Team India: టీమ్ఇండియా బలం ఇప్పుడు పేసర్లే.. మూడేళ్లుగారాణిస్తోన్నకోహ్లీసేన పేస్ దళం
కొంతకాలంగా టీమ్ఇండియా టెస్టుల్లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ సంచలన విజయాలు నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే...
జోహెన్నెస్బర్గ్పై కన్నేసిన భారత్..
గత మూడు దశాబ్దాలుగా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్తోన్న భారత జట్టు ఎప్పుడూ అక్కడ సూపర్స్పోర్ట్ మైదానంలో విజయం సాధించిన సందర్భం లేదు. కానీ, కోహ్లీసేన ఇప్పుడు చరిత్ర తిరగరాసింది. తొలి టెస్టులో మొత్తం 18 వికెట్లు పడగొట్టిన భారత పేస్ దళం ఇప్పుడు రెండో మ్యాచ్పైనా కన్నేసింది. ఒకవేళ అక్కడా రాణిస్తే భారత్ సిరీస్ గెలవడం ఖాయం. దీంతో సఫారీ గడ్డపై తొలిసారి టీమ్ఇండియా చారిత్రక విజయం సాధించే సువర్ణావకాశం ఉంది.
ఇరు జట్ల ప్రస్తుత పరిస్థితి..
ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తేలిగ్గానే ఈ సిరీస్ కైవసం చేసుకునేలా కనిపిస్తున్నా దక్షిణాఫ్రికాను తక్కువ అంచనావేసే పరిస్థితి లేదు. సొంతగడ్డపై ఆ జట్టు ఎలాంటి పరిస్థితులనైనా తమకు అనుకూలంగా మార్చుకునే వీలుంది. ఎంగిడి, రబాడ లాంటి ప్రపంచ శ్రేణి పేసర్లు ఆ జట్టులో ఉన్నారు. దీంతో వారి నుంచి భారత బ్యాటింగ్ ఆర్డర్కు ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా భారత జట్టులో ఓపెనర్లే పరుగులు చేయడం, మిడిల్ ఆర్డర్ చేతులెత్తేయడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఆటగాళ్లంతా కచ్చితంగా రాణించాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ ప్రస్తుతం బలహీనంగా ఉన్న సంగతి తెలిసిందే. అందులోనూ క్వింటన్ డికాక్ లాంటి వికెట్ కీపర్, బ్యాట్స్మన్ టెస్టులకు వీడ్కోలు పలకడంతో ఆ ఇబ్బంది మరింత పెరిగింది. దీంతో భారత బౌలర్లు చెలరేగితే దక్షిణాఫ్రికాకు కష్టాలు తప్పవనే చెప్పొచ్చు.
మేటి బౌలింగ్ యూనిట్గా భారత్..
ఇక రెండో టెస్టుకు ముందు భారత బౌలింగ్ బలం ఎలా ఉందని ఒకసారి పరిశీలిస్తే అద్భుతమైన ఫలితాలు కనపడుతున్నాయి. కోహ్లీ సారథ్యంలో టీమ్ఇండియా విదేశాల్లో మొత్తం 36 టెస్టులు ఆడగా.. అందులో పేస్ బౌలర్లే కీలకంగా వ్యవహరిస్తున్నారు. అప్పటి నుంచి మొత్తం 3,338.2 ఓవర్లు బౌలింగ్ చేసిన పేసర్లు.. 392 వికెట్లు సాధించి.. 51.0 అద్భుతమైన స్ట్రైక్రేట్ నమోదు చేశారు. దీంతో ప్రపంచంలోనే అత్యుత్తమ పేస్ బౌలింగ్ విభాగంలో ‘కోహ్లీసేన’ అగ్రస్థానంలో నిలిచింది. ఇక వివియన్ రిచర్డ్స్ నేతృత్వంలోని విండీస్ బౌలింగ్ యూనిట్ కోహ్లీసేన తర్వాత రెండో స్థానంలో నిలిచింది. ఆ జట్టు విదేశాల్లో 26 మ్యాచ్లు ఆడగా.. 3,427 ఓవర్లు బౌలింగ్ చేసిన పేస్ బౌలర్లు.. 398 వికెట్లు సాధించి.. 51.6 స్ట్రైక్రేట్ కలిగి ఉన్నారు. ఆపై స్టీవ్వా నేతృత్వంలోని ఆస్ట్రేలియా పేసర్లు.. 28 టెస్టుల్లో 2,591.2 ఓవర్లు బౌలింగ్ చేసి 286 వికెట్లు సాధించారు. దీంతో వారు 54.3 స్ట్రైక్రేట్ సాధించారు.
పది వికెట్లలోనూ మనోళ్లే టాప్..
మరోవైపు సెంచూరియన్ టెస్టులో టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్లో పేస్ బౌలర్లే మొత్తం పది వికెట్లు తీశారు. దీంతో విదేశాల్లో అత్యధికంగా ఒకే ఇన్నింగ్స్లో పది వికెట్లు తీసిన పేస్ బౌలింగ్ జాబితాలోనూ భారత్(పది సార్లు) అగ్రస్థానంలో నిలిచింది. 2018 నుంచీ కోహ్లీసేన సారథ్యంలోని బుమ్రా, షమి, ఇషాంత్ అద్భుతంగా రాణిస్తున్నారు. ఇటీవల శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ లాంటి యువకులు సైతం సీనియర్లకు ఏమాత్రం తీసిపోని విధంగా మెరుస్తున్నారు. ఈ జాబితాలో ఇంగ్లాండ్ పేసర్లు 6 సార్లు ఈ ఘనత సాధించి రెండో స్థానంలో నిలవగా.. న్యూజిలాండ్ బౌలర్లు నాలుగు సార్లు పది వికెట్లు తీసి మూడో స్థానంలో నిలిచారు. దీంతో ఎలా చూసినా భారత పేస్ బౌలింగ్ యూనిట్ సంపూర్ణంగా ఉంది. కచ్చితంగా రెండో టెస్టులోనూ టీమ్ఇండియా విజయం సాధించేలా కనిపిస్తోంది. మరో విశేషం ఏమిటంటే.. జోహెన్నెస్బర్గ్లో టీమ్ఇండియా ఇప్పటివరకూ ఒక్క టెస్టు కూడా ఓటమిపాలవ్వలేదు. ఆడిన ఐదు మ్యాచ్ల్లో రెండు విజయాలు సాధించగా.. మూడు మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. దీంతో టీమ్ఇండియా ఇక్కడే సిరీస్ కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
- ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్