INDvsSL: రెండో వన్డేలోనే శ్రీలంక పనిపట్టాలి..!
టీమ్ఇండియా యువకులు సత్తా చాటారు. శ్రీలంకతో ఆడిన తొలి వన్డేలో ఘన విజయం సాధించారు. దాంతో మంగళవారం జరిగే రెండో మ్యాచ్లోనూ ఇలాగే చెలరేగి.. రేపే సిరీస్ కైవసం చేసుకోవాలని తహతహలాడుతున్నారు...
సత్తా చాటుతున్న టీమ్ఇండియా యువకులు...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా యువకులు సత్తా చాటారు. శ్రీలంకతో ఆడిన తొలి వన్డేలో ఘన విజయం సాధించారు. దాంతో మంగళవారం జరిగే రెండో మ్యాచ్లోనూ ఇలాగే చెలరేగి.. రేపే సిరీస్ కైవసం చేసుకోవాలని తహతహలాడుతున్నారు. ఆదివారం ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో భారత యువకులు దంచికొట్టిన సంగతి తెలిసిందే. శ్రీలంక నిర్దేశించిన 263 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఇంకా 13 ఓవర్లు మిగిలుండగా ఛేదించారు. దాంతో మూడు వన్డేల సిరీస్లో బోణికొట్టి ఆధిపత్యం చెలాయించారు.
పటిష్టమైన బ్యాటింగ్..
ఈ మ్యాచ్లో కెప్టెన్ శిఖర్ ధావన్(86*)తో పాటు యువ ఆటగాళ్లు పృథ్వీ షా(43), ఇషాన్ కిషన్(59), సూర్యకుమార్ యాదవ్(31*) చెలరేగిపోయారు. లంక బౌలర్లను ధాటిగా ఎదుర్కొని స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా పృథ్వీ, ఇషాన్ దూకుడుగా ఆడారు. పృథ్వీ భారీ స్కోర్ సాధించకపోయినా పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. దాంతో అతడు మునుపటి ఫామ్ను అందుకున్నాడు. ఈ మ్యాచ్లో మనీశ్ పాండే (40 బంతుల్లో 26 పరుగులు) ఒక్కడే కాస్త నెమ్మదిగా ఆడి ప్రభావం చూపలేకపోయాడు. ఇది మినహాయిస్తే భారత బ్యాటింగ్ లైనప్ మొత్తం పటిష్టంగా ఉంది.
కుదురుకున్న స్పిన్ విభాగం..
ఇక బౌలింగ్ విభాగంలో యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, కృనాల్ పాండ్య ఆకట్టుకున్నారు. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత కలిసి ఆడిన చాహల్, కుల్దీప్ చెరో రెండు వికెట్లు తీసి సత్తా చాటారు. మరోవైపు హర్దిక్ పాండ్య సైతం 5 ఓవర్లు బౌలింగ్ చేసి కట్టుదిట్టంగా బంతులేశాడు. ఈ క్రమంలోనే కృనాల్ పాండ్య కూడా పొదుపుగా బౌలింగ్ చేసి లంక పరుగుల వేగాన్ని కట్టడి చేశాడు. అయితే, సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ వికెట్లు తీయలేక ఇబ్బంది పడ్డాడు. అతడు తర్వాతి మ్యాచ్లో రాణించాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా రెండో వన్డేలో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాలని చూస్తోంది.
లంక కోలుకోవాల్సిందే..
మరోవైపు శ్రీలంక జట్టులోని చాలా మంది బ్యాట్స్మెన్ తొలుత బాగా ఆడారు. అనేక మంది మంది శుభారంభాలు చేసినా పెద్ద స్కోర్లు సాధించలేకపోయారు. దాంతో తమలో పోరాడే సత్తా ఉందని చెప్పకనే చెప్పారు. చామిక కరుణరత్నె (43), కెప్టెన్ దాసున్ షనక (39), అసలంక (38), అవిష్క ఫెర్నాండో (33) ఉన్నంతసేపు మంచి పరుగులు చేశారు. వీళ్లంతా మరింత దూకుడుగా ఆడితే ఆ జట్టు ఇంకా మెరుగైన స్కోరు సాధిస్తుందనడంలో సందేహం లేదు. కరుణరత్నె కూడా ఇదే విషయాన్ని అంగీకరించాడు. తమ జట్టులోని కొంతమంది ఎక్కువసేపు క్రీజులో నిలిచి ఉంటే బాగుండేదన్నాడు. దాంతో తర్వాత భారీ షాట్లు ఆడి స్కోరుబోర్డుపై 300లకు పైగా పరుగులు సాధించేవాళ్లమని చెప్పాడు. కాగా, లంక బౌలింగ్ విభాగం ఒక్కటే బలహీనంగా కనిపించింది. ధనంజయ రెండు వికెట్లు తీసినా ఐదు ఓవర్లకు సుమారు 50 పరుగులిచ్చాడు. మిగతా బౌలర్లలో ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. చమీరా, హసరంగా మాత్రమే పొదుపుగా బౌలింగ్ చేశారు. ఈ నేపథ్యంలో రెండో వన్డేలో టీమ్ఇండియా బ్యా్ట్స్మెన్ను అడ్డుకోవాలంటే లంక బౌలర్లు కష్టపడాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్