INDvsENG: త్రిమూర్తుల శతకాలు.. ఒకే ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్పై సెంచరీల మోత
భారత క్రికెట్కే వన్నె తెచ్చిన ఆటగాళ్లు సచిన్ తెందూల్కర్, సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్. తమ ఆటతోనే కాకుండా వ్యక్తిత్వాలతోనూ విశేషమైన అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నారు ఈ దిగ్గజాలు. ఒకరి తర్వాత ఒకరు భారత జట్టుకు సారథ్యం వహించిన ఈ త్రిమూర్తులు.. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నారంటే
భారత క్రికెట్కే వన్నె తెచ్చిన ఆటగాళ్లు సచిన్ తెందూల్కర్, సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్. తమ ఆటతోనే కాకుండా వ్యక్తిత్వాలతోనూ విశేషమైన అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నారు ఈ దిగ్గజాలు. ఒకరి తర్వాత ఒకరు భారత జట్టుకు సారథ్యం వహించిన ఈ త్రిమూర్తులు.. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నారంటే ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తారు. అలాంటి ముగ్గురూ ఒకే టెస్టులో అది కూడా ఒకే ఇన్నింగ్స్లో ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించే పిచ్పై శతకాలు బాదితే ఎలా ఉంటుంది? క్రికెట్ ప్రేమికులకు ఊహించుకోడానికే కనులపండుగ కదా! అది జరిగి సరిగ్గా 19 ఏళ్లు గడిచాయి. అది కూడా ఇంగ్లాండ్ జట్టుపైనే. వచ్చే వారం కోహ్లీసేన తలపడే మూడో టెస్టు జరిగే లీడ్స్ మైదానంలోనే. ఈ సందర్భంగా నాటి విశేషాల్ని ఒకసారి నెమరువేసుకుందాం.
కేరీర్లోనే ఒకేఒక్కసారి..
గంగూలీ నేతృత్వంలోని టీమ్ఇండియా 2002లో నాలుగు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది. లార్డ్స్ మైదానంలో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్ 170 పరుగులతో గెలవగా రెండో టెస్టు డ్రాగా ముగిసింది. ఇక తప్పక గెలవాల్సిన మూడో టెస్టులో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. అందుకు ముఖ్య కారణం సచిన్, గంగూలీ, ద్రవిడ్ శతకాలు బాదడమే. ఈ ముగ్గురూ కలిసి ఒకేసారి తమ కెరీర్లో ఒకే ఇన్నింగ్స్లో సెంచరీలు కొట్టారు. నాసర్ హుస్సేన్ నేతృత్వంలోని ఇంగ్లిష్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ లీడ్స్ మైదానాన్ని చప్పట్లతో హోరెత్తించారు. దాంతో యావత్ భారత క్రికెట్ అభిమానులు ఆనందంలో మునిగితేలారు. అలాగే ఆ టెస్టును టీమ్ఇండియా చరిత్రలో ఒక చిరస్మరణీయ మ్యాచ్గా నిలిపారు.
ఒకరుపోతే మరొకరు..
ఆ మ్యాచ్లో టీమ్ఇండియా తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆదిలోనే వీరేంద్ర సెహ్వాగ్ (8) విఫలమైనా మరో ఓపెనర్ సంజయ్ బంగర్ (68; 236 బంతుల్లో 10x4)తో కలిసి వన్డౌన్ బ్యాట్స్మన్ రాహుల్ ద్రవిడ్ (148; 307 బంతుల్లో 23x4) రెండో వికెట్కు 170 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇక బంగర్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ (193; 330 బంతుల్లో 19x4, 3x6) త్రుటిలో డబుల్ సెంచరీ మిస్సయ్యాడు. ద్రవిడ్తో కలిసి మూడో వికెట్కు 150 పరుగులు జోడించాడు. జట్టు స్కోర్ 335 పరుగుల వద్ద మిస్టర్ డిపెండబుల్ ఔటయ్యాక, కెప్టెన్ గంగూలీ (128; 167 బంతుల్లో 14x4, 3x6) అడుగెట్టాడు. వీళ్లిద్దరూ నాలుగో వికెట్కు 249 పరుగుల కీలక భాగస్వామ్యం నిర్మించారు. అలా ఈ ముగ్గురి శతకాలతో టీమ్ఇండియా చివరికి 628/8 స్కోర్ వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
బౌలర్లు సమష్టిగా రాణించి..
అనంతరం తొలి ఇన్నింగ్స్లో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు 273 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు రాబర్ట్ కీ (30; 76 బంతుల్లో 6x4), మైఖేల్ వాన్ (61;116 బంతుల్లో 9x4) శుభారంభం చేశారు. తొలి వికెట్కు 67 పరుగులు జోడించి గట్టి పునాదులు వేసినా తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ క్రీజులో ఎక్కువసేపు నిలదొక్కుకోలేకపోయారు. అనిల్ కుంబ్లే, హర్భజన్ మూడేసి వికెట్లతో చెలరేగగా, జహీర్ ఖాన్, అజిత్ అగార్కర్ చెరో రెండు వికెట్లతో ఇంగ్లాండ్ పనిపట్టారు. మధ్యలో అలెస్ స్టీవార్ట్ (78 నాటౌట్; 120 బంతుల్లో 11x4) పోరాడినా టెయిలెండర్లు కూడా వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. ఆపై ఫాలోఆన్ ఆడిన ఇంగ్లాండ్ జట్టు ఈసారి 309 పరుగులు చేయగలిగింది. కుంబ్లే 4, సంజయ్ బంగర్ 2 వికెట్లు తీయగా, జహీర్, అగార్కర్, హర్భజన్ తలో వికెట్ తీశారు. రెండో ఇన్నింగ్స్లో నాసిర్ హుస్సేన్ (110; 194 బంతుల్లో 18x4, 1x6) శతకంతో మెరిసినా ఇతర బ్యాట్స్మెన్ తేలిపోయారు. అలా టీమ్ఇండియా చివరికి ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. అనంతరం నాలుగో టెస్టు డ్రాగా పూర్తవడంతో 1-1తో ఆ సిరీస్ సమమైంది.
- ఇంటర్నెట్డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే ఆలోచన లేదని వెస్టిండీస్ మాజీ ఆటగాడు సునీల్ నరైన్ (Sunil Narine) అన్నాడు. -
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి