T20 World Cup: భారత్ - స్కాట్లాండ్ మ్యాచ్.. కొత్త రికార్డులు
టీ20 ప్రపంచకప్లో భాగంగా శుక్రవారం రాత్రి స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే...
ఇంటర్నెట్డెస్క్: టీ20 ప్రపంచకప్లో భాగంగా శుక్రవారం రాత్రి స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ జట్టు నిర్దేశించిన 86 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (50; 19 బంతుల్లో 6x4, 3x6), రోహిత్ శర్మ (30; 16 బంతుల్లో 5x4, 1x6) దంచికొట్టడంతో టీమ్ఇండియా 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. సెమీస్ రేసులో నిలవాలంటే స్కాట్లాండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని 7.1 ఓవర్లలో భారత్ ఛేదించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఓపెనర్లు దొరికిన బంతిని దొరికినట్లు చితక్కొట్టారు. దీంతో పలు ఆసక్తికరమైన రికార్డులు నమోదయ్యాయి.
ఈ మ్యాచ్లో టీమ్ఇండియా నమోదు చేసిన రికార్డులివే..
* టీ20ల్లో ఎక్కువ బంతులు(81 బంతులు) మిగిలుండగానే టీమ్ఇండియా సాధించిన అత్యుత్తమ విజయం ఇదే.
* టీ20 ఫార్మాట్ పవర్ప్లేలో భారత్ సాధించిన అత్యధిక స్కోరు ఇదే(82/2)
* ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ 18 బంతుల్లో అర్ధశతకం నమోదు చేశాడు. 2007లో యువరాజ్ సింగ్(12 బంతుల్లో అర్ధ శతకం) తర్వాత టిమ్ఇండియాకిదే వేగవంతమైన అర్థశతకం.
టీ20ల్లో ఎక్కువ బంతులు మిగిలి ఉండగా టీమ్ఇండియా సాధించిన ఇతర విజయాలు..
* 2016లో మీర్పూర్ వేదికగా యూఏఈ జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియా 59 బంతులు మిగిలుండగా విజయం నమోదు చేసింది.
* 2016లోనే హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో 41 బంతులు మిగిలుండగా గెలిచింది.
టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో ఎక్కువ బంతులు మిగిలుండగా విజయాలు సాధించిన ఇతర జట్లు
* 2014లో చిట్టగాంగ్ వేదికగా నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో శ్రీలంక 90 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది.
* ప్రస్తుత ప్రపంచకప్లోనే దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో తలపడిన ఆస్ట్రేలియా 82 బంతులు మిగులుండగా విజయం దక్కించుకుంది.
* 2021లోనే షార్జా వేదికగా నెదర్లాండ్స్తోనే జరిగిన మ్యాచ్లో శ్రీలంక 77 బంతులు మిగులుండగా గెలిచింది.
* 2007లో డర్బన్ వేదికగా కెన్యాతో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ 74 బంతులు మిగులుండగా విజయం.
* 2021లో దుబాయ్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 70 బంతులు మిగులుండగా విజయం.
టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో పవర్ప్లేలో అత్యధిక స్కోర్లు..
* 2014లో సైలెట్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో నెదర్లాండ్స్ పవర్ప్లేలో సాధించిన అత్యధిక స్కోర్ 91/1.
* 2016లో ముంబయి వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ పవర్ప్లే స్కోర్ 89/3. ఇదే మ్యాచ్లో దక్షిణాఫ్రికా సైతం పవర్ప్లేలో 83/0తో నిలిచింది.
* 2009లో ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో తలపడిన మ్యాచ్లో వెస్టిండీస పవర్ప్లే స్కోర్ 83/0.
* 2021లో దుబాయ్ వేదికగా స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియా పవర్ప్లే స్కోర్ 82/2.
టీ20 పవర్ప్లేలో టీమ్ఇండియా అత్యధిక స్కోర్లు..
* గతరాత్రి దుబాయ్ వేదికగా స్కాట్లాండ్పైనే టీమ్ఇండియా అత్యధిక స్కోర్ 82/2.
* 2018లో జోహెనస్బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో టీమ్ఇండియా స్కోర్ 78/2.
* 2009లో నాగ్పూర్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 77/1.
* 2007లో జోహెనస్బర్గ్ వేదికగా న్యూజిలాండ్తో తలపడిన మ్యాచ్లో 76/1.
టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో అత్యంత వేగవంతమైన అర్ధశతకాలు..
* 2007లో డర్బన్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో యువరాజ్ సింగ్ 12 బంతుల్లో అర్ధశతకం.
* 2014లో సైలెట్లో జరిగిన మ్యాచ్లో ఐర్లాండ్పై నెదర్లాండ్స్ బ్యాట్సమన్ స్టీఫన్ మైబర్గ్ 17 బంతుల్లో అర్ధశతకం.
* 2014లో మీర్పూర్ వేదికగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ గ్లెన్మాక్స్వెల్ 18 బంతుల్లో అర్ధశతకం.
* 2021లో దుబాయ్ వేదికగా స్కాట్లాండ్తో తలపడిన మ్యాచ్లో కేఎల్ రాహుల్ 18 బంతుల్లో అర్ధశతకం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
ఏయూని వదలని ‘జగనన్న’ పాట వీడియో
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
-
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
-
యూట్యూబర్ దుస్సాహసం.. ఎయిర్పోర్టు రన్వేపై వీడియో చిత్రీకరించి..
-
ఎమ్మెల్యేకు వాలంటీరు సత్కారం... ఎన్నికల అధికారులకు తెదేపా ఫిర్యాదు