Cricket News: క్రికెట్లో ‘అత్యంత చెత్త రివ్యూ’ ఇదేనా..?
క్రికెట్లో అప్పుడప్పుడు ఆటగాళ్లు చెత్త ప్రదర్శనలు చేయడం పరిపాటే. బ్యాటింగ్లో ఎవరైనా చెత్త షాట్లకు ప్రయత్నించి ఔటవ్వడం.. లేదా బౌలర్లు దారుణంగా బంతులేసి విపరీతమైన పరుగులు సమర్పించుకోవడం...
బంగ్లాదేశ్ డీఆర్ఎస్కు నవ్వుకున్న కామెంటేటర్లు..
ఇంటర్నెట్డెస్క్: క్రికెట్లో అప్పుడప్పుడు ఆటగాళ్లు పేలవ ప్రదర్శనలు చేయడం పరిపాటే. బ్యాటింగ్లో ఎవరైనా అనవసరపు షాట్లకు ప్రయత్నించి ఔటవ్వడం.. లేదా బౌలర్లు దారుణంగా బంతులేసి విపరీతమైన పరుగులు సమర్పించుకోవడం లాంటివి మనం ఎన్నోసార్లు చూసి ఉంటాం. అయితే, ఎప్పుడైనా ఒక జట్టు.. క్రికెట్లోనే ‘అత్యంత చెత్త రివ్యూ’కు వెళ్లడం చూశారా? చూడకపోతే ఇక్కడ చూసి కాసేపు నవ్వుకోండి. సహజంగా ఎవరైనా అంపైర్ నిర్ణయంపై సంతృప్తి చెందకపోతే రివ్యూకు వెళ్లడం మనకు తెలిసిందే. ఆ బ్యాట్స్మన్ ఔట్ విషయంలో కచ్చితమైన ఫలితం కోసం డీఆర్ఎస్కు వెళతారు. చాలా మటుకు అవన్నీ ఎల్బీడబ్ల్యూ విషయాల్లోనే చోటుచేసుకుంటాయి. బంతి లైన్ అండ్ లెంగ్త్ విషయాల్లో లేదా ఆటగాడి బ్యాట్కు బంతి ఎడ్జ్లో తాకిందా లేదా అనే కోణాల్లో అక్కడ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారు. కానీ, తాజాగా కివీస్తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో బంగ్లా తీసుకున్న రివ్యూనే ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
న్యూజిలాండ్ బ్యాట్స్మన్ రాస్ టేలర్ (37 బ్యాటింగ్; 101 బంతుల్లో 2x4).. 37వ ఓవర్లో బ్యాటింగ్ చేస్తుండగా తస్కిన్ అహ్మద్ బౌలింగ్కు వచ్చాడు. అప్పుడు అతడు ఒక యార్కర్ వేయగా టేలర్ బ్యాట్ను అడ్డుపెట్టి బంతిని అడ్డుకున్నాడు. దీనిపై బంగ్లా ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. అంపైర్ నాటౌటిచ్చాడు. కొద్ది క్షణాల్లో డీఆర్ఎస్ గడువు ముగుస్తుండగా బంగ్లా కెప్టెన్ మొమినుల్ హాక్ రివ్యూకు వెళ్లాడు. థర్డ్ అంపైర్ రీప్లేలో పరిశీలించగా.. ఆ బంతి చాలా స్పష్టంగా బ్యాట్కు మధ్యలో తాకుతున్నట్లు కనిపించింది. దీంతో కామెంట్రీ చేస్తున్న వ్యాఖ్యాతలు ఒక్కసారిగా నవ్వుకున్నారు. అలా బంతి బ్యాట్కు తాకుతున్నట్లు ఉన్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్గా మారాయి. ఇది క్రికెట్లోనే ‘అత్యంత చెత్త రివ్యూ’ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇంకొందరు ఒకడుగు ముందుకేసి బంగ్లా జట్టును ట్రోల్ చేస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే.. బంగ్లా ఈ రివ్యూతో తనకున్న మూడు రివ్యూలను కోల్పోయింది. ఇక నాలుగో రోజు ఆట ముగిసేసరికి న్యూజిలాండ్ 147/5తో నిలిచింది. దీంతో ఆ జట్టు ప్రస్తుతం 17 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 328 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ 458 పరుగులు చేసి మ్యాచ్పై పట్టు సాధించింది. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ నాలుగో రోజు కాస్త పట్టుదలగా ఆడింది. ఇక చివరి రోజు మ్యాచ్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’ ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్