Tokyo Olympics: డిస్కస్‌ త్రో ఫైనల్‌ ఈవెంట్‌ ఆలస్యం

ఒలింపిక్స్‌లో మహిళల డిస్కస్‌ త్రో ఫైనల్‌ ఈవెంట్‌ వర్షం కారణంగా నిలిచిపోయింది. రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి భారత అథ్లెట్‌ కమల్‌ప్రీత్‌ కౌర్‌ ఏడో స్థానంలో నిలిచింది....

Updated : 02 Aug 2021 17:20 IST

వర్షం కారణంగా నిలిచిపోయిన ఫైనల్‌ పోటీ..

టోక్యో: ఒలింపిక్స్‌లో మహిళల డిస్కస్‌ త్రో ఫైనల్‌ ఈవెంట్‌ వర్షం కారణంగా నిలిచిపోయింది. రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి భారత అథ్లెట్‌ కమల్‌ప్రీత్‌ కౌర్‌ ఏడో స్థానంలో నిలిచింది. తొలి రౌండ్‌లో 61.62 మీటర్ల ప్రదర్శన చేసిన ఆమె ఆరోస్థానంలో నిలిచింది. ఇక రెండోసారి ప్రయత్నించి పూర్తిగా విఫలమైంది. దాంతో ఈ రౌండ్ పూర్తయ్యేసరికి ఏడో స్థానంలో నిలిచింది. మరోవైపు అమెరికా స్టార్‌ అథ్లెట్‌ అల్మన్‌ వాలరీ తొలి ప్రయత్నంలోనే 68.98 మీటర్లు డిస్కస్‌ త్రో చేసి అందరికన్నా ముందు నిలిచింది. ఇక క్యూబాకు చెందిన పెరెజ్‌ యామి తొలి రౌండ్‌లో 65.72 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచింది. ఆమె రెండో రౌండ్‌లో 62.16 మీటర్ల ప్రదర్శన చేసింది. చివరగా జెర్మన్‌ అథ్లెట్‌ పుండెజ్‌ క్రిస్టిన్‌ తొలి రౌండర్‌లో 63.07 మీటర్లతో నిలవగా రెండో రౌండ్‌లో 65.34 సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని