T20 World Cup: రోహిత్ను కాదని ఇషాన్ను ఎందుకు తీసుకొచ్చారు..?
న్యూజిలాండ్తో పోరులో టీమ్ఇండియా ఓటమిపాలవ్వడం కంటే ఓడిన తీరే అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది. పాకిస్థాన్తో ఓడినప్పుడు కూడా సగటు అభిమానికి ఇలాంటి అసహనానికే గుయ్యాడు...
టీమ్ఇండియా వ్యూహాలపై మాజీల ఆశ్చర్యం..
ఇంటర్నెట్డెస్క్: న్యూజిలాండ్తో పోరులో టీమ్ఇండియా ఓటమిపాలవ్వడం కంటే ఓడిన తీరే అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది. పాకిస్థాన్తో ఓడినప్పుడు కూడా సగటు అభిమాని ఇలాంటి అసహనానికే గుయ్యాడు. అయితే, కివీస్తో పోరులో తమ తప్పులు సరిదిద్దుకొని బాగా ఆడతారని ఆశించిన భారత బ్యాట్స్మెన్ మరోసారి చేతులెత్తేయడంతో ఏం మాట్లాడాలో అర్థంకావడం లేదు. మరోవైపు ఈ మ్యాచ్లో రోహిత్, రాహుల్ హిట్ పెయిర్ని కాదని, ఇషాన్తో ఓపెనింగ్ చేయించాలనే సలహా ఎవరిచ్చారో తెలియదు కానీ, ఈ వ్యూహం పూర్తిగా బెడిసికొట్టింది. దీనిపై పలువురు క్రికెట్ దిగ్గజాలు ఏమన్నారో వారి మాటల్లో..
* టీమ్ఇండియా గత రెండు మ్యాచ్ల్లో పట్టుదలతో ఆడలేకపోవడం దురదృష్టకరం. ఎవరైనా స్కోర్బోర్డుపై సరైన పరుగులు చేయకపోతే మ్యాచ్లో ఆధిపత్యం చెలాయించలేరు. 111 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవాలంటే అద్భుతం జరగాలి. ఈ రెండు మ్యాచ్ల్లో టీమ్ఇండియా తేలిపోయింది. పొట్టి ఫార్మాట్లో ఆదిలోనే పైచేయి సాధించకపోతే తర్వాత చాలా కష్టమవుతుంది. అయితే, కొన్నిసార్లు అన్ని నిర్ణయాలు కెప్టెన్ తీసుకోలేడు. రోహిత్ను వన్డౌన్ బ్యాట్స్మన్గా పంపడం అనేది కోహ్లీ ఒక్కడి నిర్ణయమే కాకపోయి ఉండొచ్చు. ధోనీ, రవిశాస్త్రి లాంటి వారు ఉండగా ఆ నిర్ణయం తీసుకోలేడు. ఏదేమైనా రోహిత్ను అలా పంపడం తప్పుడు నిర్ణయమే. అతడెన్నో ఏళ్లుగా ఓపెనర్గా రాణిస్తున్నాడు. ఈ ఒక్క చర్యతో బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం మారింది -మదన్లాల్
* బ్యాటింగ్ ఆర్డర్లో టీమ్ఇండియా ఈరోజు చేసిన మార్పు బెడిసికొట్టింది. రోహిత్ లాంటి గొప్ప బ్యాట్స్మన్ మూడో స్థానంలో ఆడటం, అక్కడ ఎంతో బాగా రాణించే కోహ్లీ నాలుగులో ఆడటం అన్నీ విఫలమయ్యాయి. ఇషాన్ లాంటి యువకుడికి ఓపెనింగ్ చేసే బాధ్యతలు అప్పగించారు. అతడు కొడితే కొడతాడు. లేకపోతే లేదు. అతడి లాంటి ఆటగాడు నాలుగు లేదా ఐదులో రావాల్సింది. అప్పుడు పరిస్థితులకు తగ్గట్టు ఆడగలడు. ఇప్పుడిలా చేయడం ద్వారా ‘రోహిత్.. నువ్వు లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ ట్రెంట్బౌల్ట్ను ఎదుర్కోలేవు’ అని చెప్పినట్లు అవుతుంది. దీంతో ఇన్నాళ్లుగా ఓపెనింగ్ చేస్తున్న అతడికి తన బ్యాటింగ్ సామర్థ్యంపై సందేహం కలిగించినట్లు అవుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో ఇషాన్ 70 పరుగులు చేసుంటే మనమంతా మెచ్చుకునే వాళ్లం. కానీ, అలా జరగనప్పుడే ఇలా విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. -సునీల్ గావస్కర్
* ఈ మ్యాచ్లో టీమ్ఇండియా ఓటమిపాలవ్వడంపై కెప్టెన్ కోహ్లీ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అయితే, అందుకు కోహ్లీ ఒక్కడే కారణం కాదు. ఈ ఓటములకు జట్టు మొత్తంతో పాటు కోచ్లు కూడా బాధ్యత వహించాలి. ఇది భారత అభిమానులకు భయపెట్టే హలోయిన్ డేగా మారింది. -అజహరుద్దీన్
* టీమ్ఇండియా చూస్తుంటే ఈ ప్రపంచకప్ నుంచి వైదొలుగుతున్నట్లు కనిపిస్తోంది. ఎంతో నైపుణ్యమున్న ఆటగాళ్లతో కూడిన ఆ జట్టు సరైన ఆటతీరు, ఆలోచనా విధానంతో కనపడట్లేదు. వాళ్లింకా 2010కాలం నాటి క్రికెటే ఆడుతున్నారు.
ఒక విధంగా నిజం చెప్పాలంటే.. ఆ జట్టులో ఉన్న నైపుణ్యమైన ఆటగాళ్లు, రిజర్వ్ బెంచ్లో ఉన్నంత బలగంతో కొన్నేళ్లుగా పరిమిత ఓవర్ల క్రికెట్లో ఏమీ సాధించలేకపోయారు. ఇకపై టీమ్ఇండియా ఆటగాళ్లను ప్రతి జట్టుతో ఆడించాలి. వాళ్ల ఆటగాళ్లను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర లీగుల్లో ఆడించేలా చేయాలి. - మైఖేల్ వాన్
* టీమ్ఇండియా ప్రదర్శన నిరాశకు గురిచేసింది. ఆటగాళ్ల ఆటతీరు ఏమాత్రం బాలేదు. గతంలో పలుమార్లు మాదిరే షాట్ల సెలెక్షన్ కూడా అస్సలు బాలేదు. ఈ దెబ్బతో టీమ్ఇండియా సెమీస్ చేరకుండా న్యూజిలాండ్ అడ్డుకుంది. ఇది టీమ్ఇండియాకు బాధ కలిగించేదే అయినా కచ్చితంగా జట్టులో ఎక్కడ లోపాలున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. -వీరేంద్ర సెహ్వాగ్
* ఈ ఓటమి టీమ్ఇండియాను బాధపెట్టాలి. బ్యాట్తో సరిగ్గా ఆడలేకపోయారు. షాట్ సెలెక్షన్ కూడా నమ్మశక్యంగా లేదు. కివీస్ బౌలర్లు అద్భుతంగా బంతులేసినా భారత బ్యాట్స్మెన్ వాళ్ల పని తేలిక చేశారు. వాళ్ల నెట్రన్రేట్ కూడా మెరుగ్గా ఉండటంతో ఇక సెమీస్ ఫైనల్లో చోటు అందని ద్రాక్షలా మారింది. -వీవీఎస్ లక్ష్మణ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్