IND vs SA: హోటల్‌ సిబ్బందితో టీమ్‌ఇండియా క్రికెటర్ల డాన్స్‌.. చూడండి

టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికా పర్యటనలో తొలి మ్యాచ్‌తోనే చరిత్ర సృష్టించి ఆకట్టుకుంది. సెంచూరియన్‌ వేదికగా సూపర్‌ స్పోర్ట్‌ మైదానంలో జరిగిన మొదటి టెస్టులో...

Updated : 31 Dec 2021 09:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికా పర్యటనలో తొలి మ్యాచ్‌తోనే చరిత్ర సృష్టించి ఆకట్టుకుంది. సెంచూరియన్‌ వేదికగా సూపర్‌ స్పోర్ట్‌ మైదానంలో జరిగిన మొదటి టెస్టులో కోహ్లీసేన 113 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మైదానంలో గెలుపొందిన తొలి ఆసియా జట్టుగా రికార్డులకెక్కింది. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా ఆటగాళ్లంతా ఆనందంలో మునిగితేలారు. మ్యాచ్‌ అనంతరం హోటల్‌కు చేరుకున్న వీరికి అక్కడి సిబ్బంది ఘన స్వాగతం పలికారు.

డాన్స్‌ చేస్తోన్న హోటల్‌ సిబ్బందిని చూసి భారత క్రికెటర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, మహ్మద్‌ సిరాజ్‌, ఛెతేశ్వర్‌ పుజారా సైతం స్టెప్పులేశారు. ఈ వీడియోను అశ్విన్‌ తన ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకున్నాడు. మ్యాచ్‌ అనంతరం ఎప్పుడూ ఉండే ఫొటోలు బోర్‌ కొడతాయి. దీంతో ఈ సందర్భాన్ని మరింత మధుర జ్ఞాపకంగా మిగిల్చేందుకు పుజారా.. తొలిసారి సిరాజ్‌తో కలిసి స్టెప్పులేశాడు. ఇదో గొప్ప విజయం’ అంటూ అశ్విన్‌ ఆ వీడియోను పంచుకున్నాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని