INDW vs AUSW: భారత్లో మహిళల టీ20 లీగ్ అద్భుతం చేయబోతోంది: ఆసీస్ ఆల్రౌండర్
భారత్లో జరగనున్న మహిళల టీ20 లీగ్ రానున్న రోజుల్లో అద్భుతం చేయనుందని ఆసీస్ ఆల్రౌండర్ ఎలీస్ పెర్రీ(Ellyse perry) తెలిపింది.
బ్రబౌర్న్: భారత మహిళల టీ20 లీగ్(Indian Womens T20 League)పై ఆస్ట్రేలియా ఆల్రౌండర్ ఎలీస్ పెర్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ లీగ్లో పాల్గొనేందుకు ఆసక్తిని కనబరిచింది. శనివారం బ్రబౌర్న్ వేదికగా జరిగిన మ్యాచ్ అనంతరం ఎలీస్ మాట్లాడుతూ.. టీమ్ఇండియా ఇన్నింగ్స్ సమయంలో ప్రేక్షకుల నుంచి వారికి లభించిన మద్దతు తనను ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపింది. ఇలాంటిది తాను ముందెన్నడూ చూడలేదని పేర్కొంది. ఈ సందర్భంగా మహిళల టీ20 లీగ్పై వ్యాఖ్యానించింది.
‘‘ఆట అభివృద్ధి చెందుతుంటే మనమూ దాని వెంట పయనించాల్సి ఉంటుంది. ఈ జట్టుతో బ్యాటింగ్కి దిగడం గొప్ప అనుభూతి. మ్యాచ్ సందర్భంగా ఇక్కడి ప్రేక్షకులు తమ సెల్ఫోన్లలో ఫ్లాష్ లైట్లు చూపుతూ వారి జట్టుకు మద్దతు తెలపడం అద్భుతంగా అనిపించింది. ఇలాంటిది నేనెప్పుడూ చూడలేదు. రానున్న భారత టీ20 లీగ్ మరింత గొప్పగా ఉండబోతోంది. ఆస్ట్రేలియాలో మహిళల బిగ్బాష్ లీగ్ తీసుకువచ్చిన పురోగతిని చూశాం. ఇంగ్లాండ్లోనూ హండ్రెడ్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు భారత్ వంతు రాబోతోంది’’ అంటూ ఎలీస్ పెర్రీ పేర్కొంది.
భారత్తో జరిగిన 5 టీ20ల సిరీస్(INDW vs AUSW)ను ఒక మ్యాచ్ మిగిలుండగానే 3-1తో ఆసీస్ కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఈ మ్యాచ్లో ఆ జట్టు ఆల్రౌండర్ ఎలీస్ పెర్రీ (72 నాటౌట్; 42 బంతుల్లో 7x4, 4x6)తో చెలరేగింది. భారత్లో ఎంతో కాలంగా మహిళల టీ20 లీగ్పై చర్చలు జరుగుతోన్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఈ టోర్నమెంట్ నిర్వహణకు బీసీసీఐ కసరత్తులు మొదలుపెట్టింది. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఫ్రాంచైజీల నుంచి బిడ్లను ఆహ్వానించింది. వచ్చే ఏడాది మార్చ్లో ఈ టోర్నీ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..