Cheteshwar Pujara: కెరీర్లో వందో టెస్ట్ మైలురాయి.. పుజారా గురించి పది ఆసక్తికర విశేషాలు!
టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారా తన అంతర్జాతీయ కెరీర్లో వందో టెస్ట్ మైలురాయిని చేరుకున్నాడు. బోర్డర్-గవాస్కర్ టోర్నీలో భాగంగా బుధవారం దిల్లీలో ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ పుజారాకు వందో టెస్టు.
ఇంటర్నెట్ డెస్క్: క్లబ్, కౌంటీ, రాష్ట్రం, దేశం..ప్రాతినిధ్యం వహించే జట్టు ఏదైనా.. ఆటపై నాకున్న నిబద్ధతలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని అంటున్నాడు టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara). అభిమానులు ‘నయా వాల్’ అని పిలుచుకునే పుజారా క్రీజులో ఉన్నంతవరకు జట్టును గెలిపించాలనే లక్ష్యంతో ఉంటాడు. అలాంటి పుజారా తన కెరీర్లో వందో టెస్టు మ్యాచ్ ఆడబోతున్నాడు. బోర్డర్ - గావస్కర్ (Border Gavaskar Trophy) ట్రోఫీలో భాగంగా బుధవారం నుంచి దిల్లీలో ఆస్ట్రేలియా (Australia)తో జరిగే మ్యాచ్ పుజారాకు వందో టెస్టు. ఈ సందర్భంగా పుజారా కెరీర్ గురించి పది ఆసక్తికర విషయాలు.
- పుజారా 2010లో తన అంతర్జాతీయ కెరీర్ను ప్రారంభించాడు. బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్లో అర్ధ సెంచరీతో రాణించాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం నాలుగు పరుగులే చేసినప్పటికీ.. రెండో ఇన్నింగ్స్లో 72 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
- కెరీర్లో వందో టెస్టు ఆడుతున్న 13వ భారత ఆటగాడు పుజారా. ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లలో వందో టెస్ట్ ఆడుతున్న రెండో ఆటగాడు. పుజారా కంటే ముందు విరాట్ కోహ్లీ (గతేడాది మార్చిలో శ్రీలంకతో) వందో టెస్ట్ ఆడాడు. 2012లో ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో ఆరో ఇన్నింగ్స్లో సెంచరీ (135), తొమ్మిదో ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ (206) చేశాడు పుజారా.
- డిఫెన్స్ ఆడటంలో, స్పిన్ బౌలింగ్ను ఎదుర్కొవడంలో పుజారాది ప్రత్యేక శైలి. ఆటలో రాహుల్ ద్రవిడ్ ఆదర్శం అని చెప్పే పుజారా.. క్రీజులో పాతుకుపోయాడంటే ఔట్ చేసేందుకు బౌలర్లు శ్రమించాల్సిందే అని అతని స్టాట్స్ చెబుతుంటాయి.
- 2018లో పెర్త్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 103 బంతులను ఎదుర్కొని కేవలం 24 పరుగులే చేశాడు. 2021లో లార్డ్స్లో ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో 35 బాల్స్ ఆడిన తర్వాత తొలి రన్ చేశాడు. అంతకముందు తొలి పరుగు కోసం రాహుల్ ద్రవిడ్ 40 బంతులు ఆడటం గమనార్హం. 2007లో మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఇది జరిగింది.
- పుజారా ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో 104 మ్యాచ్లు ఆడాడు. వీటిలో 99 టెస్టు మ్యాచ్లు, ఐదు వన్డేలు. అందులో 19 సెంచరీలు, 34 అర్ధ సెంచరీలు చేశాడు. టెస్ట్ మ్యాచుల్లో 44.15 సగటుతో 7021 పరుగులు చేశాడు. ఐదు వన్డేలే ఆడిన పుజారా పెద్దగా పరుగులు చేయలేకపోయాడు.
- 2018 - 19లో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీ తన కెరీర్లో అత్యుత్తమైనదిగా పుజారా చెబుతాడు. ఈ సిరీస్లో అద్భుతమైన ఆటతీరుతో 521 పరుగులు చేసి నాలుగు టెస్టుల సిరీస్ని భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సిరీస్ విజయాన్ని టీమిండియా ‘పుజారా డ్యాన్స్’ చేస్తూ సెలబ్రేట్ చేసుకోవడం అప్పట్లో వైరల్గా మారింది.
- ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లతో జరిగిన టెస్ట్ మ్యాచ్లలో పుజారా తన కెరీర్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ మ్యాచ్లకు తన ఎంపిక ఎంత అవసరమో చెప్పేందుకు ఆ జట్లపై నమోదు చేసిన గణాంకాలే నిదర్శనం. 2013 - 15 మధ్య 22 ఇన్నింగ్స్లో ఆడిన పుజారా ఒక డబుల్ సెంచరీ, రెండు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు చేశాడు.
- పుజారా స్ట్రైక్ రేట్పై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. వాటన్నింటికీ తన ఆటతీరుతో సమాధానం చెబుతాడు. సాధారణంగా టెస్టుల్లో కొత్త బంతిని ఎదుర్కొని పరుగులు రాబట్టడం బ్యాటర్లకు సవాల్గా మారుతుంది. టాప్ ఆర్డర్ బ్యాటర్గా పుజారా క్రీజులో నిలదొక్కుకొని కొత్త బంతిని ఎక్కువ సమయం ఆడతాడు. దీంతో తర్వాత క్రీజులోకి వచ్చే బ్యాటర్లకు సులువుగా పరుగులు చేయగలరు అని విశ్లేషకులు చెబుతుంటారు.
- ప్రతి ఆటగాడికి కెరీర్లో గడ్డు పరిస్థితులు ఉన్నట్లుగానే పుజారా 2019-2022 మధ్య తీవ్రమైన ఫామ్లేమిని ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో 48 ఇన్నింగ్స్లు ఆడి ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. దీంతో సెలెక్టర్లు పక్కన పెట్టేశారు. తిరిగి ఫామ్లోకి వచ్చేందుకు ఇంగ్లాండ్లో కౌంటీల్లో ఆడి, ఆరు ఇన్నింగ్స్లో నాలుగు సెంచరీలు చేశాడు. వాటిలో రెండు డబుల్ సెంచరీలున్నాయి.
- గతేడాది డిసెంబరులో బంగ్లాదేశ్తో జరిగిన భారత జట్టుకు తిరిగి ఎంపికయ్యాడు. ఈ సిరీస్లో తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 90 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో సెంచరీ చేసి టెస్టుల్లో తను ఎంత స్పెషలిస్ట్ బ్యాటర్ అనేది మరోసారి రుజువు చేశాడు. గత వారం నాగ్పూర్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఏడు పరుగులే చేశాడు.
బుధవారం దిల్లీ వేదికగా ఆడబోయే వందో మ్యాచ్లో వంద కొట్టాలని ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ పుజారా.. మరోసారి మీ టీమ్ అంతా.. నీ స్పెషల్ డ్యాన్స్ చేయాలని కోరుకుంటున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు. -
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
భారత మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar) బర్త్ డే సందర్భంగా పెద్దఎత్తున శుభాకాంక్షలు వచ్చాయి. మాజీ క్రికెటర్లు ప్రత్యేకంగా పోస్టులు పెట్టారు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యంత దారుణంగా ట్రోలింగ్కు గురైన కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya). ఏ మైదానంలో చూసినా అతడిని హేళన చేస్తూ ఫ్యాన్స్ హోరెత్తించారు. -
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
లఖ్నవూ చేతిలో చెన్నైకి వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఈసారి సొంత మైదానంలోనే పరాజయం పొందడంతో ఆ జట్టు అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ తన టీమ్ను వెల్లడించాడు. -
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
David Warner: దిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్.. భారత గుర్తింపు కార్డు ఆధార్ కోసం పరిగెడుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో అతడు హిందీలో మాట్లాడటం విశేషం. -
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
సెంచరీతో చెన్నైపై భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో లఖ్నవూ బ్యాటర్ స్టాయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఒకదశలో ఓడిపోతామని భావించిన ఆ జట్టును చివరి వరకూ క్రీజ్లో ఉండి విజయతీరాలకు చేర్చాడు. -
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ సెంచరీతో అలరించినా.. లఖ్నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..