Hardik Pandya: ఆ కల తీరిపోయింది.. ఇక అదే మా లక్ష్యం: హార్దిక్ పాండ్య
ఈసారి ఐపీఎల్ సీజన్లో (IPL 2023) గుజరాత్ టైటాన్స్ సారథి హార్దిక్ పాండ్య (Hardik Pandya) తమ జట్టు ఏం చేయాలనేదానిపై వివరణ ఇచ్చేశాడు. గతేడాది ఛాంపియన్గా నిలవడం ఆనందంగా ఉందని, ఇప్పుడు దానిని కొనసాగించడానికి ప్రయత్నిస్తామని వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: అత్యంత ప్రజాదరణ పొందిన లీగుల్లో ఐపీఎల్ (IPL 2023) ముందుంటుంది. ప్రస్తుతం ఐపీఎల్ 16వ సీజన్ సిద్ధమవుతోంది. గతేడాది ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ (GT vs CSK) జట్ల మధ్య మొదటి మ్యాచ్తో మెగా టోర్నీ ప్రారంభం కానుంది. కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) నాయకత్వంలోని గుజరాత్ మరోసారి అత్యుత్తమ ప్రదర్శనతో రాణించాలని ఆశిస్తోంది. ఈ క్రమంలో కెప్టెన్ హార్దిక్ తమ జట్టు ప్రయాణం గురించి మాట్లాడిన వీడియోను గుజరాత్ టైటాన్స్ తన యూట్యూబ్ ఛానల్లో ఉంచింది. తమ ప్రాక్టీస్ను, గతేడాది గుజరాత్ సాధించిన విజయాలను, ఈ సీజన్లో ఎలా ఆడాలని అనుకుంటున్నామనే విషయాలను హార్దిక్ తెలిపాడు.
‘‘చిన్నప్పుడు నేను క్లాస్రూమ్లో చేసిన పనులకు టీచర్ మా నాన్నకు ఫిర్యాదు చేశారు. హార్దిక్ క్లాస్లో ఎప్పుడూ నిద్రపోతుంటాడని చెప్పారు. అయితే మా నాన్న మాత్రం అలాంటి వాటిని కొట్టిపడేశారు. నేను నిద్ర పోవడం లేదు. కల కంటున్నట్లు చెప్పారు. ఎప్పుడూ కలలు కంటూ ఉంటాడన్నారు. మ్యాచ్లు గెలవాలని, అందరి మనసులను గెలవాలని, భారత్ తరఫున ఆడాలని, ఐపీఎల్ విజేతగా నిలవాలని, కెప్టెన్గా టైటిల్ను ఎత్తుకోవాలని.. ఇలా కలలు కనేవాడిని. నాకిష్టమైనవారి మార్గదర్శకంలో ఒకదాని తర్వాత మరొకటి కలలు నెరవేరాయి. గత సీజన్ ముగిసిన సంవత్సరం తర్వాత మళ్లీ ఇక్కడికి (ఐపీఎల్) వచ్చా. నా గుజరాత్ టైటాన్స్ ఫ్యామిలీతో కలిశా. ఆటగాళ్లు, కోచ్, సహాయక సిబ్బంది, మేనేజ్మెంట్ మదిలో ఒకటే విషయం ఇప్పుడు మెదులుతోంది. మనం గతేడాదే ట్రోఫీని గెలిచాం. మన కల నెరవేరింది. మరి ఇప్పుడు ఇంకేం సాధించాలి. గతంలో ఏం జరిగిందనేది గుర్తుంచుకోవాలి. ఐపీఎల్ ట్రోఫీని గెలవడం ప్రతి ఒక్కరి కల. అందులో ఎలాంటి అనుమానం లేదు. అది నెరవేర్చుకున్నాం. అయితే కొనసాగించాల్సిన మరో కీలకమైన విషయం మరొకటి ఉంది. అదే నాణ్యమైన క్రికెట్ను ఆడాలి. ఇలాంటి కలకు ముగింపు ఉండదు. ఇప్పుడు ఇదే లక్ష్యంతో ముందుకు సాగుతాం’’ అని హార్దిక్ చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్