గబ్బర్ సేన విజయానికి కోహ్లీసేన మురిపెం!
శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఉత్కంఠభరితమైన విజయం సాధించింది. దీపక్ చాహర్ (69*; 82 బంతుల్లో 7×4, 1×6), సూర్యకుమార్ యాదవ్ (53; 44 బంతుల్లో 6×4) విజృంభించిన వేళ.. టీమ్ఇండియా 276 పరుగుల లక్ష్యాన్ని మరో 5 బంతులు ఉండగానే ఛేదించింది.
కుర్రాళ్ల ఆటకు సీనియర్లు ఫిదా
ముంబయి: శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఉత్కంఠభరితమైన విజయం సాధించింది. దీపక్ చాహర్ (69*; 82 బంతుల్లో 7×4, 1×6), సూర్యకుమార్ యాదవ్ (53; 44 బంతుల్లో 6×4) విజృంభించిన వేళ.. టీమ్ఇండియా 276 పరుగుల లక్ష్యాన్ని మరో 5 బంతులు ఉండగానే ఛేదించింది. కాగా లంకలో గబ్బర్సేన విజయానికి ఇంగ్లాండ్లోని కోహ్లీసేన కేరింతలు కొట్టడం విశేషం.
ఒకేసారి రెండు వేర్వేరు దేశాల్లో టీమ్ఇండియా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. సీనియర్లతో కూడిన కోహ్లీసేన ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీసుకు సిద్ధమవుతోంది. పరిమిత ఓవర్ల స్పెషలిస్టులతో కూడిన గబ్బర్ సేన లంకలో రెండు సిరీసులు ఆడుతోంది. కాగా మొదటి వన్డేను సునాయసంగా గెలిచిన భారత్, రెండో వన్డేలో కాస్త చెమటోడ్చింది. ఛేదనలో 116 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ క్రమంలో కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్తో పేసర్ దీపక్ చాహర్ అద్భుతమైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఆఖర్లో లంక స్పిన్నర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో ఫలితం ఏమవుతుందో అన్న ఆసక్తి కలిగింది. హసరంగ లెగ్స్పిన్ను ఎదుర్కొంటూనే, మిగతా వాళ్ల బౌలింగ్లో బౌండరీలు బాదడంతో గబ్బర్సేన విజయం అందుకుంది. ఈ విజయాన్ని భారత అభిమానులే కాకుండా ఇంగ్లాండ్లోని కోహ్లీసేన సైతం ఆస్వాదించింది. ఆఖరి వరకు వారు మ్యాచును వీక్షించారు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.