Virat Kohli: టీమ్ఇండియాపై పాక్ విష ప్రచారం.. అసలు నిజం ఏంటంటే?
టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియా గత రెండు మ్యాచ్ల్లో అఫ్గానిస్థాన్, స్కాట్లాండ్లపై విజయం సాధించాక పాకిస్థాన్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో విష ప్రచారం చేస్తున్నారు...
అఫ్గాన్ టాస్ గెలిచినప్పుడు కోహ్లీ అలా చెప్పలేదు
ఇంటర్నెట్డెస్క్: టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియా గత రెండు మ్యాచ్ల్లో అఫ్గానిస్థాన్, స్కాట్లాండ్లపై విజయం సాధించాక పాకిస్థాన్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో విష ప్రచారం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా గత బుధవారం అఫ్గాన్తో జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియా 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో సోషల్ మీడియాలో తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. అఫ్గాన్తో జరిగిన మ్యాచ్లో టాస్ వీడియోను జత చేస్తూ టీమ్ఇండియాపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తున్నారు. అందులో అఫ్గాన్ కెప్టెన్ మహ్మద్ నబి టాస్ గెలిచాక ‘బౌలింగ్ ఫస్ట్’ అనే మాటలు వినిపించాయి. అయితే.. ఆ మాటలు కోహ్లీ అన్నాడని, దీంతో టీమ్ఇండియా ఈ మ్యాచ్ను ఫిక్సింగ్ చేసిందని పాక్ అభిమానులు పోస్టులు పెట్టారు.
నిజం ఏమిటంటే..
ఏ మ్యాచ్లోనైనా టాస్ గెలిచిన కెప్టెన్ తాము బ్యాటింగ్ ఎంచుకుంటామా.. లేక బౌలింగ్ తీసుకుంటామా అనే విషయాన్ని ప్రత్యర్థి సారథికి తెలపడం ఆనవాయితి. ఈ క్రమంలోనే అప్పుడు టాస్ గెలవగానే నబి.. కోహ్లీతో ‘బౌలింగ్ ఫస్ట్’ అన్నాడు. ఆ సమయంలో కోహ్లీ పెదవులు కూడా కదలలేదు. తర్వాత వ్యాఖ్యాత దగ్గరకు వెళ్లిన నబీ.. తాము తొలుత బౌలింగ్ చేస్తామని చెప్పాడు. ఈ విషయాన్ని ఓ జాతీయ మీడియా ధ్రువీకరించింది. ఆ మ్యాచ్కు సంబంధించి టాస్ సందర్భంలో తీసిన వీడియోలు ఒకటికి రెండుసార్లు పరిశీలించి.. అందులోని నిజానిజాలు వెలుగులోకి తీసుకొచ్చింది. కోహ్లీ ఆ సమయంలో నబీతో ఏం చెప్పలేదని.. ఇది కేవలం పాక్ అభిమానులు టీమ్ఇండియాపై చేస్తోన్న విష ప్రచారమని బట్టబయలు చేసింది. నబీ చెప్పిన ‘ఫస్ట్ బౌలింగ్’ అనే మాటలను కోహ్లీ చెప్పినట్లు పాక్ అభిమానులు ఫేక్ న్యూస్ సృష్టించారని స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం