T20 World Cup: టీమిండియాలోని ఆ ఇద్దరితో మాత్రం జాగ్రత్త: పాక్ బ్యాటింగ్ కన్సల్టెంట్
ఈ బ్యాటర్తో పాకిస్థాన్కు ముప్పు తప్పదన్న మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్
ఇంటర్నెట్డెస్క్: భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఇరు దేశాల అభిమానులకే కాదు.. యావత్ క్రికెట్ క్రీడాభిమానులకు ఆసక్తి ఉంటుంది. ప్రపంచకప్ మ్యాచుల రికార్డుల్లో పాక్పై టీమిండియాదే హవా. మరి టీ20 ప్రపంచకప్లో భాగంగా ఈ నెల 24న దుబాయ్ వేదికగా జరగనున్న మ్యాచ్లో ఎవరు విజయం సాధిస్తారనే దానిపై విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు తమ విశ్లేషణలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో భారత్, పాక్ మ్యాచ్పై ఆసీస్ మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ స్పందించాడు. ఆయన ప్రస్తుతం పాకిస్థాన్ బ్యాటింగ్ కన్సల్టెంట్గా వ్యవహరిస్తున్నాడు.
నాయకత్వమే కీలకం
టీమిండియా, పాక్ జట్ల మధ్య పోరు ఎంతో ఉత్కంఠగా ఉంటుందని హేడెన్ అన్నాడు. ఇలాంటి పెద్ద మ్యాచ్లో చిన్న తప్పిదాలే పెను ప్రమాదమవుతాయన్నాడు. అయితే నాయకత్వమే ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పాడు. ఐపీఎల్లో సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ, కేకేఆర్ సారథి ఇయాన్ మోర్గాన్ను దీనికి ఉదాహరణగా పేర్కొన్నాడు. ‘‘వారిద్దరి వ్యక్తిగత ప్రదర్శన సరిగా లేకపోయినా జట్టును ఫైనల్కు చేర్చారు. సీఎస్కే కప్ను కొట్టడంలో ఎంఎస్ ధోనీ పాత్ర ఎనలేనిది. నాయకుడిగా జట్టును నడిపించిన తీరు అద్భుతం. అలాగే పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ నాయకుడిగా, బ్యాటర్గా రాణించాలి. టోర్నీలోని ప్రతి బౌలర్ అతడినే లక్ష్యంగా చేసుకుంటారు. సారథిగా, బ్యాటర్గా బాబర్పై అదనపు ఒత్తిడి ఉంటుంది. ఈ సమయంలోనే రెండింటిని సమతుల్యం చేసుకోవాలి’’ అని సూచించాడు.
గత కొన్నేళ్లుగా భారత క్రికెట్ను దగ్గర్నుంచి చూస్తున్న హేడెన్ కీలకమైన పాకిస్థాన్తో మ్యాచ్లో ఇద్దరు బ్యాటర్లు కీలకమవుతారని బలంగా విశ్వసిస్తున్నాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్, వికెట్ కీపర్ రిషభ్ పంత్తో పాక్కు ముప్పు ఉండబోతోందని అంచనా వేశాడు. ‘‘ కేఎల్ రాహుల్ను కొన్ని రోజులుగా అబ్జర్వ్ చేస్తున్నా. యువ క్రికెటర్ నుంచి కీలకమైన బ్యాటర్గా ఎదిగిన కేఎల్ రాహుల్తో పాక్కు అతిపెద్ద ముప్పు ఉంటుంది. పొట్టి క్రికెట్లో తొలినాళ్లలో రాహుల్ ఇబ్బంది పడిన సందర్భాలు చూశా. బౌలర్లను శాసించడం గమనించా. కాబట్టే కేఎల్ రాహుల్తో జాగ్రత్తగా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. అలానే విధ్వంసం సృష్టించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే రిషభ్ పంత్తో కూడా అప్రమత్తంగా ఉండాలి. గతంలో ఆసీస్, ఇంగ్లాండ్ జట్ల మధ్య యాషెస్ సిరీస్ ఉత్కంఠ కలిగించే మ్యాచుల్లో టాప్లో ఉండేది. అయితే భారత్, పాక్ పోరు ముందు మరేదీ సాటి రాదు. ఈ టోర్నీలో పాక్ ఆటగాళ్లు బాబర్ అజామ్, రిజ్వాన్, ఫఖర్ జమాన్ కీలకమైనవాళ్లు’’ అని విశ్లేషించాడు. పాక్ క్రికెట్లో తన పాత్రపైనా క్లారిటీ ఇచ్చేశాడు. ప్రపంచకప్ సందర్భంగా ఎదుర్కోబోయే అంశాల గురించి ఆటగాళ్లను సన్నద్ధత చేయడమే తన లక్ష్యమని వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్