Harshal Patel: ఒకే సమయంలో బాధ - ఆనందం కలిగిన క్షణాలవే: హర్షల్ పటేల్
ఐపీఎల్ (IPL)లో విజయవంతమైన బౌలర్లలో ఆర్సీబీ ఆటగాడు హర్షల్ పటేల్ కూడా ఉంటాడు. ఇటీవలే అత్యంత వేగంగా ఐపీఎల్లో వంద వికెట్లు తీసిన భారత బౌలర్గా రికార్డు సృష్టించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా వంద వికెట్లు తీసిన భారత బౌలర్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఆటగాడు హర్షల్ పటేల్ (Harshal Patel) అవతరించాడు. ఐదు రోజుల కిందట లఖ్నవూపై రెండు వికెట్లను తీయడంతో ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న భువనేశ్వర్ కుమార్ 81 ఇన్నింగ్స్ల్లో వంద వికెట్లు తీయగా.. ఇప్పుడు హర్షల్ 79 ఇన్నింగ్స్ల్లోనే ఆ మార్క్ను తాకాడు. అంతర్జాతీయంగా ఐపీఎల్లో అత్యంత వేగంగా 100 వికెట్లను తీసిన బౌలర్లలో మూడో ఆటగాడు కావడం విశేషం. హర్షల్ కంటే ముందు రబాడ (64 ఇన్నింగ్స్లు), లసిత్ మలింగ (70 ఇన్నింగ్స్లు) తొలి రెండు స్థానాల్లో నిలిచారు. మూడో స్థానంలో నిలవడంపై ఆనందం వ్యక్తం చేసిన హర్షల్ పటేల్.. ఆర్సీబీ బ్రాడ్కాస్ట్తో మాట్లాడుతూ తన జీవితంలో కొద్దిరోజుల వ్యవధిలో సంతోషం- దుఃఖం చోటు చేసుకున్న సంఘటనను గుర్తు చేసుకున్నాడు.
‘‘నేను క్వారంటైన్లో ఉన్నప్పుడు మా సోదరి మరణవార్త విన్నాను. ఆ సమయంలో ఒంటరిగా ఉండటంతో బాగా ఏడ్చేశాను. బంధువుల నుంచి ఫోన్లు ఎక్కువగా వచ్చాయి. ఆ సమయంలో బాధను పంచుకోవడానికి కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నారు. ఆ వెంటనే నేను బయోబబుల్ను వీడి ఇంటికి వెళ్లిపోయా. ఆ సంఘటన జరిగిన వారం రోజుల తర్వాత నాకు కొడుకు పుట్టాడు. పది రోజుల వ్యవధిలోనే బాధ, సంతోషం అనుభవించా. ఆ సమయంలో ఎలా ప్రవర్తించాలో కూడా అర్థం కాలేదు. అయితే, నా కొడుకును చూసినప్పుడు మనసుకు సంతోషంగా అనిపించింది’’ అని హర్షల్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా