Viral Video: పెనాల్టీ షూటౌట్లో ఇది మరో రకం.. వైరల్ వీడియో
ఫుట్బాల్ గేమ్లో పెనాల్టీ షూటౌట్ల గురించి అందరికీ తెలిసిందే. ఏదైన మ్యాచ్ సమయం పూర్తయినా.. ఫలితం తేలకపోయినా.. లేదా స్కోర్లు సమంగా మారి మ్యాచ్ టైగా మారినా...
(Viral Video Screenshot)
ఇంటర్నెట్డెస్క్: ఫుట్బాల్ గేమ్లో పెనాల్టీ షూటౌట్ల గురించి అందరికీ తెలిసిందే. ఏదైన మ్యాచ్ సమయం పూర్తయినా.. ఫలితం తేలకపోయినా.. లేదా స్కోర్లు సమంగా మారి మ్యాచ్ టైగా మారినా.. విజేతని తేల్చడానికి ఈ విధానం పాటిస్తారు. రెండు జట్లకూ ఐదేసి గోల్స్ సాధించే అవకాశం కల్పిస్తారు. దీన్నే పెనాల్టీ షూటౌట్ అంటారు. ఇందులో ఎవరు ఎక్కువ గోల్స్ సాధిస్తే వాళ్లే విజేతగా నిలుస్తారు. ఈ క్రమంలోనే పెనాల్టీ కిక్లో బంతిని అడ్డుకోవడానికి ప్రత్యర్థి జట్టులో గోల్కీపర్ ఒక్కడే ఉంటాడు. అతడికి 11 మీటర్ల ముందు నుంచి ఒక ఆటగాడు పరుగెత్తుకుంటూ వచ్చి బంతిని కిక్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు గోల్కీపర్ దృష్టిని మళ్లించడమే అత్యంత కీలకం. అలా చేయడంలోనే ఆయా ఆటగాళ్ల ప్రతిభ బయటపడుతుంది. ఇలాంటి సన్నివేశాలు మనం కేవలం అంతర్జాతీయ మ్యాచ్ల్లోనే చూస్తుంటాం. అందులో వాళ్లు ఆరితేరి ఉంటారు. కానీ, ఇప్పుడు ఓ స్కూల్ స్టూడెంట్ అలా ప్రత్యర్థి గోల్కీపర్ను బోల్తాకొట్టించి గోల్ సాధించడం విశేషం.
ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో దాన్ని చూసిన సాకర్ అభిమానులు ఇతరులకు షేర్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇది తాజాగా ఆల్ జపాన్ హైస్కూల్ టోర్నమెంట్లో రైత్సు కీజాయ్ ఒగాషి, కిండాయి వాకాయమా జట్ల మధ్య ఓ ఫుట్బాల్ మ్యాచ్లో జరిగింది. ఈ గేమ్లో ఫలితం తేలకపోవడంతో ఇరు జట్లకు షూటౌట్ అవకాశం కల్పించారు. దీంతో రైత్సు జట్టుకు చెందిన ఓ ఆటగాడు చాలా నైపుణ్యంతో గోల్ సాధించాడు. తొలుత బంతిని కిక్ చేసేందుకు కాస్త వెనక్కి వెళ్లిన అతడు.. చాలా నెమ్మదిగా కిక్ చేసేందుకు వస్తున్నట్లు కనిపించాడు. ఈ క్రమంలోనే గోల్కీపర్ను ఏమర్చడానికి ఓ ట్రిక్ ప్లే చేశాడు. బంతి దగ్గరికి వెళ్లగానే దాన్ని కుడిచేతి వైపు కిక్ చేస్తున్నట్లు ఒకసారి తన కాళ్లను కదిలించాడు. దీంతో కీపర్ అటువైపే బంతిని కిక్ చేస్తాడేమోనని అనుకున్నాడు. ఆ వెంటనే రైత్సు ఆటగాడు బంతిని ఎడమవైపు తన్ని గోల్ సాధించాడు. ఇది చూడటానికి చాలా ఆసక్తిగా ఉంది. ఇప్పుడు మీరూ చూసి ఆస్వాదించండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న