Team India: కృనాల్, చాహల్, కృష్ణప్పను వదిలేసొచ్చిన టీమ్ఇండియా
శ్రీలంకతో పరిమిత ఓవర్ల క్రికెట్ కోసం అక్కడికి వెళ్లిన టీమ్ఇండియా ఆటగాళ్లు కొద్దిసేపటి క్రితమే బెంగళూరుకు చేరుకున్నారు. అయితే, కరోనా వైరస్ బారిన పడిన ముగ్గురు ఆటగాళ్లు మాత్రం అక్కడే ఉండిపోయారు...
ఇంగ్లాండ్కు పయనంకానున్న సూర్యకుమార్, పృథ్వీ షా
ఇంటర్నెట్డెస్క్: శ్రీలంకతో పరిమిత ఓవర్ల క్రికెట్ కోసం అక్కడికి వెళ్లిన టీమ్ఇండియా ఆటగాళ్లు కొద్దిసేపటి క్రితమే బెంగళూరుకు చేరుకున్నారు. అయితే, కరోనా వైరస్ బారిన పడిన ముగ్గురు ఆటగాళ్లు మాత్రం అక్కడే ఉండిపోయారు. ప్రస్తుతం వారు ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రంలో ఉన్నారు. టీమ్ఇండియా గురువారమే మూడు టీ20ల సిరీస్ పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఆటగాళ్లు శుక్రవారం భారత్కు తిరుగు ప్రయాణమయ్యే ముందు నిర్వహించిన కరోనా పరీక్షల్లో యుజువేంద్ర చాహల్, కృష్ణప్ప గౌతమ్కు పాజిటివ్గా తేలింది. దీంతో వారు కూడా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.
ఇక రెండో టీ20కి ముందు తొలుత కృనాల్ పాండ్యకు పాజిటివ్గా తేలిన సంగతి తెలిసిందే. అదే సమయంలో అతడితో సన్నిహితంగా మెలిగిన మరో ఎనిమిది ఆటగాళ్లు ఐసోలేషన్కు వెళ్లారు. అందులో చాహల్, కృష్ణప్ప సైతం ఉన్నారు. వారికి వైరస్ సోకిందని తెలుస్తోంది. కాగా, వీరంతా బుధ, గురువారాల్లో జరిగిన రెండు టీ20ల్లో పాల్గొనలేదు. కీలక ఆటగాళ్లంతా లేకపోవడంతో అనుభవం లేని యువకులు శ్రీలంక చేతిలో ఓటమిపాలయ్యారు. దాంతో ఆతిథ్య జట్టు 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఇక కృనాల్కు కరోనా సోకాక ఐసోలేషన్లోకి వెళ్లిన ఆటగాళ్లలో హార్దిక్ పాండ్య, మనీశ్ పాండే, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షా, దీపక్ చాహర్కు నెగిటివ్గా తేలడంతో వారంతా తిరిగి బెంగళూరుకు చేరుకున్నారు.
నాటింగ్హామ్కు సూర్య, పృథ్వీ..
మరోవైపు ఇంగ్లాండ్లో పర్యటిస్తున్న టీమ్ఇండియాలో అవేశ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ గాయపడిన సంగతి తెలిసిందే. దాంతో వారి స్థానాల్లో శ్రీలంక పర్యటనకు వెళ్లిన పృథ్వీ, సూర్యకుమార్ను భర్తీ చేయాలని జట్టు యాజమాన్యం నిర్ణయించింది. ఈ క్రమంలోనే వారిద్దరూ నేరుగా నాటింగ్హామ్కు బయలుదేరనున్నారు. అక్కడ చేరుకున్నాక కొద్దిరోజులు కఠిన క్వారంటైన్లో ఉండి ఆపై జట్టుతో కలవనున్నారు. ఇక కోహ్లీసేన నేటితో తమ ప్రాక్టీస్ సెషన్ను పూర్తి చేసుకుంది. ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్తో తొలి టెస్టు ఆడేందుకు సిద్ధమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
పంజాబ్పై 9 పరుగుల తేడాతో ముంబయి గెలిచింది. కానీ, ఆ జట్టుకు అంపైర్లు మద్దతుగా నిలిచారనే ఆరోపణలు వస్తున్నాయి. -
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు