Yuvraj Singh: సచిన్తో కలిసి యువీ ప్రత్యేక ఇన్నింగ్స్
యువరాజ్సింగ్.. భారత క్రికెట్లో పరిచయం అక్కర్లేని పేరు. 1983 తర్వాత టీమ్ఇండియా రెండు ప్రపంచకప్లు గెలవడంలో కీలక పాత్ర పోషించిన మేటి ఆల్రౌండర్...
ఇంగ్లాండ్పై గెలిచిన టెస్టు.. ఎప్పటికీ ప్రత్యేకమే..!
యువరాజ్సింగ్.. భారత క్రికెట్లో పరిచయం అక్కర్లేని పేరు. 1983 తర్వాత టీమ్ఇండియా రెండు ప్రపంచకప్లు గెలవడంలో కీలక పాత్ర పోషించిన మేటి ఆల్రౌండర్. పరిమిత ఓవర్ల క్రికెట్లో అసలుసిసలైన ఛాంపియన్గా పేరు తెచ్చుకున్నా.. టెస్టుల్లో మాత్రం అతడు ఆశించినంత మేర రాణించలేదు. దాంతో సుదీర్ఘ ఫార్మాట్లో సరైన గుర్తింపు దక్కలేదు. అయినా యువీ టెస్టు కెరీర్లో ఓ మధురజ్ఞాపకం దాగిఉంది. అది తన ఆరాధ్య క్రికెటర్ సచిన్ తెందూల్కర్తో కలిసి మరీ మ్యాచ్ గెలిపించాడంటే ఎంత ప్రత్యేకమో చెప్పాల్సిన పనిలేదు. ఈరోజు యువీ 40వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో.. చాలా మందికి పెద్దగా గుర్తులేని ఆ ప్రత్యేక ఇన్నింగ్స్ మీ కోసం..
అది 2008 డిసెంబర్ నెల. రెండు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో టీమ్ఇండియా విజయం సాధించగా తర్వాత మొహాలీలో జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో భారత్ 1-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. అయితే, తొలి టెస్టులో టీమ్ఇండియా గెలవడానికి ముఖ్య కారణం యువీనే. ఇంగ్లాండ్ పూర్తి ఆధిపత్యం చలాయించిన ఆ మ్యాచ్లో ఈ మాజీ ఆల్రౌండర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో మాస్టర్ బ్లాస్టర్తో కలిసి ఓ మధురజ్ఞాపకాన్ని మిగుల్చుకున్నాడు.
తొలుత ధోనీ ఒక్కడే..
చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించింది. ఓపెనర్ ఆండ్రూ స్ట్రాస్ (123; 233 బంతుల్లో 15x4) శతకంతో చెలరేగగా మరో ఓపెనర్ అలెస్టైర్ కుక్ (52; 116 బంతుల్లో 5x4) అర్ధ శతకంతో మెరిశాడు. చివర్లో మాట్ ప్రయర్ (53; 102 బంతుల్లో 1x4) సైతం హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో ఇంగ్లాండ్ 316 పరుగులకు తొలి ఇన్నింగ్స్లో ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన భారత్ 241 పరుగులకు కుప్పకూలింది. టాప్ ఆర్డర్ మొత్తం విఫలమవ్వగా కెప్టెన్ ధోనీ (53; 82 బంతుల్లో 5x4) ఒక్కడే అర్ధశతకం సాధించాడు. హర్భజన్ (40; 58 బంతుల్లో 7x4) పరుగులతో ఫర్వాలేదనిపించాడు. చివరికి ఇంగ్లాండ్కు 75 పరుగుల కీలక ఆధిక్యం లభించింది.
మళ్లీ స్ట్రాస్ శతకం..
ఇక రెండో ఇన్నింగ్స్లోనూ 311 పరుగులు చేసిన ఇంగ్లాండ్.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 75 పరుగులు కలుపుకొని టీమ్ఇండియా ముందు 387 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. స్ట్రాస్ (108; 244 బంతుల్లో 8x4) మరోసారి శతకంతో మెరవగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ పాల్ కాలింగ్వుడ్ (108; 250 బంతుల్లో 9x4) సైతం ఈసారి సెంచరీతో రాణించాడు. ఈ క్రమంలోనే టీమ్ఇండియా ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచారు. అయితే, ఓపెనర్లు గౌతమ్ గంభీర్ (66; 139 బంతుల్లో 7x4), వీరేందర్ సెహ్వాగ్ (83; 68 బంతుల్లో 11x4, 4x6) తొలి వికెట్కు 117 పరుగుల శతక భాగస్వామ్యం జోడించారు. వీరూ తొలి వికెట్గా వెనుదిరిగాక టీమ్ఇండియా వరుసగా ద్రవిడ్ (4), గంభీర్, వీవీఎస్ లక్ష్మణ్ (26)ల వికెట్లు కోల్పోయింది. దీంతో 224/4 స్కోర్తో నిలిచి మ్యాచ్పై పట్టు కోల్పోయేలా కనిపించింది.
ఇంకో వికెట్ పడి ఉంటే..
సరిగ్గా అలాంటి సమయంలోనే ఆల్రౌండర్ యువీ బరిలోకి దిగాడు. తన ఆరాధ్య క్రికెటర్ సచిన్ (103 నాటౌట్; 196 బంతుల్లో 9x4)తో కలిసి యువరాజ్ (85 నాటౌట్; 131 బంతుల్లో 8x4, 1x6) చివరి వరకూ క్రీజులో పాతుకుపోయాడు. వీరిద్దరూ ఐదో వికెట్కు అభేద్యంగా 163 పరుగులు జోడించి ఓడిపోతామనుకునే మ్యాచ్ను గెలిపించారు. వీరిద్దరిలో ఏ ఒక్కరు ఔటైనా మ్యాచ్ గమనమే మారిపోయేది. అలాంటి ఒత్తిడి పరిస్థితుల్లోనూ యువరాజ్.. సచిన్తో పాటు ఎంతో సంయమనంగా ఆడాడు. చివరికి మ్యాచ్ గెలిచాక తన మాస్టర్ను హత్తుకొని సంబరపడ్డాడు. కాగా, ఈ మాజీ ఛాంపియన్ టెస్టుల్లో 40 మ్యాచ్లే ఆడాడు. అందులో 3 శతకాలు, 11 అర్ధశతకాలే సాధించాడు. వాటన్నింటిలో ఈ ఇన్నింగ్స్ కూడా యువీకి ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఇలాంటి ఎన్నో గొప్ప విజయాలు అందించిన ఛాంపియన్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.
-ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!