Virat Kohli: ఒకప్పటి కీలకాస్త్రమే కోహ్లీకి బూమ‘రాంగ్’ అయ్యిందా?
రెండేళ్ల ముందు వరకు కోహ్లీ క్రీజ్లో ఉంటే అరవీర భయంకర బౌలర్ అయినా జాగ్రత్తగా ....
ప్రత్యర్థులపై పైచేయి సాధించడానికి అతగాడికదే ఒకప్పుడు కీలకాస్త్రం. బౌలర్ ఎవరైనా, జట్టు ఏదైనా ఆ షాట్ సంధిస్తే బంతి బౌండరీకి పరుగులు పెట్టాల్సిందే. ఒకప్పటి అదే అస్త్రం.. ఇప్పుడు అతగాడి పాలిట శాపంగా మారింది. ఏ షాట్ పేరు తెచ్చిందో.. ఇప్పుడదే షాట్ విమర్శల పాల్జేస్తోంది. ఇప్పటికే అర్థమై ఉంటుంది ఆ షాట్ పేరు కవర్ డ్రైవర్. ఆ క్రికెటరే విరాట్ కోహ్లీ.
ఓ అంతర్జాతీయ ఆటగాడు.. ప్రపంచ అత్యుత్తమ బ్యాటర్గా పేరుగాంచిన క్రికెటర్.. పరుగుల రారాజుగా కీర్తి గాంచిన ప్లేయర్ వరుసగా రెండేళ్లపాటు ఏ ఫార్మాట్లోనూ శతకం చేయలేదంటే మీరు నమ్మగలరా..? టాప్ క్లాస్ బ్యాటర్ అయి ఉండి పదే పదే ఒకే విధమైన షాట్ ఆడి పెవిలియన్కు చేరతాడని అసలు ఊహించగలమా..? ఓ వైపు కెప్టెన్గా దూకుడు ప్రదర్శిస్తున్న కోహ్లీ.. బ్యాటర్గా మాత్రం తేలిపోతున్నాడు. కారణం అదే షాట్!!
2020: మూడు టెస్టుల్లో 116 రన్స్.. 74 వ్యక్తిగత అత్యధిక స్కోరు
2021 ఏడాది: 11 టెస్టుల్లో 72 అత్యధిక స్కోరుతో మొత్తంగా 536 పరుగులు
ఇవీ విరాట్ కోహ్లీ గణాంకాలు. రెండేళ్ల ముందు వరకు కోహ్లీ క్రీజులో ఉంటే అరవీర భయంకర బౌలర్ అయినా జాగ్రత్తగా బౌలింగ్ చేయాల్సిందే. ఎంతటి లక్ష్యమైనా కరిగిపోవాల్సిందే. అయితే గతేడాది నుంచి ఇప్పటి వరకు గణాంకాలు చూస్తే ఇవి అసలు కోహ్లీవేనా? అనే అనుమానం రాకమానదు. అభిమానులను నిరాశపరిచే అంశం ఏంటంటే.. ఒకప్పుడు కవర్ డ్రైవ్లను కొట్టడంలో సచిన్ అంతటి పేరు సంపాదించిన విరాట్ కోహ్లీ.. ఇప్పుడు అటువంటి షాట్లకే బలి కావడం గమనార్హం.
కవర్డ్రైవ్ షాట్కే ఔట్
ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్నే తీసుకుంటే.. ఫ్రీడమ్ సిరీస్లో భాగంగా బాక్సింగ్ డే టెస్టు (డిసెంబర్ 26-30)లో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. అయితే సారథి విరాట్ కోహ్లీ (35, 18) మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్లో ఓపెనర్లు మంచి భాగస్వామ్యం అందించి కోహ్లీపై ఒత్తిడి లేకుండా చేసినా.. సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్ల్లోనూ దూరంగా వెళ్తున్న బంతులను వెంటాడి మరీ ఔట్ కావడం దారుణంగా ఉందని మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఇలా మరో ఎనిమిది సార్లు సైతం వరుసగా కవర్డ్రైవ్ షాట్ ఆడుతూ కోహ్లీ ఔటయ్యాడు. ఈ విషయంలో సచిన్ సలహాలను తీసుకోవాలని పలువురు కోహ్లీకి సూచిస్తున్నారు. అయితే టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ మాత్రం కోహ్లీకి మద్దతుగా నిలిచాడు. కవర్ డ్రైవ్ షాట్తో ఎన్నో పరుగులు చేశాడని గుర్తుచేశారు.
మరి ఎందుకిలా...?
టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్ చెప్పినట్లు ఒకప్పుడు విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్ ఆడితే తిరుగుండేది కాదు. అంత పర్ఫెక్ట్గా కొట్టేవాడు. మరి ఇప్పుడు ఎందుకిలా.? దీనంతటికీ కారణం ఒత్తిడేనని చెప్పే విశ్లేషకులూ లేకపోలేదు. బయోబబుల్లో ఆడటం కూడా సవాల్తో కూడుకున్న వ్యవహారమే. అంతేకాకుండా మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ పాత్రను నిర్వహించడం కూడా అంత సులభమేమీ కాదు. టెస్టులు, వన్డేలు, టీ20ల కోసం ఎప్పటికప్పుడూ పదునైన వ్యూహాలు రచిస్తూ ఉండాలి. వాటిని మైదానంలో అమలుపరిచే వరకు సారథిపై భారం తప్పదు. ఈ క్రమంలో బ్యాటింగ్పై పూర్తిస్థాయి దృష్టిసారించలేని పరిస్థితి. అందుకేనేమో మొన్నటి టీ20 ప్రపంచకప్ తర్వాత పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీకి కోహ్లీ వీడ్కోలు పలికేశాడు. సెలెక్షన్ కమిటీ మరో అడుగు ముందుకేసి విరాట్ను వన్డే సారథ్యం నుంచీ తొలగించింది. అయితే ఇది ఇప్పుడు కాస్త వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఇక మిగిలింది టెస్టు జట్టు నాయకత్వం. మరి ఇప్పుడు దీనిని నిలబెట్టుకుంటాడో.. లేకపోతే దీనిని కూడా వదిలేసి పూర్తిగా బ్యాటింగ్ మీద దృష్టి పెడతాడో వేచి చూడాల్సిందే.
రూట్, కేన్ విలియమ్సన్ మాదిరిగా రాణించాలి
ఇంగ్లాండ్ టెస్టు జట్టు సారథి జో రూట్. కెప్టెన్గా సిరీస్ల వైఫల్యం పక్కనపెడితే వ్యక్తిగతంగా టెస్టుల్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. ఈ ఏడాది అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 15 టెస్టుల్లో 1,708 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 228. అత్యుత్తమ టెస్టు ర్యాంకింగ్స్లో రెండో ర్యాంక్. మరోవైపు ఎలాంటి ఒత్తిడికీ గురికాకుండా ఆడే ఆటగాళ్లలో కేన్ విలియమ్సన్ ముందుంటాడు. వరుసగా మూడేళ్ల నుంచి డబుల్ సెంచరీ సాధిస్తున్న కేన్ ప్రపంచ క్రికెట్లో అత్యంత నిలకడైన ఆటగాడు. ఈ ఏడాది నాలుగు టెస్టుల్లో 395 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 238 నాటౌట్. ప్రస్తుతం కివీస్ తరఫున అన్ని ఫార్మాట్లకు విలియమ్సన్ సారథి. అయితే జట్టును నడపడంతోపాటు వ్యక్తిగతంగా పరుగులు సాధించే క్రమంలో ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వడు. రూట్, కేన్.. జట్టు సురక్షిత పరిస్థితుల్లో ఉన్నా సరే ఔట్ అయ్యేందుకు ఇష్టపడరు. వీరిని పెవిలియన్కు చేర్చాలంటే ప్రత్యర్థులు ఎంతో ఓపిగ్గా నిరీక్షించాలి. అయితే విరాట్ కోహ్లీ కూడా వీరికంటే ఎంతో మెరుగైన బ్యాటర్ అని ఎన్నోసార్లు రుజువు చేసుకున్నాడు. అయితే గత రెండేళ్ల నుంచి మాత్రం ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నాడు.
2022లోనైనా..
కోహ్లీకి ఇప్పుడు వన్డే, టీ20 సారథ్య బాధ్యతలు లేవు. ఉన్నది టెస్టు కెప్టెన్సీనే. ఇకనైనా బ్యాటింగ్పై పూర్తిస్థాయిలో దృష్టిసారించి లోపాలను సరిదిద్దుకోవాలని క్రీడా పండితులు సూచిస్తున్నారు. ప్రతిభపరంగా విరాట్ కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరమూ లేదు. అమ్ముల పొదిలో కీలకమైన తన అస్త్రంపై కాస్త శ్రద్ధ పెట్టాలి. కవర్ డ్రైవ్ను ఆడేటప్పుడు బ్యాట్కు కనెక్ట్ అయ్యేలా చూసుకోవాలి. దీని కోసం మరింత కసరత్తు చేయాలి. లేకపోతే ఇదే అలవాటుగా మారి.. బలం కాస్త బలహీనతగా మారే ప్రమాదమూ లేకపోలేదు. అలానే విమర్శకుల నోటికి పని కల్పించినట్లు అవుతుంది. 2022లోనైనా ఇలాంటి తప్పులకు కోహ్లీ చెక్ పెడతాడని ఆశిద్దాం!
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్