Kapil Dev: శాస్త్రిని తొలగించడమెందుకు?
మంచి ఫలితాలు రాబడుతున్నప్పుడు టీమ్ఇండియా కోచ్ పదవి నుంచి రవిశాస్త్రిని తొలగిస్తే అర్థం లేదని దిగ్గజ క్రికెటర్ కపిల్దేవ్ అన్నారు. రాహుల్ ద్రవిడ్ రూపంలో కొత్త కోచ్ను తయారు చేసుకోవడంలో తప్పేమీ లేదన్నారు. అయితే కోచ్ల గురించి చర్చిస్తూ ఆటగాళ్లపై అనవసరంగా ఒత్తిడి పెంచొద్దని సూచించారు...
కొత్త కోచ్ల చర్చతో ఒత్తిడి పెంచొద్దు: కపిల్ దేవ్
దిల్లీ: మంచి ఫలితాలు రాబడుతున్నప్పుడు టీమ్ఇండియా కోచ్ పదవి నుంచి రవిశాస్త్రిని తొలగిస్తే అర్థం లేదని దిగ్గజ క్రికెటర్ కపిల్దేవ్ అన్నారు. రాహుల్ ద్రవిడ్ రూపంలో కొత్త కోచ్ను తయారు చేసుకోవడంలో తప్పేమీ లేదన్నారు. అయితే కోచ్ల గురించి చర్చిస్తూ ఆటగాళ్లపై అనవసరంగా ఒత్తిడి పెంచొద్దని సూచించారు.
టీమ్ఇండియా కోచ్గా రవిశాస్త్రి ఒప్పందం ఐసీసీ టీ20 ప్రపంచకప్తో ముగుస్తుంది. ఆ తర్వాత శాస్త్రి మళ్లీ దరఖాస్తు చేస్తాడో లేదో తెలియదు. మరోవైపు రాహుల్ ద్రవిడ్ శ్రీలంక పర్యటనలో భారత జట్టుకు కోచ్గా వెళ్లాడు. బీసీసీఐ అతడిని భవిష్యత్తు కోచ్గా ప్రచారం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ అంశాలపై కపిల్ దేవ్ స్పందించారు.
‘ఈ విషయంపై అంతగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ముందు శ్రీలంక సిరీస్ ముగియనివ్వండి. మన జట్టు ఎలాంటి ప్రదర్శన చేస్తుందో తెలుస్తుంది. ఒక కొత్త కోచ్ను తయారు చేసుకోవడంలో తప్పేం లేదు. ఐతే రవిశాస్త్రి బాగా పనిచేస్తున్నప్పుడు అతడిని తొలగించడంలో అర్థం లేదు. ఏదేమైనా సమయమే అన్నిటికీ జవాబు చెప్తుంది. అంతకన్నా ముందు ఇది మన కోచ్లు, ఆటగాళ్లపై అనవసర ఒత్తిడి పెంచుతుంది’ అని కపిల్ అన్నారు.
టీమ్ఇండియా కోచ్గా రవిశాస్త్రి మంచి విజయాలనే అందించాడు. రెండుసార్లు ఆస్ట్రేలియాలో టెస్టు సిరీసులు గెలిపించాడు. విదేశాల్లోనూ జట్టు బాగానే రాణిస్తోంది. 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్కు చేరుకుంది. 2021 ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ రన్నరప్గా నిలిచింది. ప్రస్తుతం రెండు భారత జట్లు వేర్వేరు దేశాల్లో పర్యటించడంపై కపిల్ మాట్లాడారు.
‘టీమ్ఇండియా రిజర్వు బెంచ్ బలం ఎక్కువే. ఆటగాళ్లకు అవకాశం లభించి టీమ్ఇండియా రెండు జట్లుగా విడిపోయి ఒకేసారి ఇంగ్లాండ్, శ్రీలంకలో గెలిస్తే అంతకన్నా ఇంకేం కావాలి. కుర్రాళ్లకు అవకాశం వస్తే మంచిదే కదా. అయితే ఒకేసారి రెండు జట్లపై ఒత్తిడి పెంచాలా అన్నది జట్టు యాజమాన్యమే చూసుకోవాలి’ అని కపిల్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
ఎప్పుడూ కూల్గా కనిపించే ఎంఎస్ ధోనీ (MS Dhoni) గురించి ఎవరికీ తెలియని ఓ విషయాన్ని సురేశ్ రైనా ఇటీవల బయటపెట్టాడు. -
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే ఆలోచన లేదని వెస్టిండీస్ మాజీ ఆటగాడు సునీల్ నరైన్ (Sunil Narine) అన్నాడు. -
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM