటమిపాలవ్వడం పాక్ ఆటగాళ్లపై కాస్త ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి మేటి జట్లపై విజయం సాధించిన టీమ్ఇండియా అదే ఆత్మవిశ్వాసంతో పాక్ను ఓడించేలా పటిష్ఠంగా కనిపిస్తోంది.
-ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
భారత మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar) బర్త్ డే సందర్భంగా పెద్దఎత్తున శుభాకాంక్షలు వచ్చాయి. మాజీ క్రికెటర్లు ప్రత్యేకంగా పోస్టులు పెట్టారు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యంత దారుణంగా ట్రోలింగ్కు గురైన కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya). ఏ మైదానంలో చూసినా అతడిని హేళన చేస్తూ ఫ్యాన్స్ హోరెత్తించారు. -
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
లఖ్నవూ చేతిలో చెన్నైకి వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఈసారి సొంత మైదానంలోనే పరాజయం పొందడంతో ఆ జట్టు అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ తన టీమ్ను వెల్లడించాడు. -
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
David Warner: దిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్.. భారత గుర్తింపు కార్డు ఆధార్ కోసం పరిగెడుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో అతడు హిందీలో మాట్లాడటం విశేషం. -
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
సెంచరీతో చెన్నైపై భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో లఖ్నవూ బ్యాటర్ స్టాయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఒకదశలో ఓడిపోతామని భావించిన ఆ జట్టును చివరి వరకూ క్రీజ్లో ఉండి విజయతీరాలకు చేర్చాడు. -
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ సెంచరీతో అలరించినా.. లఖ్నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, కొత్త కస్టమర్లు చేర్చుకోవడంపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ