Ganguly or Dhoni: అతడే టీమ్ఇండియా అత్యుత్తమ సారథి: సెహ్వాగ్
బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీల మధ్య ఎవరు గొప్ప కెప్టెన్ అని అడిగితే సగటు అభిమానికి తేల్చుకోవడం చాలా కష్టం....
ఇంటర్నెట్డెస్క్: బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీల మధ్య ఎవరు గొప్ప కెప్టెన్ అని అడిగితే సగటు అభిమాని తేల్చుకోవడం చాలా కష్టం. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న జట్టును ఒకరు ప్రపంచానికి కొత్తగా పరిచయం చేస్తే.. అదే జట్టును మరొకరు ప్రపంచ ఛాంపియన్గా నిలబెట్టారు. ఈ నేపథ్యంలో ఎవరినీ తక్కువ చేయడానికి కుదరదు. అయితే, ఇదే విషయంపై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన అభిప్రాయం వెల్లడించాడు.
తన దృష్టిలో ఇద్దరు మాజీలు గొప్ప సారథులని, ఎవరికి వారే ప్రత్యేకమని కొనియాడాడు. విపత్కర పరిస్థితుల్లో గంగూలీ టీమ్ఇండియాను ఏకతాటిపైకి తెచ్చాడని, నాణ్యమైన ఆటగాళ్లను ఎంపిక చేసి భారత్ను కొత్తగా తీర్చిదిద్దాడని చెప్పాడు. ఈ క్రమంలోనే టీమ్ఇండియా విదేశాల్లో ఎలా గెలవాలో రుచిచూపించాడని తెలిపాడు. ఇక ధోనీ విషయానికి వస్తే.. అతడు కెప్టెన్సీ చేపట్టే సమయానికే భారత్ గొప్ప జట్టుగా ఉందని, అది అతడికి కలిసొచ్చిందని మాజీ ఓపెనర్ అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో ధోనీకి కొత్త జట్టును తయారుచేయడంలో పెద్ద కష్టం కాలేదన్నాడు. ఇద్దరూ గొప్పసారథులని చెప్పాడు. కానీ, తన వ్యక్తిగత అభిప్రాయం మేరకు గంగూలీనే అత్యుత్తమ సారథి అని స్పష్టం చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా