PV Sindhu: గోపిచంద్ అభినందించారు.. కానీ సైనా చేయలేదు: సింధు
టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం సాధించిన తర్వాత..
ఇంటర్నెట్డెస్క్: ఒలింపిక్స్లో వరుసగా రెండోసారి పతకం సాధించి చరిత్ర సృష్టించిన భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుపై అభినందనల వెల్లువ పెల్లుబికిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన తొలి గురువు, జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ నుంచి అభినందనలు వచ్చాయని చెప్పింది. సోమవారం మీడియాతో ముచ్చటించిన సందర్భంగా సింధు ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే, తన సీనియర్ సైనా నెహ్వాల్ నుంచి ఎలాంటి సందేశం రాలేదని చెప్పింది.
ఆరో సీడ్ సింధు ఆదివారం చైనా క్రీడాకారిణి బింగ్జియావోతో కాంస్య పోరులో తలపడిన సందర్భంగా 21-13, 21-15 తేడాతో అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాంతో ఆమె ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన రెండో భారత వ్యక్తిగా నిలవడమే కాకుండా ఈ ఘనత సాధించిన తొలి బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ నుంచి మొదలుకొని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ, క్రీడా ప్రముఖులతో పాటు ఎంతో మంది సింధూను అభినందిస్తున్నారు. దాంతో గోపీచంద్ నుంచి ఏమైనా అభినందనలు వచ్చాయా అని మీడియా ప్రశ్నించగా ఆమె ఇలా సమాధానం ఇచ్చింది. ‘గోపీ సర్ నన్ను అభినందిస్తూ మెసేజ్ చేశారు. అయితే, నేను సామాజిక మాధ్యమాలు ఇంకా చూడలేదు. నెమ్మదిగా ప్రతి ఒక్కరికీ సమాధానమిస్తున్నా’ అని సింధు వివరించింది. అనంతరం సైనా గురించి ప్రశ్నించగా.. ఆమె నుంచి ఎలాంటి సందేశం రాలేదని చెప్పింది. తామిద్దరం ఎక్కువగా మాట్లాడుకోమని వెల్లడించింది.
ఇదిలా ఉండగా, సింధు గతేడాది కరోనా సమయంలో లండన్కు వెళ్లి మూడు నెలలు ప్రత్యేక శిక్షణ తీసుకుంది. దాంతో అప్పుడు గోపీచంద్తో ఆమెకు పడట్లేదనే వార్తలు వినిపించాయి. అయితే, అప్పుడు తాను న్యూట్రిషియన్ ప్రోగ్రామ్ కోసం అక్కడికి వెళ్లినట్టు ఆ వార్తలను కొట్టిపారేసింది. కానీ, అక్కడి నుంచి తిరిగొచ్చాక సింధు.. గోపీచంద్ అకాడమీని వీడి గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో సాధన చేసింది. దాంతో వారిద్దరి మధ్య తేడాలొచ్చాయని మరోసారి అర్ధమైంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (08-08-2022)
-
Sports News
Rohit Sharma : అది నిజంగా అద్భుతం.. ఎందుకంటే..? : రోహిత్ శర్మ
-
Movies News
Allu Arjun: కల్యాణ్రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్
-
World News
Sri lanka Athletes: కామన్వెల్త్ క్రీడల నుంచి 10 మంది శ్రీలంక క్రీడాకారుల అదృశ్యం!
-
India News
Kidnaping: ఏడేళ్ల వయసులో కిడ్నాప్.. ఆపై ట్విస్ట్.. చివరకు 16 ఏళ్లకు ఇంటికి!
-
Sports News
World Chess: ప్రపంచ చెస్ ఫెడరేషన్ (FIDE) ఉపాధ్యక్షుడిగా విశ్వనాథన్ ఆనంద్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- IND vs WI: విండీస్ చిత్తు చిత్తు.. ఐదో టీ20లో భారత్ ఘన విజయం
- Kidnaping: ఏడేళ్ల వయసులో కిడ్నాప్.. ఆపై ట్విస్ట్.. చివరకు 16 ఏళ్లకు ఇంటికి!
- Pooja Gehlot: భారత ప్రధానిని చూడండి.. మోదీకి పాకిస్థాన్ జర్నలిస్ట్ ప్రశంస
- Hair Fall: మీ జుట్టు రాలిపోతుందా..! ఎందుకో తెలుసా..?
- Kesineni Nani: ఎంపీ కేశినేని నాని పేరుతో ట్వీట్ల కలకలం
- Sri lanka Athletes: కామన్వెల్త్ క్రీడల నుంచి 10 మంది శ్రీలంక క్రీడాకారుల అదృశ్యం!
- US: భారతీయ మహిళ బలవన్మరణం.. స్పందించిన న్యూయార్క్ కాన్సులేట్ జనరల్
- CWG 2022: రసవత్తర ఫైనల్ పోరు.. వెండితో సరిపెట్టుకున్న భారత్
- Chidambaram: ‘ప్రజాస్వామ్యం అతి కష్టంగా ఊపిరి పీల్చుకుంటోంది’
- Rishi Sunak: భార్య అక్షతా మూర్తిపై రిషి సునాక్ ఫిర్యాదు ఏంటో తెలుసా..?