IND vs ENG: నాలుగోరోజు తేలిపోయిన భారత్.. ఇంగ్లాండ్ ఘన విజయం
ఇంగ్లాండ్తో జరిగిన మూడో టెస్టులో టీమ్ఇండియా ఓటమిపాలైంది. రెండో ఇన్నింగ్స్లో 278 పరుగులకే ఆలౌటైన కోహ్లీసేన.. ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. దాంతో ఆతిథ్య జట్టు గెలుపొంది ఈ సిరీస్ను 1-1తో సమం చేసింది...
నిరాశపర్చిన టీమ్ఇండియా బ్యాటింగ్
లీడ్స్: ఇంగ్లాండ్తో జరిగిన మూడో టెస్టులో టీమ్ఇండియా ఓటమిపాలైంది. రెండో ఇన్నింగ్స్లో 278 పరుగులకే ఆలౌటైంది. దాంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలోనే సిరీస్ను 1-1తో సమం చేసింది. 212/2 ఓవర్నైట్ స్కోర్తో శనివారం నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్ తొలి సెషన్లోనే మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయింది. భారత బ్యాట్స్మెన్ ఏ దశలోనూ కనీస పోరాటం చేయలేదు. మ్యాచ్ ప్రారంభమైన పది నిమిషాల నుంచే వికెట్ల పతనం మొదలైంది. రాబిన్సన్ 5 వికెట్లతో రెచ్చిపోయి బ్యాట్స్మెన్ను ముప్పుతిప్పలు పెట్టాడు. దాంతో టీమ్ఇండియా బ్యాట్స్మెన్ ఎప్పటిలాగే ఆఫ్సైడ్ బంతులను తప్పుడు అంచనా వేస్తూ వికెట్ల వెనుక క్యాచ్లు సమర్పించుకున్నారు.
మ్యాచ్ ప్రారంభమైన పదినిమిషాల్లోనే పుజారా (91) రాబిన్సన్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయి శతకం చేజార్చుకున్నాడు. కాసేపటికే కెప్టెన్ విరాట్ కోహ్లీ(55) అర్ధశతకం సాధించినా రాబిన్సన్ బౌలింగ్లోనే స్లిప్లో రూట్ చేతికి చిక్కాడు. అప్పటికి భారత్ స్కోర్ 237/4గా నమోదై కష్టాల్లో పడింది. ఆపై వైస్ కెప్టెన్ రహానె(10), పంత్(1), షమి(6), ఇషాంత్(2), జడేజా(30), సిరాజ్(0) కనీస పోరాటం చేయకుండా వెనుదిరిగారు. బుమ్రా(1) నాటౌట్గా నిలిచాడు. చివరికి భారత్ 99.3 ఓవర్లలో 278 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. ఇంగ్లాండ్ బౌలర్లలో రాబిన్సన్ ఐదు వికెట్లు తీయగా ఓవర్టన్ మూడు తీశాడు. అలాగే అండర్సన్, మొయిన్ అలీ చెరో వికెట్ సాధించారు.
రోహిత్, పుజారా పోరాటం వృథా..
అంతకుముందు మూడో రోజు ఓపెనర్ రోహిత్ శర్మ(59), పుజారా అర్ధశతకాలతో రాణించి జట్టును మెరుగైన స్థితిలో నిలిపారు. కఠిన పరిస్థితుల్లోనూ ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు రాబట్టారు. దాంతో భారత్ మూడో రోజు ఆట పూర్తయ్యేసరికి 212/2 స్కోర్తో నిలిచి మ్యాచ్లో పోరాటం చేసేలా కనిపించింది. ఈ క్రమంలోనే నాలుగో రోజు కూడా ఇలాగే ఆడితే మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందని అంతా ఆశించారు. కానీ, భారత బ్యాట్స్మెన్ నాలుగో రోజు ఆడలేకపోయారు. ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి కోహ్లీసేనను కట్టడి చేశారు.
స్కోరుబోర్డు వివరాలు:
భారత్ తొలి ఇన్నింగ్స్: 78 ఆలౌట్.. రోహిత్(19), అండర్సన్ 3 వికెట్లు
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 432 ఆలౌట్.. జో రూట్(121), షమి 4 వికెట్లు
భారత్ రెండో ఇన్నింగ్స్: 278 ఆలౌట్.. పుజారా (91), రాబిన్సన్ 5 వికెట్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
ఐపీఎల్లో ఎలాంటి అనైతిక కార్యకలాపాలు జరగకుండా చూసేందుకు ఏర్పాటైన యాంటీ కరప్షన్ యూనిట్ తన పనిని మొదలు పెట్టింది. -
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు డేవన్ కాన్వే ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా ఆటడం లేదని ఐపీఎల్ మేనేజ్మెంట్ వెల్లడించింది. -
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
ఐపీఎల్లో చెన్నై జట్టును తక్కువ చేయడం సరికాదని భారత మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
మంగళగిరిలో నారా లోకేశ్ నామినేషన్.. తెదేపా శ్రేణుల భారీ ర్యాలీ
-
రామేశ్వరం కెఫే కేసులో నిందితులను పట్టించిన తప్పుడు ఐడీ..!
-
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
-
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
-
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
-
సూచీలకు వరుస నష్టాలు.. 22 వేల దిగువకు నిఫ్టీ