IND vs SA: ఓటమే ఎరుగని జోహానెస్బర్గ్లో ఇప్పుడెందుకు ఇలా?
టీమ్ఇండియా గత మూడు దశాబ్దాలుగా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్తున్నా ఎప్పుడూ జోహానెస్బర్గ్లో ఓటమిపాలైంది లేదు. కానీ, ఈసారి మాత్రమే విఫలమైంది...
టీమ్ఇండియా రెండో టెస్టు వైఫల్యానికి కారణాలు..
టీమ్ఇండియా గత మూడు దశాబ్దాలుగా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్తున్నా ఎప్పుడూ జోహానెస్బర్గ్లో ఓటమిపాలైంది లేదు. కానీ, ఈసారి మాత్రమే విఫలమైంది. అలాగే ఇంతకుముందెన్నడూ సెంచూరియన్లో విజయం సాధించింది లేదు. కానీ, ఈసారి అక్కడ చరిత్ర తిరగరాసి తొలి టెస్టు కైవసం చేసుకుంది. అలాంటి టీమ్ఇండియా సఫారీ గడ్డపై ఓటమి భయమే లేని వాండరర్స్ మైదానంలో తొలిసారి టెస్టు మ్యాచ్ కోల్పోయింది. ఇలా ఎందుకు జరిగిందనే విషయాలపై దృష్టిసారిస్తే పలు కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
పుజారా, రహానె ఆదుకున్నా..
ఈ మ్యాచ్లో టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్లో 202 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (50), రవిచంద్రన్ అశ్విన్ (46) మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ముఖ్యంగా సీనియర్ బ్యాట్స్మెన్ పుజారా (3), రహానె (0) విఫలమయ్యారు. దీంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఒకానొక దశలో గావస్కర్ లాంటి దిగ్గజం కూడా వాళ్లిద్దరికీ రెండో ఇన్నింగ్సే చివరి అవకాశం అన్నారు. దీంతో ఆ ఇద్దరి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే రెండో ఇన్నింగ్స్లో ఓపెనర్లు రాహుల్ (8), మయాంక్ (23) విఫలమైనా పుజారా (53), రహానె (58) రాణించారు. అర్ధ శతకాలతో ఆదుకున్నారు. హనుమ విహారి (40) సైతం వీలైనన్ని పరుగులు చేయగా.. చివరికి భారత్ 266 పరుగులకు ఆలౌటైంది. బౌన్స్కు అనుకూలించే పిచ్పై భారత బ్యాట్స్మెన్ తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
షమి, బుమ్రా విఫలం..
ఈమధ్య గెలిచిన అన్ని టెస్టుల్లో ప్రత్యర్థులను రెండు ఇన్నింగ్స్ల్లో భారత బౌలర్లు ఆలౌట్ చేశారు. దీంతో వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్నారు. మరోవైపు సెంచూరియన్లో జరిగిన తొలి టెస్టులోనూ పేస్ బౌలర్లు సమష్టిగా రాణించడంతో టీమ్ఇండియా ఈసారి అక్కడ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో ప్రధాన పేసర్ జస్ప్రిత్ బుమ్రా పూర్తిగా విఫలమయ్యాడు. మరోవైపు సీనియర్ బౌలర్ మహ్మద్ షమి రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి మూడు వికెట్లే పడగొట్టాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో (7/61) కెరీర్లోనే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసిన శార్దూల్ ఠాకూర్ రెండో ఇన్నింగ్స్లో ఒక్క వికెట్తోనే సరిపెట్టుకున్నాడు. ఇంతకుముందు శార్దూల్ ఆడిన పలు టెస్టుల్లో కీలక సమయాల్లో వికెట్లు తీసి జట్టు విజయాల్లో తన వంతు కృషి చేశాడు. మరోవైపు తొలి టెస్టులో ఆకట్టుకున్న మహ్మద్ సిరాజ్ గాయం కారణంగా ఈ మ్యాచ్లో సరిగ్గా బౌలింగ్ చేయలేకపోయాడు.
పంత్ ఆటతీరుపై విమర్శలు..
ఈ మ్యాచ్లో పూర్తిగా నిరాశపర్చింది వికెట్ కీపర్ రిషభ్ పంత్. అతడెంత మేటి ఆటగాడో అందరికీ తెలిసిందే. ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని మార్చగల నేర్పరి. తన దూకుడుతో ప్రత్యర్థి బౌలర్లను ఉతికి ఆరేయగల సమర్థుడు. అయినా, తొలి ఇన్నింగ్స్లో 17 పరుగులే చేసిన అతడు రెండో ఇన్నింగ్స్లో ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చి రాగానే భారీ షాట్కు ప్రయత్నించాడు. దీంతో ఎదుర్కొన్న మూడో బంతికే కీపర్కు క్యాచ్ ఇచ్చి డకౌటయ్యాడు. పంత్ దూకుడుగా ఆడటం తప్పు కాకపోయినా సందర్భానుసారం బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బౌన్సీ పిచ్పై బంతి ఎలా పడుతుంది.. పరిస్థితులు ఎలా ఉన్నాయనేది అర్థం చేసుకోవాలి. కానీ, అలా కాకుండా అనవసరంగా వికెట్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ విషయంపై కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం అతడితో మాట్లాడతామని చెప్పాడు. దీంతో పంత్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
క్యాచ్లు వదిలేయటం..
టీమ్ఇండియా ఇటీవల ఎంత బాగా ఆడుతున్నా అప్పుడప్పుడూ క్యాచ్లు వదిలేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదివరకు కూడా ఈ సమస్య ఉన్నా దాన్ని ఇటీవల కాస్త సరిదిద్దుకున్నారు. కానీ, మళ్లీ ఈ దక్షిణాఫ్రికా పర్యటనలో క్యాచ్లు జారవిడుస్తూ అవకాశాల్ని కోల్పోతున్నారు. సెంచూరియన్లో జరిగిన తొలి టెస్టులోనూ భారత ఫీల్డర్లు పలు క్యాచ్లు వదిలేశారు. అలాగే ఈ మ్యాచ్లోనూ దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో రెండు క్యాచ్లు వదిలేయడం మనం చూశాం. దీంతో ఈ సమస్య కూడా టీమ్ఇండియా ఓటమికి ఒక కారణంగా చెప్పొచ్చు. అశ్విన్ బౌలింగ్లో వాండర్ డస్సెన్ వికెట్ల వెనుక ఇచ్చిన క్యాచ్ను పంత్ జార విడువగా.. శార్దూల్ బౌలింగ్లో తెంబా బవుమా ఇచ్చిన రిటర్న్ క్యాచ్ను వదిలేశాడు. అప్పటికి దక్షిణాఫ్రికా స్కోర్ 180/3గా నమోదైంది. అంటే ఆ జట్టు విజయానికి అప్పటికీ 60 పరుగుల దూరంలో ఉంది.
కెప్టెన్సీలో కొరవడిన దూకుడు..
టీమ్ఇండియా విజయాల్లో కెప్టెన్ కోహ్లీ ప్రధాన పాత్ర పోషిస్తాడనే సంగతి తెలిసిందే. అతడు ఈ మధ్య బ్యాట్తో పరుగులు చేయకపోయినా ఆటగాళ్లలో స్ఫూర్తి నింపడంలో ముందుంటాడు. అగ్రెసివ్గా ఉంటూనే ఆటగాళ్లలో కసి పెంచుతాడు. కోహ్లీ మైదానంలో ఉన్నంతసేపు ఈ విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది కూడా. కానీ, ఈ మ్యాచ్కు కోహ్లీ అందుబాటులో లేడు. వెన్నునొప్పి కారణంగా దూరమయ్యేసరికి కేఎల్ రాహుల్ జట్టు పగ్గాలు అందుకున్నాడు. టీ20 కెప్టెన్గా అనుభవమున్న అతడికి ఇదే తొలి టెస్టు నాయకత్వం. దీంతో రెండో టెస్టులో పెద్దగా అగ్రెసివ్గా కనిపించలేదు. మిగతా ఆటగాళ్లను, బౌలర్లను ప్రోత్సహించడంలో రాహుల్లో ఆ దూకుడు కనిపించలేదు.
- ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
బెంగళూరు - కోల్కతా జట్ల మధ్య ఆసక్తికర పోరు నేడు. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు. -
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
బెంగళూరు, కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి ఇద్దరి క్రికెటర్లపైనే ఉంది. -
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ట్రాక్టర్ల వ్యాపారానికి ఫోర్స్ మోటార్స్ గుడ్బై
-
ఆప్కు మరో షాక్.. సత్యేందర్ జైన్పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఓకే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు