Ajinkya Rahane: పుజారా విషయంలోనూ అంతే..! రహానె ఫామ్పై ఆందోళన లేదన్న విక్రమ్
టీమ్ఇండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానెకు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్ అండగా నిలిచాడు. సుదీర్ఘ కెరీర్లో ఎవరైనా ఎత్తుపల్లాలు చవిచూడక తప్పదని పేర్కొన్నాడు. తర్వాతి మ్యాచులో అతడు రాణిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు....
లండన్: టీమ్ఇండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానెకు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్ అండగా నిలిచాడు. సుదీర్ఘ కెరీర్లో ఎవరైనా ఎత్తుపల్లాలు చవిచూడక తప్పదని పేర్కొన్నాడు. తర్వాతి మ్యాచులో అతడు రాణిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. స్వల్ప కెరీర్లోనే శార్దూల్ ఠాకూర్ కీలక ఇన్నింగ్సులు ఆడాడని ప్రశంసించాడు. నాలుగో టెస్టు ఐదోరోజు ఆటకు ముందు ఆయన మాట్లాడాడు.
ఇంగ్లాండ్ సిరీసులో అజింక్య రహానె అంచనాలను అందుకోలేకపోయాడు. పేస్ పిచ్లపై మెరుగ్గా ఆడతాడని భావించినా ఇబ్బంది పడుతున్నాడు. బయటకి స్వింగ్ అయ్యే బంతులకే కాకుండా లోపలికి వచ్చిన వాటినీ ఆడలేకపోతున్నాడు. ఫుట్వర్క్ సైతం బాగా లేకపోవడం, ఆత్మవిశ్వాసం తగ్గడంతో పరుగులేమీ చేయకుండా ఔటవుతున్నాడు. అతడి బ్యాటింగ్పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాఠోడ్ అంటున్నాడు.
‘సుదీర్ఘ కాలంగా క్రికెట్ ఆడుతున్నప్పుడు ఒడుదొడుకులు సహజమే. కెరీర్లో అనేక దశలు ఎదురవుతాయి. కొన్నిసార్లు పరుగులేమీ చేయని దశ వస్తుంది. అలాంటప్పుడే జట్టు అండగా ఉండాలి. వీలైనంత మేరకు మద్దతు ఇవ్వాలి’ అని విక్రమ్ రాఠోడ్ తెలిపాడు. నయావాల్ చెతేశ్వర్ పుజారా విషయంలోనే ఇలాగే జరిగిందని గుర్తు చేశాడు.
‘పుజారా విషయంలోనూ మనమిది చూశాం. అతడికి ఎక్కువ అవకాశాలు ఇచ్చాం. ఇప్పుడతను పుంజుకొని కీలక ఇన్నింగ్సులు ఆడాడు. అజింక్య రహానె త్వరగా ఫామ్ అందుకొని బ్యాటింగ్ విభాగంలో కీలకమవుతాడని ఆశిస్తున్నాం. అతడి గురించి ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఇంకా రాలేదని అనుకుంటున్నా’ అని రాఠోడ్ పేర్కొన్నాడు.
మానసికంగా లేదా టెక్నికల్గా రహానె ఇబ్బంది పడుతున్నాడా? అని ప్రశ్నించగా ‘మేం అత్యంత కీలకమైన సిరీసు ఆడుతున్నాం. ఇక్కడి పరిస్థితులు బ్యాటింగ్కు కష్టంగా ఉంటాయి. అందులోనూ మేం అత్యంత కఠినంగా, క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ దాడిని ఎదుర్కొంటున్నాం. అందుకే ఒక బ్యాటింగ్ విభాగంగా టెక్నిక్ గురించి ఆలోచించడం ఆఖరి వరుసలోనే ఉంటుంది’ అని విక్రమ్ బదులిచ్చాడు.
స్వల్ప కెరీర్లోనే శార్దూల్ ఠాకూర్ అత్యంత కీలక ఇన్నింగ్సులు ఆడాడని విక్రమ్ ప్రశంసించాడు. ‘ఠాకూర్ ఆకట్టుకున్నాడు. అతడు బ్యాటింగ్ చేయగలడని మనందరికీ తెలుసు. పరుగులు చేసేందుకు అతడెంతో కష్టపడతాడు. అతడి వైఖరే అతడి బలం. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతడి సానుకూల దృక్పథం, దేహభాష ఆకట్టుకున్నాయి. రిషభ్ పంత్ సైతం తన శైలికి భిన్నంగా ఆడాడు. అత్యంత క్రమశిక్షణ ప్రదర్శించాడు. పరిస్థితులకు తగినట్టు ఆడగలిగే సామర్థ్యం అతడికీ, జట్టుకు మేలు చేస్తుంది’ అని వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)