IND vs AUS : అదే మైదానం.. ఏడాది కిందటే ఆసీస్కు అడ్డుగా నిలిచిన భారత్
కఠినమైన ప్రత్యర్థి బౌలింగ్ను ఎదుర్కొని జట్టును ఓటమి నుంచి తప్పిస్తే అభిమానుల..
ఇప్పుడు యాషెస్ నాలుగో టెస్టులో ఇంగ్లాండ్
ఇంటర్నెట్ డెస్క్: ఏ క్రికెటర్ అయినా తానొక పరిపూర్ణ ఆటగాడిగా నిరూపించుకునే ఫార్మాట్ ఏదైనా ఉందంటే టెస్టు క్రికెట్ మాత్రమే. టీ20, వన్డేల్లో బంతిని బాదడమే పనిగా ఉంటుంది. ఎందుకంటే ఓవర్లు పరిమితంగా మాత్రమే ఉంటాయి. అలా కాకుండా ఐదు రోజులపాటు.. రోజుకు 90 ఓవర్లను తట్టుకుని నిలబడితేనే టెస్టుల్లో ఫలితం దక్కుతుంది. దీనికి ఎంతో ఓర్పు, సహనం, టెక్నిక్ ప్రదర్శించాలి. పిచ్ పరిస్థితులను అంచనా వేయకుండా దూకుడుగా ఆడేసి రన్స్ చేద్దామనుకుంటే అన్నివేళలా సాధ్యపడదు. అది తుది ఫలితం మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
కఠినమైన ప్రత్యర్థి బౌలింగ్ను ఎదుర్కొని జట్టును ఓటమి నుంచి తప్పిస్తే అభిమానుల దృష్టిలో హీరోలవుతారు. మరిప్పుడు ఎందుకంటారా...? సరిగ్గా ఏడాది కిందట ఇలానే సిడ్నీ మైదానంలో టీమ్ఇండియా అద్భుతంగా పోరాడి డ్రాగా ముగించగా.. ఇప్పుడు ఇంగ్లాండ్ టెయిలెండర్ బ్యాటర్లు ఆసీస్ విజయానికి అడ్డుపడ్డారు. హా.. టెస్టు క్రికెట్ను ఎవరు చూస్తారులే అనుకునే వారికి అసలైన రుచి చూపించారు. మరి ఆ విశేషాలు ఏంటో గుర్తుకు తెచ్చుకుందాం..
మొదట పంత్ దంచాడు.. ఆఖర్లో వారిద్దరు ఆపారు
నాలుగు టెస్టుల సిరీస్లో అప్పటికే భారత్, ఆసీస్ జట్లు చెరో విజయంతో మంచి ఊపులో ఉన్నాయి. ఇంకా రెండు టెస్టులు మిగిలి ఉన్నాయి. సిడ్నీ మైదానం వేదికగా గతేడాది జనవరి 7 నుంచి జనవరి 11వ తేదీ వరకు మూడో టెస్టు మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్లో 338 పరుగులు చేసింది. అయితే టీమ్ఇండియా 244 పరుగులకే పరిమితమైంది. 94 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆతిథ్య జట్టు 312/6 స్కోరు వద్ద డిక్లేర్డ్ చేసింది.
* ఆసీస్ నిర్దేశించిన 407 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు శుభారంభమే దక్కింది. రోహిత్ శర్మ (52), శుభ్మన్ గిల్ (31) నిలకడగా ఆడారు. తర్వాత పుజారా (77), రిషభ్ పంత్ (97) జోడీ శతక భాగస్వామ్యం నిర్మించింది. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ ఔట్ కావడంతో టీమ్ఇండియా (272/5) ఇబ్బందుల్లో పడింది. వెనుక రవీంద్ర జడేజా, విహారి, అశ్విన్ మినహా బ్యాటర్లు ఎవరూ లేరు. ఆసీస్కు 40 ఓవర్లకుపైగా ఉన్నాయి.
* అప్పటికే క్రీజ్లో కుదురుకున్న హనుమ విహారి (161 బంతుల్లో 23 నాటౌట్)తో అశ్విన్ (128 బంతుల్లో 39 నాటౌట్) జత కలిశాడు. దీంతో విహారి-అశ్విన్ కలిసి జట్టును సురక్షిత స్థానానికి చేర్చే బాధ్యతను తలెత్తుకున్నారు. ఈ జంట దాదాపు 256 బంతులను ఎదుర్కొని మరీ కేవలం 62 పరుగులే చేసి వికెట్ను చేజారనివ్వలేదు. దీంతో ఆఖరికి 131 ఓవర్లలో 334/5 స్కోరుతో టీమ్ఇండియా ఐదో రోజును ముగించింది. డ్రాతో గట్టెక్కింది.
* ఏదో పది ఓవర్లను అడ్డుకుంటున్నారని భావించిన ఆసీస్ ఆటగాళ్లకు షాక్ ఇచ్చారు. మిచెల్ స్టార్క్, హేజిల్వుడ్, ప్యాట్ కమిన్స్, గ్రీన్ వంటి ఫాస్ట్ బౌలర్లను లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఎదుర్కొని నిలబడతారని ఎవరూ ఊహించలేదు. కఠినమైన బౌన్సర్లకు తమ బాడీనే అడ్డుగా పెట్టి క్రీజ్లో పాతుకుపోయారు. దీంతో మాజీ క్రికెటర్లు సహా అభిమానులు విహారి, అశ్విన్పై ప్రశంసల వర్షం కురిపించారు. భారత టెస్టు క్రికెట్లో సిడ్నీ టెస్టు ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
స్వదేశంలో యాషెస్.. డామినేషన్ వారిదే
యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియాదే ఆధిక్యం. అదీనూ స్వదేశీ పిచ్ల మీద చెలరేగుతారు. అందరూ అనుకున్నట్లుగానే తొలి మూడు టెస్టుల్లో ఇంగ్లాండ్కు ఘోర పరాజయాలు ఎదురయ్యాయి. ఇప్పటికే విమర్శలు తారస్థాయికి చేరాయి. కెప్టెన్సీని మార్చేయాలని వాదించేవారూ లేకపోలేదు. ఇక నాలుగో టెస్టులోనూ (జనవరి 5-9) ఓడితే ఇంగ్లాండ్ పరిస్థితి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదేమో.. అయితే అసాధారణ ఆటతీరుతో ఓటమి నుంచి తప్పించుకుని డ్రాగా ముగించి కాస్త పరువు నిలబెట్టుకోగలిగింది.
* తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్లో 416/8 స్కోరు వద్ద డిక్లేర్డ్ చేసింది. తర్వాత ఇంగ్లాండ్ను 294 రన్స్కే ఆలౌట్ చేసేసింది. దీంతో ఆతిథ్య జట్టుకు 122 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో 265/6 వద్ద డిక్లేర్డ్ చేసి ఇంగ్లాండ్ ఎదుట 388 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. రెండు ఇన్నింగ్స్ల్లోనూ ఖవాజా శతకాలు బాదడం విశేషం. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 30/0తో నిలిచింది. ఇంకా 358 పరుగులను ఛేదించాల్సి ఉంది.
* చివరి రోజు 358 పరుగుల లక్ష్యం.. 90 ఓవర్లపాటు ఆట.. చేతిలో పది వికెట్లు.. మరోవైపు మాంచి ఫామ్లో ఉన్న ఆసీస్ బౌలర్లు.. ఎలాగైనా నాలుగో టెస్టునూ కైవసం చేసుకోవాలనే ఆకాంక్షతో ఉన్నారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ ఓపెనర్ క్రాలే (77), బెన్ స్టోక్స్ (60) అర్ధశతకాలు సాధించారు. అయితే మలన్ (4), హబీద్ (9) పరుగుల పరంగా విఫలమైనా.. బంతులను వృథా చేశారు. విజయం సాధించలేనప్పుడు కనీసం డ్రా కోసమైనా పోరాడటం టెస్టు క్రికెట్లో సర్వసాధారణం.
* అయితే ఆసీస్ బౌలర్లు విజృంభించి స్వల్ప వ్యవధిలో బెన్ స్టోక్స్, బట్లర్ (11), మార్క్వుడ్ (0), బెయిర్స్టో (41)ను పెవిలియన్కు పంపారు. అప్పటికి ఇంగ్లాండ్ స్కోరు 237/8. ఇంకో 10 ఓవర్ల ఆట మిగిలి ఉంది. చేతిలో ఇంకా రెండే వికెట్లు ఉన్నాయి. లీచ్ (26) వేగంగా పరుగులు చేసి తొమ్మిదో వికెట్ రూపంలో పెవిలియన్కు చేరాడు. ఇంకా అప్పటికి రెండు ఓవర్లు ఉన్నాయి. క్రీజ్లో స్టువర్ట్ బ్రాడ్ (35 బంతుల్లో 8 నాటౌట్) ఉన్నాడు. లీచ్ ఔట్ కావడంతో అండర్సన్ (ఆరు బంతుల్లో 0 నాటౌట్) బ్యాటింగ్కు వచ్చాడు. వీరిద్దరూ వికెట్ ఇవ్వకుండా ఆడేసి జట్టును ఓటమి నుంచి రక్షించారు. ఆఖర్లో వాతావరణం బాగోక స్పీడ్ తక్కువగా ఉండే బౌలర్లతోనే ఆసీస్ బౌలింగ్ చేయాల్సి రావడం కూడానూ ఇంగ్లాండ్కు కలిసొచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ