Virat Kohli: ఒకప్పటి కీలకాస్త్రమే కోహ్లీకి బూమ‘రాంగ్’ అయ్యిందా?
రెండేళ్ల ముందు వరకు కోహ్లీ క్రీజ్లో ఉంటే అరవీర భయంకర బౌలర్ అయినా జాగ్రత్తగా ....
ప్రత్యర్థులపై పైచేయి సాధించడానికి అతగాడికదే ఒకప్పుడు కీలకాస్త్రం. బౌలర్ ఎవరైనా, జట్టు ఏదైనా ఆ షాట్ సంధిస్తే బంతి బౌండరీకి పరుగులు పెట్టాల్సిందే. ఒకప్పటి అదే అస్త్రం.. ఇప్పుడు అతగాడి పాలిట శాపంగా మారింది. ఏ షాట్ పేరు తెచ్చిందో.. ఇప్పుడదే షాట్ విమర్శల పాల్జేస్తోంది. ఇప్పటికే అర్థమై ఉంటుంది ఆ షాట్ పేరు కవర్ డ్రైవర్. ఆ క్రికెటరే విరాట్ కోహ్లీ.
ఓ అంతర్జాతీయ ఆటగాడు.. ప్రపంచ అత్యుత్తమ బ్యాటర్గా పేరుగాంచిన క్రికెటర్.. పరుగుల రారాజుగా కీర్తి గాంచిన ప్లేయర్ వరుసగా రెండేళ్లపాటు ఏ ఫార్మాట్లోనూ శతకం చేయలేదంటే మీరు నమ్మగలరా..? టాప్ క్లాస్ బ్యాటర్ అయి ఉండి పదే పదే ఒకే విధమైన షాట్ ఆడి పెవిలియన్కు చేరతాడని అసలు ఊహించగలమా..? ఓ వైపు కెప్టెన్గా దూకుడు ప్రదర్శిస్తున్న కోహ్లీ.. బ్యాటర్గా మాత్రం తేలిపోతున్నాడు. కారణం అదే షాట్!!
2020: మూడు టెస్టుల్లో 116 రన్స్.. 74 వ్యక్తిగత అత్యధిక స్కోరు
2021 ఏడాది: 11 టెస్టుల్లో 72 అత్యధిక స్కోరుతో మొత్తంగా 536 పరుగులు
ఇవీ విరాట్ కోహ్లీ గణాంకాలు. రెండేళ్ల ముందు వరకు కోహ్లీ క్రీజులో ఉంటే అరవీర భయంకర బౌలర్ అయినా జాగ్రత్తగా బౌలింగ్ చేయాల్సిందే. ఎంతటి లక్ష్యమైనా కరిగిపోవాల్సిందే. అయితే గతేడాది నుంచి ఇప్పటి వరకు గణాంకాలు చూస్తే ఇవి అసలు కోహ్లీవేనా? అనే అనుమానం రాకమానదు. అభిమానులను నిరాశపరిచే అంశం ఏంటంటే.. ఒకప్పుడు కవర్ డ్రైవ్లను కొట్టడంలో సచిన్ అంతటి పేరు సంపాదించిన విరాట్ కోహ్లీ.. ఇప్పుడు అటువంటి షాట్లకే బలి కావడం గమనార్హం.
కవర్డ్రైవ్ షాట్కే ఔట్
ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్నే తీసుకుంటే.. ఫ్రీడమ్ సిరీస్లో భాగంగా బాక్సింగ్ డే టెస్టు (డిసెంబర్ 26-30)లో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. అయితే సారథి విరాట్ కోహ్లీ (35, 18) మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్లో ఓపెనర్లు మంచి భాగస్వామ్యం అందించి కోహ్లీపై ఒత్తిడి లేకుండా చేసినా.. సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్ల్లోనూ దూరంగా వెళ్తున్న బంతులను వెంటాడి మరీ ఔట్ కావడం దారుణంగా ఉందని మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఇలా మరో ఎనిమిది సార్లు సైతం వరుసగా కవర్డ్రైవ్ షాట్ ఆడుతూ కోహ్లీ ఔటయ్యాడు. ఈ విషయంలో సచిన్ సలహాలను తీసుకోవాలని పలువురు కోహ్లీకి సూచిస్తున్నారు. అయితే టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ మాత్రం కోహ్లీకి మద్దతుగా నిలిచాడు. కవర్ డ్రైవ్ షాట్తో ఎన్నో పరుగులు చేశాడని గుర్తుచేశారు.
మరి ఎందుకిలా...?
టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్ చెప్పినట్లు ఒకప్పుడు విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్ ఆడితే తిరుగుండేది కాదు. అంత పర్ఫెక్ట్గా కొట్టేవాడు. మరి ఇప్పుడు ఎందుకిలా.? దీనంతటికీ కారణం ఒత్తిడేనని చెప్పే విశ్లేషకులూ లేకపోలేదు. బయోబబుల్లో ఆడటం కూడా సవాల్తో కూడుకున్న వ్యవహారమే. అంతేకాకుండా మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ పాత్రను నిర్వహించడం కూడా అంత సులభమేమీ కాదు. టెస్టులు, వన్డేలు, టీ20ల కోసం ఎప్పటికప్పుడూ పదునైన వ్యూహాలు రచిస్తూ ఉండాలి. వాటిని మైదానంలో అమలుపరిచే వరకు సారథిపై భారం తప్పదు. ఈ క్రమంలో బ్యాటింగ్పై పూర్తిస్థాయి దృష్టిసారించలేని పరిస్థితి. అందుకేనేమో మొన్నటి టీ20 ప్రపంచకప్ తర్వాత పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీకి కోహ్లీ వీడ్కోలు పలికేశాడు. సెలెక్షన్ కమిటీ మరో అడుగు ముందుకేసి విరాట్ను వన్డే సారథ్యం నుంచీ తొలగించింది. అయితే ఇది ఇప్పుడు కాస్త వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఇక మిగిలింది టెస్టు జట్టు నాయకత్వం. మరి ఇప్పుడు దీనిని నిలబెట్టుకుంటాడో.. లేకపోతే దీనిని కూడా వదిలేసి పూర్తిగా బ్యాటింగ్ మీద దృష్టి పెడతాడో వేచి చూడాల్సిందే.
రూట్, కేన్ విలియమ్సన్ మాదిరిగా రాణించాలి
ఇంగ్లాండ్ టెస్టు జట్టు సారథి జో రూట్. కెప్టెన్గా సిరీస్ల వైఫల్యం పక్కనపెడితే వ్యక్తిగతంగా టెస్టుల్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. ఈ ఏడాది అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 15 టెస్టుల్లో 1,708 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 228. అత్యుత్తమ టెస్టు ర్యాంకింగ్స్లో రెండో ర్యాంక్. మరోవైపు ఎలాంటి ఒత్తిడికీ గురికాకుండా ఆడే ఆటగాళ్లలో కేన్ విలియమ్సన్ ముందుంటాడు. వరుసగా మూడేళ్ల నుంచి డబుల్ సెంచరీ సాధిస్తున్న కేన్ ప్రపంచ క్రికెట్లో అత్యంత నిలకడైన ఆటగాడు. ఈ ఏడాది నాలుగు టెస్టుల్లో 395 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 238 నాటౌట్. ప్రస్తుతం కివీస్ తరఫున అన్ని ఫార్మాట్లకు విలియమ్సన్ సారథి. అయితే జట్టును నడపడంతోపాటు వ్యక్తిగతంగా పరుగులు సాధించే క్రమంలో ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వడు. రూట్, కేన్.. జట్టు సురక్షిత పరిస్థితుల్లో ఉన్నా సరే ఔట్ అయ్యేందుకు ఇష్టపడరు. వీరిని పెవిలియన్కు చేర్చాలంటే ప్రత్యర్థులు ఎంతో ఓపిగ్గా నిరీక్షించాలి. అయితే విరాట్ కోహ్లీ కూడా వీరికంటే ఎంతో మెరుగైన బ్యాటర్ అని ఎన్నోసార్లు రుజువు చేసుకున్నాడు. అయితే గత రెండేళ్ల నుంచి మాత్రం ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నాడు.
2022లోనైనా..
కోహ్లీకి ఇప్పుడు వన్డే, టీ20 సారథ్య బాధ్యతలు లేవు. ఉన్నది టెస్టు కెప్టెన్సీనే. ఇకనైనా బ్యాటింగ్పై పూర్తిస్థాయిలో దృష్టిసారించి లోపాలను సరిదిద్దుకోవాలని క్రీడా పండితులు సూచిస్తున్నారు. ప్రతిభపరంగా విరాట్ కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరమూ లేదు. అమ్ముల పొదిలో కీలకమైన తన అస్త్రంపై కాస్త శ్రద్ధ పెట్టాలి. కవర్ డ్రైవ్ను ఆడేటప్పుడు బ్యాట్కు కనెక్ట్ అయ్యేలా చూసుకోవాలి. దీని కోసం మరింత కసరత్తు చేయాలి. లేకపోతే ఇదే అలవాటుగా మారి.. బలం కాస్త బలహీనతగా మారే ప్రమాదమూ లేకపోలేదు. అలానే విమర్శకుల నోటికి పని కల్పించినట్లు అవుతుంది. 2022లోనైనా ఇలాంటి తప్పులకు కోహ్లీ చెక్ పెడతాడని ఆశిద్దాం!
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
పంజాబ్పై 9 పరుగుల తేడాతో ముంబయి గెలిచింది. కానీ, ఆ జట్టుకు అంపైర్లు మద్దతుగా నిలిచారనే ఆరోపణలు వస్తున్నాయి. -
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు