T20 World cup: టీమ్‌ఇండియా షెడ్యూల్ ఇదే.. ఏ రోజు ఏ జట్టుతో తెలుసా?

టీమ్‌ఇండియా ఈ మెగా ఈవెంట్‌లో ఏయే రోజు ఏయే జట్టుతో పోటీపడనుందో స్పష్టత వచ్చింది...

Updated : 23 Oct 2021 17:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌ అర్హత పోటీలు పూర్తయ్యాయి. గ్రూప్‌-ఏలో బంగ్లాదేశ్‌, శ్రీలంక జట్లు అర్హత సాధించగా.. గ్రూప్‌-బీ నుంచి స్కాట్లాండ్, నమీబియా జట్లు సూపర్‌-12 దశకు చేరుకున్నాయి. దీంతో నేటి నుంచి ప్రధాన మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా ఈ మెగా ఈవెంట్‌లో ఏ రోజు ఏయే జట్టుతో పోటీపడనుందో స్పష్టత వచ్చింది. తొలుత ఆదివారం చిరకాల ప్రాత్యర్థి పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్‌లో కోహ్లీసేన ఢీకొననుంది. ఆ తర్వాత ఈనెల 31న న్యూజిలాండ్‌తో, నవంబర్‌ 3న అఫ్గానిస్థాన్‌తో, 5న స్కాట్లాండ్‌తో, 8న నమీబియాతో తలపడనుంది. ఇక తొలి సెమీఫైనల్‌ 10వ తేదీన, రెండో సమీస్‌ 11న, ఫైనల్‌ 14న జరగనున్నాయి. అయితే, టీమ్‌ఇండియా సూపర్‌-12లో పాక్, న్యూజిలాండ్‌ జట్లను ఓడిస్తే కచ్చితంగా సెమీస్‌ చేరే అవకాశం ఉంటుంది. ప్రపంచకప్‌ పూర్తి షెడ్యూల్‌ ఇక్కడ చూడండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని