Tokyo Paralympics: భారత్‌కు మరో రజతం.. హైజంప్‌లో మెరిసిన నిషాద్‌ కుమార్‌

టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో రజత పతకం దక్కింది. కొద్దిసేపటి క్రితం జరిగిన పురుషుల హైజంప్‌ పోటీల్లో భారత అథ్లెట్‌ నిషాద్‌కుమార్‌..

Updated : 29 Aug 2021 18:29 IST

టోక్యో: టోక్యో పారాలింపిక్స్‌లో ఐదోరోజు భారత్‌కు మరో రజత పతకం దక్కింది. కొద్దిసేపటి క్రితం జరిగిన పురుషుల హైజంప్‌ T47 పోటీల్లో భారత అథ్లెట్‌ నిషాద్‌ కుమార్‌ 2.06 మీటర్ల ఎత్తు దూకి రెండో స్థానంలో నిలిచాడు. దీంతో అతడు పారాలింపిక్స్‌లో రజతం సాధించడమే కాకుండా తన పేరిట ఉన్న ఆసియా అత్యుత్తమ రికార్డును కూడా సమం చేశాడు.

నిషాద్‌ ఈ ఏడాదిలోనే 2.06 మీటర్ల హైజంప్‌ చేయడం ద్వారా ఆసియాలో అత్యుత్తమ వక్తిగత ప్రదర్శన చేసిన పారా అథ్లెట్‌గా నిలిచాడు. ఇక ఈ పోటీల్లో అమెరికాకు చెందిన టౌన్‌సెండ్‌ రోడ్రిక్‌ 2.15 మీటర్ల ఎత్తు దూకి స్వర్ణ పతకం చేజిక్కించుకున్నాడు. అంతకుముందు మహిళల టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో ఈ ఉదయం భవీనా పటేల్ సైతం రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఒకేరోజు భారత్‌ ఖాతాలో రెండు రజతాలు చేరాయి.

ప్రధాని మోదీ అభినందనలు

ఈ పారాలింపిక్స్‌లో భారత్‌కు రెండో రజతం అందించిన నిషాద్‌ను ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు. పురుషుల హైజంప్‌ పోటీల్లో అతడు రజతం సాధించడం సంతోషంగా ఉందని మోదీ పేర్కొన్నారు. అత్యద్భుత నైపుణ్యం కలిగిన ఆటగాడని మెచ్చుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని