IPL 2023: యువకులు కాదు.. యమడేంజర్లు!
తమ సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేస్తూ భారత జట్టులోకి తలపులను తట్టిన ఆటగాళ్లు వీరంతా. భవిష్యత్తులో తప్పకుండా టీమ్ఇండియాలోకి అడుగుపెట్టేవారిలో ముందు వరుసలో వీరంతా ఉంటారు. ఐపీఎల్ 2023 సీజన్లో (IPL 2023) అదరగొట్టిన యువ ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం..
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మెగా టోర్నీతో సీనియర్లు ఫామ్లోకి వస్తారు. యువ ఆటగాళ్లు తమ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెబుతారు. ఇలాంటి వేదికను సరిగ్గా వినియోగించుకుంటే భవిష్యత్తులో జాతీయ జట్టులోకి తలుపులు తెరుచుకోవడం ఖాయం. మ్యాచ్ విజయాల్లో కీలక పాత్ర పోషించి మేం యువకులం కాదు.. యమ డేంజర్లమని నిరూపించుకున్నారు. ఇలా ఈ సీజన్లో తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న యువ క్రికెటర్ల గురించి తెలుసుకుందాం..
- యశస్వి జైస్వాల్: ఈ సీజన్లో అద్భుతంగా ఆడిన యువ క్రికెటర్ల జాబితాలో తొలి పేరు అతడిదే. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత తక్కువ బంతుల్లో (13) హాఫ్ సెంచరీ సాధించిన బ్యాటర్గా అవతరించాడు. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ కూడా ఇతడే. 14 మ్యాచుల్లో 625 పరుగులు చేశాడు. ఇందులో ఒక శతకం కూడా ఉంది. అత్యధికంగా ఫోర్లు కొట్టిన బ్యాటర్ల జాబితాలో రెండో వ్యక్తి. అందుకే, ఈ లెఫ్ట్హ్యాండర్ను జాతీయ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లూ వచ్చాయి. అత్యధికంగా వెచ్చించి (రూ. 4 కోట్లు) దక్కించుకున్న అన్క్యాప్డ్ ప్లేయర్లలో యశస్వి ముందు వరుసలో ఉంటాడు. ఈసారి ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు సొంతమైంది.
- రింకు సింగ్: ఒకే ఒక్క మ్యాచ్తో రింకు సింగ్ పేరు మారుమోగిపోయింది. గుజరాత్ టైటాన్స్పై చివరి ఓవర్లో ఐదు సిక్స్లతో కోల్కతాను గెలిపించాడు. ఆ తర్వాత మిడిలార్డర్లో కేకేఆర్కు కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. ఈ సీజన్లో 14 మ్యాచుల్లో 474 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు అర్ధశతకాలు ఉన్నాయి. దూకుడుగా ఆడిన రింకు సింగ్ను గత వేలంలో కోల్కతా కేవలం రూ.55 లక్షలకే సొంతం చేసుకుందంటే నమ్మలేం కదా.. కోల్కతా ప్లేఆఫ్స్కు వెళ్లకపోయినా.. రింకు సింగ్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. రెండో క్వాలిఫయర్ మ్యాచ్ సందర్భంగా నరేంద్ర మోదీ స్టేడియం వద్ద రింకు సింగ్ కటౌట్ పెట్టడం విశేషం.
- తిలక్ వర్మ: ఈ హైదరాబాదీ కుర్రాడు ముంబయి ఇండియన్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్లో ఆడిన 11 మ్యాచుల్లో 343 పరుగులు సాధించాడు. సూర్యకుమార్యాదవ్, టిమ్ డేవిడ్ వంటి హార్డ్ హిట్టర్లు ఉన్నప్పటికీ తన ప్రభావం జట్టుపై పడేలా చేశాడు. తొలి గేమ్లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విరుచుకుపడ్డాడు. ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ జట్టుపైనా దూకుడుగా ఆడాడు. క్వాలిఫయర్ -2లోనూ గుజరాత్పై 14 బంతుల్లోనే 43 పరుగులు సాధించాడు. ఆ మ్యాచ్లో ముంబయి ఓడినా.. తిలక్ వర్మ ఇన్నింగ్స్ మాత్రం అద్భుతమే. ఇలాంటి ఆటగాడిని ముంబయి రూ. 1.70 కోట్లకు కొనుగోలు చేసింది.
- సాయి సుదర్శన్: గుజరాత్ టైటాన్స్లో బ్యాటర్లకు కొదవేంలేదు. కానీ, చెన్నైకి చెందిన యువ ఆటగాడు సాయి సుదర్శన్ను గుజరాత్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించింది. ఈ సీజన్లోనే అత్యంత నిలకడైన ఆటతీరును ప్రదర్శించిన బ్యాటర్ సాయి సుదర్శనే. గుజరాత్ టైటాన్స్ రూ. 20 లక్షలకే సొంతం చేసుకున్న సాయి గతేడాది ఐదు మ్యాచ్లు ఆడాడు. ఈసారి ఫైనల్ సహా ఎనిమిది మ్యాచుల్లో మెరిశాడు. ప్రతి మ్యాచ్లోనూ తన ప్రభావం చూపించాడు. సాయి 141.40 స్ట్రైక్రేట్తో 51.71 సగటున 362 పరుగులు సాధించాడు. ఇందులో చెన్నైపై కేవలం 47 బంతుల్లోనే 96 పరుగులు సాధించి అబ్బురిపరిచాడు.
- ఆకాశ్ మధ్వాల్: బుమ్రా, ఆర్చర్ లేని లోటును ముంబయి ఇండియన్స్కు తెలియనీయకుండా చేయడంలో ఆకాశ్ మధ్వాల్ బౌలింగ్లో రాణించాడు. ముంబయి తరఫున ఈ సీజన్లో 8 మ్యాచ్లు ఆడిన మధ్వాల్ 14 వికెట్లు తీశాడు. ఇందులో 5/5 వంటి అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసి ముంబయి క్వాలిఫయర్ 2లోకి వెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. చాలా ఆలస్యంగా క్రికెట్ కెరీర్ను ఎంచుకుని ముంబయి దృష్టిలో పడిన మధ్వాల్.. సీనియర్లు లేకపోవడంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. కేవలం రూ. 20 లక్షల బేస్ ప్రైస్కే మధ్వాల్ ముంబయి సొంతమయ్యాడు.
- తుషార్ దేశ్పాండే: ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ దళాన్ని నడిపిన బౌలర్కు పూర్వానుభవం కేవలం ఏడు మ్యాచ్లు మాత్రమే. అయినా, ఆరంభంలో ఇబ్బంది పడినప్పటికీ కీలక బౌలర్గా మారి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడే తుషార్ దేశ్పాండే. ఈ సీజన్లో 16 మ్యాచుల్లో 21 వికెట్లు తీశాడు. చెన్నై తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా మారాడు. దీనింతటికీ కారణం ఎంఎస్ ధోనీ నాయకత్వం వల్లేనని పాండే వినమ్రంగా చెబుతాడు. ఒకటీ రెండు మ్యాచుల్లో విఫలమైనప్పటికీ అవకాశాలు ఇస్తూ ఉండటం వల్ల నిరూపించుకోగలిగాడు. ఫైనల్ మ్యాచ్ మినహా మిగతా వాటిల్లో నాణ్యమైన ప్రదర్శనే ఇచ్చాడు. సీఎస్కే అతడిని రూ. 20 లక్షలకే దక్కించుకుని రాటుదేలేలా చేసింది.
- సుయాశ్ శర్మ: కోల్కతా నైట్రైడర్స్ జట్టులో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ వంటి విభిన్న స్పిన్నర్లు ఉన్నారు. వారిద్దరిని కాదని మూడో స్పిన్ బౌలర్కు అవకాశం రావడం కష్టమే. కానీ, తనకు వచ్చిన ఛాన్స్ను సుయాశ్ నిలబెట్టుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కీలక వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై డెబ్యూ మ్యాచ్లోనే అనుజ్ రావత్, దినేశ్ కార్తిక్ వంటి ప్రమాదకర బ్యాటర్లను ఔట్ చేశాడు. ఈ సీజన్లో మొత్తం 11 మ్యాచుల్లో 10 వికెట్లు తీశాడు. ఇతడిని కోల్కతా కేవలం రూ. 20 లక్షలకే సొంతం చేసుకుంది.
- నెహాల్ వధెరా: ఎలిమినేటర్ మ్యాచ్లో లఖ్నవూకు మంచి లక్ష్యం నిర్దేశించడంలో ముంబయి బ్యాటర్ నెహాల్ వధెరాదే కీలక పాత్ర. కేవలం చివర్లో బ్యాటింగ్కు దిగిన వధెరా కేవలం 12 బంతుల్లోనే 23 పరుగులు సాధించాడు. ఇవే ముంబయి గెలవడంలో కీలక పాత్ర పోషించింది. వన్డౌన్తోపాటు మిడిలార్డర్లో ఆడిన వధెరా 14 మ్యాచుల్లోని 10 ఇన్నింగ్స్ల్లో 241 పరుగులు సాధించాడు. డెత్ ఓవర్లలో దూకుడుగా ఆడటంలో వధెరా తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.
- మయాంక్ మార్కండే: గత కొన్ని సీజన్ల నుంచి సన్రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ అద్భుతంగా ఉండేది. కానీ, ఈ సారి మాత్రం గొప్పగా ఏమీ లేదు. వాషింగ్టన్ సుందర్ గాయపడటంతో స్పిన్ విభాగం బలహీనంగా మారింది. కానీ, మయాంక్ మార్కండే మాత్రం అతి తక్కువ ఎకామనీతో ప్రత్యర్థులను కట్టిపడేశాడు. పది మ్యాచుల్లో 7.89 ఎకానమీతో 12 వికెట్లు పడగొట్టాడు. భువీ (16) తర్వాత అత్యధిక వికెట్లు తీసిన సన్రైజర్స్ హైదరాబాద్ కావడం గమనార్హం. అయితే, భువనేశ్వర్ కంటే తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశాడు.
- యశ్ ఠాకూర్: ఎలిమినేటర్ మ్యాచ్లో లఖ్నవూ సూపర్ జెయింట్స్ ఓడిపోయింది. కానీ, ఆ జట్టు బౌలర్ యశ్ ఠాకూర్ ప్రదర్శన మాత్రం ఆకట్టుకుంది. ముంబయి కీలక బ్యాటర్లు ఇషాన్ కిషన్, టిమ్ డేవిడ్, నెహాల్ వధెరాను ఔట్ చేసి సంచలన బౌలింగ్ చేశాడు. ఈ సీజన్లో యశ్ ఠాకూర్ 9 మ్యాచుల్లో 13 వికెట్లు తీశాడు. ఎకానమీ కాస్త ఎక్కువగా (9.07) ఉన్నప్పటికీ బౌలింగ్ వైవిధ్యం మాత్రం అద్భుతంగా ఉంది. యశ్ ఠాకూర్ కోసం గత వేలంలో పంజాబ్, లఖ్నవూ మధ్య మంచి పోటీ వచ్చింది. రూ. 20 లక్షల బేస్ ప్రైస్తో బరిలోకి దిగిన యశ్ చివరికి రూ. 45 లక్షలను తన ఖాతాలో వేసుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
దాదాపు రెండు నెలలపాటు క్రికెట్ అభిమానులను అలరించే ఐపీఎల్.. రికార్డులను ఖాతాలో వేసుకుంటోంది. -
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యను ముంబయి మేనేజ్మెంట్ కెప్టెన్గా నియమించుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఆ ఫ్రాంచైజీపై ట్రోలింగ్ వచ్చింది. ఇప్పుడు ముంబయి వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోవడంతో పాండ్య సారథ్యంపై విమర్శల దాడి ఎక్కువైంది. -
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
తన అభిమాన క్రికెటర్తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఎప్పటికీ మరిచిపోలేనని చెన్నై ఆటగాడు సమీర్ రిజ్వీ వ్యాఖ్యానించాడు. -
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్కతా మాజీ ఆటగాడు
కోల్కతా ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిత్ వల్ల చాలామంది విదేశీ క్రికెటర్లు ఇబ్బందిపడ్డారని నమీబియా క్రికెటర్ వ్యాఖ్యానించడం సంచలనమైంది. -
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
ముంబయి బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వడంతో హైదరాబాద్ రికార్డు స్కోరును నమోదు చేసి చరిత్ర సృష్టించింది. దీంతో ఐపీఎల్ 17వ సీజన్లో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. -
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్
కావ్యా మారన్.. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని. ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ భారీ స్కోరు సాధించడంతో ఆమె ఒక్కసారిగా నెట్టింట వైరల్గా మారారు. -
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ బోణీ కొట్టింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబయిని చిత్తు చేసింది. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి. -
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
స్టిమాక్ను తప్పించాల్సిందే
ఫుట్బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో చిన్న జట్టు అఫ్గానిస్థాన్ చేతిలో భారత్ అనూహ్య ఓటమితో కోచ్ స్టిమాక్ను తప్పించాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి