West Indies: విండీస్‌ జట్టుకు షాక్‌.. ముగ్గురు ఆటగాళ్లకు పాజిటివ్

వెస్టిండీస్‌ జట్టులో భారీ కుదుపు చోటుచేసుకుంది. పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్లిన ఆ జట్టులో ముగ్గురు ఆటగాళ్లతో పాటు ఒక సిబ్బందికి కరోనా నిర్ధారణ అయినట్లు విండీస్‌ బోర్డు ప్రకటించింది...

Updated : 12 Dec 2021 09:37 IST

కరాచి: వెస్టిండీస్‌ జట్టుకు భారీ షాక్‌..! పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్లిన ఆ జట్టులో ముగ్గురు ఆటగాళ్లతో పాటు సిబ్బంది ఒకరికి కరోనా నిర్ధారణ అయినట్లు విండీస్‌ బోర్డు ప్రకటించింది. పాకిస్థాన్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు కరీబియన్‌ జట్టు గురువారం కరాచీకి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహించగా రోస్టన్‌ ఛేజ్‌, షెల్డన్‌ కాట్రెల్‌, కైల్‌ మేయర్స్‌తో పాటు మరో వ్యక్తి వైరస్‌ బారినపడినట్లు తేలింది. దీంతో వీరిని ప్రత్యేక ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించినట్లు ఆ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. ఇక మిగతా ఆటగాళ్లు అందరికీ నెగెటివ్‌గా రావడంతో ఈరోజు నుంచి వారు ప్రాక్టీస్‌ మొదలుపెడతారని చెప్పింది. సిరీస్‌ అనుకున్నట్లే యథావిధిగా కొనసాగుతుందని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని