Virat Kohli: 20-30 పరుగులకు పాకులాడం.. 20 వికెట్లు తీసే బౌలర్నే ఎంచుకుంటాం
ఇంగ్లాండ్ పరిస్థితుల్లో శార్దూల్ ఠాకూర్ జట్టుకు చక్కని సమతూకం తీసుకొస్తాడని టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ అన్నాడు. గాయపడ్డ అతడి స్థానంలో మరో బౌలర్నే తీసుకుంటామని స్పష్టం చేశాడు...
లండన్: ఇంగ్లాండ్ పరిస్థితుల్లో శార్దూల్ ఠాకూర్ జట్టుకు చక్కని సమతూకం తీసుకొస్తాడని టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ అన్నాడు. గాయపడ్డ అతడి స్థానంలో మరో బౌలర్నే తీసుకుంటామని స్పష్టం చేశాడు. 20-30 పరుగుల కోసం పాకులాడటం లేదన్నాడు. దానికి బదులు 20 వికెట్లు తీసేందుకు సాయం చేసే బౌలర్నే ఎంచుకుంటామని వెల్లడించాడు. రెండో టెస్టుకు ముందు అతడు మాట్లాడాడు.
కోహ్లీ మాటలను బట్టి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, పేసర్లు ఉమేశ్ యాదవ్, ఇషాంత్శర్మలో ఎవరికి చోటు దొరుకుతుందో చూడాలి. ‘తొలి టెస్టులో జడేజా పరుగులు చేయడం సంతోషకరం. ఇది రెండో టెస్టుకు అతడిలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. దాంతో టీమ్ఇండియా బ్యాటింగ్ డెప్త్ మరింత పెరుగుతుంది. లోయర్ ఆర్డర్ పరుగుల భాగస్వామ్యమూ ముఖ్యమే’ అని కోహ్లీ అన్నాడు.
‘అవును, శార్దూల్ బ్యాటింగ్ సామర్థ్యం ఉపయోగపడేదే. అయితే పుజారా, రహానె, నాతో కూడిన బ్యాటింగ్ లైనప్ బలంగానే ఉంది. తొలి టెస్టులో మేం పరుగులు చేయనిమాట నిజమే. ఇతర బ్యాట్స్మెన్ ముందుకొచ్చేందుకు ప్రతి మ్యాచ్ ఒక అవకాశంగా మారుతుంది. రోహిత్, కేఎల్ బాగా ఆడారు. అందుకే ఒక బ్యాటింగ్ విభాగంగా మేం బాగున్నాం. శార్దూల్ లేనంత మాత్రాన ఒక బ్యాటర్ తక్కువైనట్టేమీ కాదు’ అని కోహ్లీ తెలిపాడు.
‘జట్టుకు సమతూకం తీసుకురావడమే మాకు ముఖ్యం. శార్దూల్ లేనప్పుడు మేం 20 వికెట్లు తీసేందుకు తోడ్పడే మరొకరిని చూడాలి. అతడు బ్యాటుతోనూ పరుగులు చేస్తే బాగుంటుంది. పుజారా, రహానెపై మేం ఆందోళన చెందడం లేదు. వ్యక్తిగత ప్రదర్శన కాకుండా జట్టుకు వారెలా ఉపయోగపడుతున్నారనేదే ముఖ్యం. మాది అత్యుత్తమమైన బ్యాటింగ్ లైనప్. ఇక రిషభ్ పంత్ తన సహజశైలిలో ఆడటమే ముఖ్యం. పరిస్థితులు బాగా లేనప్పుడు చెత్త షాట్లు ఆడొద్దని అతడికి తెలుసు. అదే 50-50 అవకాశం ఉంటే అతడు చెలరేగడమే మంచిది. అతడికి జట్టు యాజమాన్యం స్పష్టమైన బాధ్యతలు అప్పగించింది’ అని విరాట్ వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!