IND vs AUS: మూడో టెస్టులో భారత్ ఓటమి.. టాస్ నుంచి అన్నీ ప్రతికూలతలే..!
వరుసగా రెండు టెస్టుల్లో గెలిచి ఊపు మీదున్న టీమ్ఇండియాకు (Team India) ఆసీస్ గట్టి షాక్ ఇచ్చింది. మూడు రోజుల్లోపే ముగిసిన ఇందౌర్ టెస్టులో భారత్పై ఆసీస్ (IND vs AUS) విజయం సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: మూడు రోజుల్లోనే సంబరం ముగిసింది. స్పిన్ మంత్రమంటూ ప్రత్యర్థిని (IND vs AUS) ఉక్కిరిబిక్కిరి చేసేద్దామని ప్రణాళికలను రచించిన టీమ్ఇండియాకు (Team India) అదే పెను శాపమైంది. తీరా పర్యాటక టీమ్ బౌలర్లు (Bowling) ఆధిపత్యం ప్రదర్శించి గెలుపును ఎగరేసుకుపోయారు. బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) తొలి రెండు టెస్టుల్లో అద్భుత విజయాలను (IND vs AUS) నమోదు చేసిన టీమ్ఇండియా (Team India).. మూడో మ్యాచ్లో మాత్రం ఆసీస్ (Australia) చేతిలో ఓడి చతికిలపడింది. ఇలా ఓటమి చెందడానికి పలు కారణాలు ఉన్నాయనేది కాదనలేని సత్యం.
టాస్ గెలిచి మరీ.. (Toss)
భారత్లో టెస్టులు అనగానే స్పిన్ పిచ్లు అని మనందరికీ తెలుసు. ప్రత్యర్థులు కూడా అలాగే ప్రిపేర్ అవుతారు. భారత్ పర్యటనకు వచ్చిన ఆసీస్ కూడా తొలి రెండు టెస్టుల్లో ఇలానే ఇబ్బంది పడింది. ఇందౌర్ పిచ్ కూడా స్పిన్కు అనుకూలం. మరి అలాంటి మైదానంలో తలపడేటప్పుడు ప్రతి విషయంపైనా దృష్టిపెట్టాలి. కానీ, టీమ్ఇండియా మాత్రం భారీ తప్పిదంతోనే మ్యాచ్ను ప్రారంభించింది. ఇలాంటి మ్యాచ్లో టాస్ చాలా కీలకం. అలాంటిది భారత సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) టాస్ నెగ్గి మరీ తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడం క్రికెట్ విశ్లేషకులను విస్మయానికి గురి చేసింది. వచ్చిన అవకాశాలను ఆసీస్ బౌలర్లు చక్కగా వినియోగించుకున్నారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ను 109 పరుగులకే ఆలౌట్ చేశారు. ఇక్కడే ఆసీస్ విజయానికి.. భారత్ ఓటమికి నాంది పడింది.
అదేం ఆట.. ఒక్కరైనా.. (Attacking Game)
ఆసీస్ స్పిన్నర్లు ఎటాకింగ్ బౌలింగ్ చేస్తూ భారత (Team India) బ్యాటింగ్ లైనప్ను చిందరవందర చేశారు. టీమ్ఇండియా ఆటగాళ్లు వారి బౌలింగ్ దాడికి దాసోహమన్నారు. కనీసం, భారీ షాట్లు కొడదామనే ఆలోచన కూడా వచ్చినట్లు లేదు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రెండు ఇన్నింగ్స్ల్లోనూ వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. రెండో ఇన్నింగ్స్లో ఓ వైపు పుజారా (Pujara) గోడలా క్రీజ్లో పాతుకుపోతే.. మరోవైపు కనీసం దూకుడుగా ఆడదామనే ఆలోచన కూడా రాలేదు. శ్రేయస్ అయ్యర్ (Shreya iyer) ఏదో కాసేపు అలరించినా.. ప్రయోజనం మాత్రం లేదు. ఇదే సమయంలో రిషభ్ పంత్ (Rishabh Pant) గుర్తుకు రావడం సహజం. జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు దూకుడుగా ఆడి ప్రత్యర్థిని డిఫెన్స్లో పడేస్తాడనే నమ్మకం అతడిపై ఉండేది. టీ20ల్లో విధ్వంసం సృష్టించిన సూర్యకుమార్ యాదవ్ కూడా వేగంగానే ఆడతాడు. కానీ, వన్డేలు, టెస్టుల్లో విఫలం కావడం అతడికి జట్టులో స్థానం దక్కకపోవడానికి ప్రధాన కారణం. యువ బ్యాటర్ శ్రీకర్ భరత్ ఆ బాధ్యతను తీసుకుంటే బాగుండేది.
‘స్పిన్’ మంత్రం ఏమైంది..? (Spin Bowling)
స్వదేశంలో భారత బ్యాటింగ్ లైనప్ను అడ్డుకోవాలంటే ప్రత్యర్థి బౌలర్లకు అంత సులువేం కాదు. కానీ, మూడో టెస్టు మ్యాచ్లో మన బ్యాటింగ్ను చూస్తే.. ఎక్కడో విదేశాల్లో ఆడినట్లు అనిపించింది. ఆసీస్ యువ బౌలర్లు కున్మన్, మర్ఫీని ఎదుర్కోవడానికి సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇబ్బంది పడటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆసీస్ బ్యాటర్లూ కాస్త ఇబ్బంది పడినా.. ఛేదనలో మాత్రం దూకుడు ప్రదర్శించి ఫలితం రాబట్టారు. అలాంటి ఎటాకింగ్ గేమ్ మన దగ్గర లేకుండా పోయింది. మరోవైపు బౌలింగ్లోనూ ఆసీస్తో పోలిస్తే భారత స్పిన్నర్లు తేలిపోయారు. ఏకంగా 18 వికెట్లను ఆసీస్ స్పిన్ బౌలర్లు పడగొట్టగా.. భారత టాప్ స్పిన్నర్లు మాత్రం 8 వికెట్లను మాత్రమే తీశారు. నాథన్ లైయన్ ఒకే ఇన్నింగ్స్లో (భారత్ రెండో ఇన్నింగ్స్) ఎనిమిది వికెట్లు పడగొట్టి అబ్బుర పరిచాడు. జడేజా, అశ్విన్ వికెట్లు తీసినప్పటికీ.. అక్షర్ పటేల్ మాత్రం ఈ మ్యాచ్లో ఒక్క వికెట్టూ పడగొట్టలేకపోవడం గమనార్హం. కీలక సమయాల్లో ఫీల్డింగ్ వైఫల్యం కూడా భారత్ ఓటమికి ఒక కారణం. ఆసీస్ అద్భుతమైన ఫీల్డింగ్తో క్యాచ్లను ఒడిసి పట్టింది.
అదనంగా ఓ బ్యాటర్ ఉంటే.. (Extra Batter)
అహ్మదాబాద్ టెస్టు మ్యాచ్ భారత్కు మూడు రకాలుగా కీలకం కానుంది. బోర్డర్ - గావస్కర్ (Border - Gavaskar Trophy) ట్రోఫీని గెలవడంతోపాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు (WTV Final) దూసుకెళ్లడం, ఐసీసీ (ICC) టెస్టు ర్యాంకింగ్స్లో అగ్ర స్థానానికి చేరుకొనేందుకు అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి టెస్టు మ్యాచ్లోనైనా భారత్ విజయం సాధించాలంటే.. తుది జట్టు ఎంపిక చాలా కీలకం. ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్టుల్లో ఇద్దరు ఫాస్ట్ బౌలర్ల అవసరం పెద్దగా లేదు. కాబట్టి, ఇప్పుడున్న ఉమేశ్, సిరాజ్లో ఒకరికి మాత్రమే అవకాశం ఇచ్చి.. అదనంగా మరో బ్యాటర్ను ఆడించాలి. పరిస్థితులను పట్టించుకోకుండా కాస్త దూకుడుగా ఆడే సూర్యకుమార్ యాదవ్కు (Surya kumar Yadav) అవకాశం ఇస్తే బాగుంటుందనేది క్రికెట్ విశ్లేషకుల సూచన. ఓ నాలుగు భారీ షాట్లు ఆడితే ప్రత్యర్థి బౌలింగ్ గాడి తప్పేందుకు ఛాన్స్ ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్