Virat Kohli: గంగూలీ వ్యాఖ్యల తర్వాత.. కోహ్లీకి మిన్నంటిన మద్దతు
టీమ్ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీకి అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. వన్డే కెప్టెన్సీ తొలగింపు వివాదం, తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో అతడి పేరు మారుమోగిపోయింది...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీకి అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. వన్డే కెప్టెన్సీ తొలగింపు వివాదం, తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో అతడి పేరు మారుమోగిపోయింది. #WorldStandswithKohli అనే హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చింది. ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్టును ఎంపిక చేసిన సందర్భంగా సెలెక్షన్ కమిటీ విరాట్ కోహ్లీని వన్డే సారథిగా తొలగిస్తూ.. రోహిత్కు ఆ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.
ఆ నిర్ణయంపై వ్యతిరేకత రావడంతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చాడు. టీ20 సారథిగా కోహ్లీ తప్పుకొంటానని చెప్పినప్పుడే.. అలా చేయొద్దని తాము వారించామన్నాడు. అలాగే పరిమిత ఓవర్ల క్రికెట్కు ఇద్దరు సారథులు ఉండకూడదని సెలెక్షన్ కమిటీ భావించిందని, దీంతో కోహ్లీని తొలగిస్తూ రోహిత్కు ఆ బాధ్యతలు అప్పజెప్పడాన్ని ముందే కోహ్లీకి చెప్పామన్నాడు. కానీ, దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లేముందు మీడియాతో మాట్లాడిన కోహ్లీ.. విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. తనని వన్డే సారథిగా తొలిగిస్తున్నారనే వార్త.. జట్టును ప్రకటించడానికి గంటన్నర ముందు మాత్రమే వెల్లడించారన్నాడు. అలాగే తాను టీ20 సారథిగా తప్పుకొంటానని చెప్పినప్పుడు బీసీసీఐ పెద్దలు ఎవరూ వద్దని చెప్పలేదన్నాడు.
ఈ క్రమంలోనే టీమ్ఇండియా గురువారం దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరి వెళ్లాక మరోసారి గంగూలీ మీడియా ముందుకు వచ్చాడు. కోహ్లీ చేసిన వ్యాఖ్యల గురించి తాను చెప్పాల్సింది ఏమీ లేదని, బీసీసీఐ ఆ విషయాన్ని చూసుకుంటుందని, మీడియా దాన్ని వదిలేయాలని అన్నాడు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహించిన కోహ్లీ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. బీసీసీఐకి వ్యతిరేకంగా #WorldStandswithKohli అనే హ్యాష్ట్యాగ్తో పోస్టులు చేశారు. మరోవైపు గంగూలీ మద్దతుదారులు సైతం #NationStandswithDada అనే హ్యాష్ట్యాగ్తో ట్వీట్లు చేశారు. అయితే, కోహ్లీకి అండగా నిలిచిన ట్వీట్లే ఎక్కువగా వచ్చాయి. దీంతో అది ట్రెండింగ్లోకి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.