Peng Shuai Missing: పెంగ్ షువాయి.. కనిపించడం లేదా.. కనిపించకుండా చేశారా?
చైనా టెన్నిస్ క్రీడాకారిణి, మాజీ డబుల్స్ నంబర్వన్ పెంగ్ షువాయి ఆచూకీ తెలియడం లేదంటూ సామాజిక మాధ్యమాల్లో ఉద్యమం ఉధృతమైంది. దీంతో ఆమె క్షేమంగానే ఉన్నారనే ఫొటోలు...
క్షేమంగానే ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, వీడియోలు
చైనా టెన్నిస్ క్రీడాకారిణి, మాజీ డబుల్స్ నంబర్వన్ పెంగ్ షువాయి ఆచూకీ తెలియడం లేదంటూ సామాజిక మాధ్యమాల్లో ఉద్యమం ఉద్ధృతమైంది. దీంతో ఆమె క్షేమంగానే ఉన్నారనే ఫొటోలు, వీడియోలు తాజాగా తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆమె భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెకు నిజంగా ఏదైనా జరిగిందా..? లేక కావాలనే బయటి ప్రపంచానికి దూరంగా ఉందా? అర్థం కావడం లేదు.
అసలేంటీ వివాదం..?
చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఓ ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారి జాంగ్ గవోలి.. తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఈనెల 2న పెంగ్ సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆరోపణలు చేసింది. జాంగ్ తనతో శృంగారం చేయాలని బలవంతం చేశాడని, ఏడేళ్ల క్రితం అతనితో ఓ సారి శృంగారంలో పాల్గొన్నానని అందులో పేర్కొంది. కానీ తర్వాత ఆ పోస్టును తొలగించడం గమనార్హం. దీంతో అప్పటి నుంచి ఆమె కనిపించకుండా పోయింది. ఈ క్రమంలోనే షువాయికి ఏమైందోనని అభిమానులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘పెంగ్ ఎక్కడ?’’ అంటూ సాధారణ ప్రజల దగ్గర నుంచి ప్రముఖుల వరకూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనిపై పురుషుల, మహిళల టెన్నిస్ అసోసియేషన్ సభ్యులు సైతం ఆమెకు ఏమైందో తెలియజేయాలంటూ చైనా అధికారులను కోరారు.
ఎవరెవరు స్పందించారంటే..
పెంగ్ ఆచూకీ తెలియకపోవడంపై ఇటీవల జపాన్ టెన్నిస్ స్టార్ నవోమి ఒసాక, సెర్బియన్ దిగ్గజం నోవాక్ జకోవిచ్, అమెరికా స్టార్ సెరీనా విలియమ్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె ఎక్కడుందని నిలదీశారు. ‘‘మీకు ఈ వార్త గురించి తెలుసో లేదో కానీ ఓ సహచర టెన్నిస్ క్రీడాకారిణి కనిపించడం లేదని నాకు సమాచారం అందింది. లైంగిక దాడికి గురయ్యానని ఆమె చెప్పిన తర్వాతే ఆచూకీ దొరకడం లేదు. మహిళల్ని అణచివేయడమనేది ఎట్టి పరిస్థితుల్లోనూ సరైంది కాదు. ఈ పరిస్థితి షాక్కు గురిచేసింది’’ అని ఒసాక పోస్టు చేసింది. అలాగే పెంగ్ ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ప్రపంచ నంబర్వన్ జకోవిచ్ కూడా డిమాండ్ చేశాడు. సెరెనా సైతం స్పందించింది. ‘‘పెంగ్ కనిపించడం లేదనే వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆమె క్షేమంగానే ఉందని.. త్వరలోనే బయటకు వస్తుందని నమ్ముతున్నా. ఈ విషయంపై విచారణ జరపాలి. దీనిపై నిశ్శబ్దంగా ఉండలేం’’ అంటూ ట్వీట్ చేసింది.
డబ్ల్యూటీఏ ఛైర్మన్ అనుమానం..
మరోవైపు పెంగ్ సురక్షితంగానే ఉన్నానని, తాను చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని ఇటీవల డబ్ల్యూటీఏ ఛైర్మన్ స్టీవ్ సిమన్కు ఆమె ఈ మెయిల్ చేసినట్లు చైనా మీడియా సంస్థ ఒకటి ఇటీవల ట్విట్టర్లో పోస్టు చేసింది. దీంతో కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే, దీనిపై స్పందించిన సిమన్.. ఆమె నుంచి వచ్చిన ఈ మెయిల్పై తనకు సందేహాలున్నాయని స్పష్టం చేశారు. పెంగ్ ఆచూకీ దొరకకపోతే చైనాతో తమ వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకునేందుకు కూడా వెనకాడబోమని గట్టిగా హెచ్చరించాడు. ఇదిలా ఉండగా, పెంగ్ క్షేమంగానే ఉన్నట్లు డబ్ల్యూటీఏ నుంచి సమాచారం అందిందని ఏటీపీ ఛైర్మన్ గాడెంజి పేర్కొనడం గమనార్హం.
పెంగ్ ఆచూకీపై పెదవి విప్పని చైనా..
పెంగ్ షువాయి ఆచూకీపై ప్రపంచం మొత్తం ప్రశ్నిస్తున్నా ఆ దేశం మాత్రం పెదవి విప్పడం లేదు. ఈ క్రమంలోనే ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి జావో లిజియాన్ మాట్లాడుతూ.. ఇది దౌత్యపరమైన విషయం కానందున తనకు పూర్తి సమాచారం తెలియదని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం అధికారిక ప్రతినిధి లిజ్ త్రోసెల్ మాట్లాడుతూ.. పెంగ్ క్షేమంగా ఉన్నారనే సరైన సమాచారం తమకు కావాలన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎలాంటి దాపరికాలు లేని విచారణ జరగాలని ఆదేశించారు. ఆమె క్షేమంగా ఉండటం ముఖ్యమన్నారు.
ఫొటోలు, వీడియోలు కలకలం..
ఇక పెంగ్ ఫొటోలు, వీడియోలు తాజాగా ఆన్లైన్లో ప్రత్యక్షమవడం కలకలం రేపింది. అక్కడి సీజీటీఎన్ ఛానల్ ఉద్యోగి షెన్ షీవీ.. పెంగ్ ఫొటోలను ట్విట్టర్లో పోస్టు చేయడం చర్చనీయాంశమైంది. వీచాట్ అనే సామాజిక మాధ్యమంలో పెంగ్ స్వయంగా ఈ ఫొటోలు పోస్టు చేసిందని ఆయన ట్వీట్లో తెలిపాడు. అక్కడి అధికార కమ్యూనిస్ట్ పార్టీ ప్రచురించే ఆంగ్ల పత్రిక గ్లోబల్ టైమ్స్ ఎడిటర్ హూ జిజిన్ సైతం.. ‘‘అనధికార సమాచారం ప్రకారం ఈ ఫొటోలు పెంగ్ ప్రస్తుత పరిస్థితిని తెలుపుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఆమె తన సొంత ఇంట్లోనే స్వేచ్ఛగా ఉంది. తనకెలాంటి ఆటంకం కలగకూడదని అనుకుంటోంది. త్వరలోనే ఆమె బయటకు వచ్చి కార్యకలాపాలు సాగిస్తుంది’’ అని పేర్కొన్నాడు.
సాధారణ ప్రజల అనుమానం..
లైంగిక దాడి ఆరోపణలు చేసినప్పటి నుంచి కనిపించకుండా పోయిన ఆమె.. ఇంతలా ఉద్యమం జరుగుతుంటే సొంతంగా బయటకు రావొచ్చు కదా అని సాధారణ ప్రజలు ఇప్పుడు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ, ఇలా అధికార పార్టీకి చెందిన మీడియాలో ఆమె గురించి వార్తలు రావడం మరింత అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు పెంగ్ ఆచూకీ చెప్పాలంటూ అంతర్జాతీయ స్థాయిలోనూ చైనాపై ఒత్తిడి పెరిగింది. పెంగ్ క్షేమ సమాచారంపై సాక్ష్యాలు చూపించాలని యూఎస్ ప్రభుత్వం కోరుకుంటోందని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి జెన్ సాకి సైతం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మరో రెండున్నర నెలల్లో శీతాకాల ఒలింపిక్స్కు చైనా ఆతిథ్యమివ్వాల్సిన పరిస్థితుల్లో ఇప్పుడు పెంగ్ ఆచూకీ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
-ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం..
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
ఎప్పుడూ కూల్గా కనిపించే ఎంఎస్ ధోనీ (MS Dhoni) గురించి ఎవరికీ తెలియని ఓ విషయాన్ని సురేశ్ రైనా ఇటీవల బయటపెట్టాడు. -
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే ఆలోచన లేదని వెస్టిండీస్ మాజీ ఆటగాడు సునీల్ నరైన్ (Sunil Narine) అన్నాడు. -
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?