Virat Kohli: వన్డే కెప్టెన్గా కోహ్లీ కొనసాగుతాడా.. లేదా?.. కొద్ది రోజుల్లో స్పష్టత..!
టీమ్ఇండియా టీ20 సారథిగా ఇటీవలే తప్పుకొన్న విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్గా కొనసాగుతాడా లేదా అనే విషయపై మరికొద్ది రోజుల్లో తేలనుంది. వచ్చే ఏడాది అక్టోబర్లో ఆస్ట్రేలియాలో...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా టీ20 సారథిగా ఇటీవలే తప్పుకొన్న విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్గా కొనసాగుతాడా లేదా అనే విషయపై మరికొద్ది రోజుల్లో స్పష్టత రానుంది. వచ్చే ఏడాది అక్టోబర్లో ఆస్ట్రేలియాలో మరో టీ20 ప్రపంచకప్ టోర్నీ ఉన్న నేపథ్యంలో అంతకుముందు టీమ్ఇండియా కేవలం తొమ్మిది వన్డేలే ఆడనుంది. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ పర్యటనల్లో చెరో మూడు వన్డేలు ఆడనుండగా భారత్లోనూ మరో మూడు మ్యాచ్లే ఆడనుంది. అయితే, 2023లో భారత్లోనే వన్డే ప్రపంచకప్ కూడా ఖరారైన నేపథ్యంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమ్ఇండియాకు ఇద్దరు కెప్టెన్లు అవసరం లేదనే అభిప్రాయం బీసీసీఐ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
టీ20ల్లాగే వన్డేల్లోనూ రోహిత్కు పూర్తిస్థాయి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే 2023 నాటికి జట్టును సమర్థవంతంగా నడిపించేందుకు వీలుంటుందని పలువురు భావిస్తున్నారు. దీంతో రాబోయే దక్షిణాఫ్రికా పర్యటనకు సంబంధించి జట్టును ఎంపిక చేసినప్పుడే వన్డే ఫార్మాట్కు కోహ్లీ కెప్టెన్సీపై స్పష్టత రానుంది. ఈ శనివారం కోల్కతాలో బీసీసీఐ ఏజీఎం సమావేశం జరగనుంది. అక్కడ చేతన్ శర్మ సెలెక్షన్ ప్యానెల్ టెన్యూర్ను పొడిగించనున్నారు. అప్పుడు కోహ్లీ భవితవ్యంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఏదేమైనా కోహ్లీ ఒక్క పెద్ద ట్రోఫీ కూడా అందించలేని పరిస్థితుల్లో అతడిని తొలగించాలనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. కానీ, దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, కార్యదర్శి జైషా తుది నిర్ణయం తీసుకోవాలి.
మరోవైపు తాజాగా దక్షిణాఫ్రికాలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న పరిస్థితుల్లో ఆ పర్యటనపై సందేహాలు నెలకొన్నాయి. అయితే, టోర్నీ యథావిథిగా కొనసాగుతుందని బీసీసీఐ అధికారులు బుధవారం మీడియాకు స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయన్నారు. దక్షిణాఫ్రికా పర్యటనకు సంబంధించిన జట్టును త్వరలోనే ప్రకటిస్తామన్నారు. టోర్నీని రద్దు చేసుకోవాలని భారత ప్రభుత్వం ఏమైనా అత్యవసర ఆదేశాలు జారీ చేస్తే తప్ప షెడ్యూల్ ప్రకారం టోర్నీ జరుగుతుందని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..