IND vs AUS: ఆఖరిది ఆసీస్కు
ఆసీస్ను వైట్వాష్ చేయాలన్న భారత్ ఆశ నెరవేరలేదు. ప్రపంచకప్నకు ముందు చాలా విధాలుగా సంతృప్తినిచ్చిన వన్డే సిరీస్ను ఆ జట్టు ఓటమితో ముగించింది.
మెరిసిన మ్యాక్స్వెల్, మార్ష్
చివరి వన్డేలో భారత్ పరాజయం
ఆసీస్ను వైట్వాష్ చేయాలన్న భారత్ ఆశ నెరవేరలేదు. ప్రపంచకప్నకు ముందు చాలా విధాలుగా సంతృప్తినిచ్చిన వన్డే సిరీస్ను ఆ జట్టు ఓటమితో ముగించింది. రోహిత్ అదరగొట్టినా.. మిడిల్ ఆర్డర్ తడబడడంతో ఆఖరి మ్యాచ్లో భారత్కు నిరాశ తప్పలేదు. ఆఫ్స్పిన్తో మ్యాక్స్వెల్, మెరుపు బ్యాటింగ్తో మార్ష్ ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించారు. తొలి రెండు మ్యాచ్ల్లో ఓడి సిరీస్ను కోల్పోయిన కంగారూలకు.. ప్రపంచకప్ ముంగిట ఈ విజయం కాస్త ఊరట.
రాజ్కోట్
మిడిల్ ఆర్డర్ నిరాశపరచడంతో బుధవారం జరిగిన చివరిదైన వన్డేలో భారత్ 66 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. మిచెల్ మార్ష్ (96; 84 బంతుల్లో 13×4, 3×6), స్మిత్ (74; 61 బంతుల్లో 8×4, 1×6), లబుషేన్ (72; 58 బంతుల్లో 9×4), వార్నర్ (56; 34 బంతుల్లో 6×4, 4×6) చెలరేగడంతో మొదట ఆసీస్ 7 వికెట్లకు 352 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (81; 57 బంతుల్లో 5×4, 6×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడినా.. ఛేదనలో భారత్ 49.4 ఓవర్లలో 286 పరుగులకే ఆలౌటైంది. కోహ్లి (56; 61 బంతుల్లో 5×4, 1×6), శ్రేయస్ అయ్యర్ (48; 43 బంతుల్లో 1×4, 2×6) రాణించారు. పార్ట్ టైమ్ స్పిన్నర్ మ్యాక్స్వెల్ (4/40) తన స్పిన్తో టీమ్ఇండియా పతనాన్ని శాసించాడు. అతడే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు. గిల్కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది. తొలి రెండు మ్యాచ్ల్లో గెలిచిన భారత్ 2-1తో సిరీస్ను సొంతం చేసుకుంది.
ఆరంభం బాగున్నా..: ఛేదనలో భారత్కు శుభారంభమే లభించింది. ఇషాన్ కిషన్ గైర్హాజరీలో రోహిత్తో కలిసి సుందర్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. అతడు సాధికారికంగా ఆడలేకయినా.. రోహిత్ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. కళ్లు చెదిరే షాట్లు ఆడిన అతడు.. ఎడాపెడా సిక్స్లతో అభిమానులను ఉర్రూతలూగించాడు. 11వ ఓవర్లో సుందర్ ఔటయ్యేటప్పటికి భారత్ స్కోరు 74. ఆ తర్వాత రోహిత్కు తోడైన కోహ్లి కూడా దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో భారత్ 21వ ఓవర్లో 144/1తో బలమైన స్థితిలో నిలిచింది. కానీ మ్యాక్స్వెల్ ఓ అనుకోని రిటర్న్ క్యాచ్తో రోహిత్ ఇన్నింగ్స్ ముగిసింది. అదే మ్యాచ్లో మలుపు. ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు పడ్డాయి. మ్యాక్స్వెల్ కీలక వికెట్లతో భారత్ను దెబ్బతీశాడు. శ్రేయస్ నిలిచినా.. అతడి ప్రదర్శన ఏమాత్రం సరిపోలేదు. జట్టు స్కోరు 171 వద్ద కోహ్లీని మ్యాక్స్వెల్ వెనక్కి పంపాక.. రాహుల్ (26)తో కలిసి శ్రేయస్ జట్టును నడిపించే ప్రయత్నం చేశాడు. 35వ ఓవర్లో భారత్ 223/3తో నిలిచింది. సాధించాల్సిన రన్రేట్ పెరిగిపోయింది. ఆ దశలో రాహుల్ను స్టార్క్ ఔట్ చేయగా.. పది పరుగుల తర్వాత సూర్యకుమార్ (8)ను హేజిల్వుడ్ వెనక్కి పంపాడు. 39వ ఓవర్లో శ్రేయస్ను మ్యాక్స్వెల్ ఔట్ చేయడంతో ఆసీస్ పట్టుబిగించింది. మ్యాచ్పై భారత్ ఆశలు కోల్పోయింది. ఆ తర్వాత జడేజా (35) ఆట ఓటమి అంతరాన్ని తగ్గించిందంతే.
మార్ష్ ధనాధన్: అంతకుముందు బ్యాటర్ల జోరుతో 32వ ఓవర్లో 242/2తో ఆస్ట్రేలియా 400 దాటేలా కనిపించింది. కానీ బలంగా పుంజుకున్న భారత బౌలర్లు మిడిల్ ఆర్డర్ను దెబ్బతీయడం ద్వారా కంగారూలను అదుపు చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్కు ఓపెనర్లు వార్నర్, మార్ష్ అదిరే ఆరంభాన్నిచ్చారు. బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్.. ఇలా ఏ బౌలర్నూ వదలకుండా బౌండరీల మోత మోగిస్తూ చెలరేగిపోయారు. 8 ఓవర్లకు స్కోరు 78/0. ప్రసిద్ధ్ బౌలింగ్లో వార్నర్ ఔటైనా.. స్మిత్తో కలిసి మార్ష్ మరో మెరుపు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సెంచరీ ముంగిట మార్ష్ నిష్క్రమించినా.. లబుషేన్తో కలిసి స్మిత్ ఇన్నింగ్స్ను నడిపించాడు.ఆసీస్ 31 ఓవర్లలో 237/2తో నిలిచింది. అయితే బంతితో పుంజుకున్న భారత్ను ఆసీస్ దూకుడును నియంత్రించగలిగింది. ఓ వైపు లబుషేన్ బాగానే ఆడినా.. మరోవైపు నుంచి క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టింది. స్కోరు వేగానికి అడ్డుకట్ట వేసింది.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: వార్నర్ (సి) రాహుల్ (బి) ప్రసిద్ధ్ 56; మిచెల్ మార్ష్ (సి) ప్రసిద్ధ్ (బి) కుల్దీప్ 96; స్మిత్ ఎల్బీ (బి) సిరాజ్ 74; లబుషేన్ (సి) శ్రేయస్ (బి) బుమ్రా 72; కేరీ (సి) కోహ్లి (బి) బుమ్రా 11; మ్యాక్స్వెల్ (బి) బుమ్రా 5; గ్రీన్ (సి) శ్రేయస్ (బి) కుల్దీప్ 9; కమిన్స్ నాటౌట్ 19; స్టార్క్ నాటౌట్ 1; ఎక్స్ట్రాలు 9 మొత్తం: (50 ఓవర్లలో 7 వికెట్లకు) 352; వికెట్ల పతనం: 1-78, 2-215, 3-242, 4-267, 5-281, 6-299, 7-345; బౌలింగ్: బుమ్రా 10-0-81-3; సిరాజ్ 9-0-68-1; ప్రసిద్ధ్ కృష్ణ 5-0-45-1; జడేజా 10-0-61-0; సుందర్ 10-0-48-0; కుల్దీప్ యాదవ్ 6-0-48-2
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) అండ్ (బి) మ్యాక్స్వెల్ 81; సుందర్ (సి) లబుషేన్ (బి) మ్యాక్స్వెల్ 18; కోహ్లి (సి) స్మిత్ (బి) మ్యాక్స్వెల్ 56; శ్రేయస్ (బి) మ్యాక్స్వెల్ 48; రాహుల్ (సి) కేరీ (బి) స్టార్క్ 26; సూర్యకుమార్ (సి) మ్యాక్స్వెల్ (బి) హేజిల్వుడ్ 8; జడేజా ఎల్బీ (బి) సంఘా 35; కుల్దీప్ (బి) హేజిల్వుడ్ 2; బుమ్రా (సి) లబుషేన్ (బి) కమిన్స్ 5; సిరాజ్ (సి) కమిన్స్ (బి) గ్రీన్ 1; ప్రసిద్ధ్ నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 6 మొత్తం: (49.4 ఓవర్లలో ఆలౌట్) 286; వికెట్ల పతనం: 1-74, 2-144, 3-171, 4-223, 5-233, 6-249, 7-257, 8-270, 9-286; బౌలింగ్: స్టార్క్ 7-0-53-1; హేజిల్వుడ్ 8-0-42-2; కమిన్స్ 8-0-59-1; గ్రీన్ 6.4-0-30-1; మ్యాక్స్వెల్ 10-0-40-4; తన్వీర్ సంఘా 10-0-61-1
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Rohit Sharma: రోహిత్ కెప్టెన్సీని ఇష్టపడటానికి కారణమదే: బ్రెండన్ మెక్కల్లమ్
వన్డే ప్రపంచ కప్లో భారత్ను ఫైనల్కు చేర్చిన కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) దూకుడైన నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటాడని ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ వ్యాఖ్యానించాడు. -
Deepak Chahar: ఆయన్ను సరైన సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లగలిగాం: దీపక్ చాహర్
వైద్యపరమైన అత్యవసర పరిస్థితి కారణాలతో దీపక్ చాహర్ (Deepak Chahar) ఆసీస్తో ఐదో టీ20లో ఆడలేదు. దీంతో అభిమానులంతా ఏమైందోనని కంగారు పడ్డారు. దానికి దీపక్ చాహర్ స్పందించాడు. -
IND vs SA: దక్షిణాఫ్రికాతో సిరీస్.. వారిద్దరి మధ్య డైరెక్ట్ షూటౌట్: భారత మాజీ క్రికెటర్
భారత జట్టులో (Team India) ఓపెనర్లకు కొదవేం లేదు. అయితే, తుది జట్టులో ఎవరికి స్థానం దక్కుతుందనేది ఆసక్తికరం. టీ20 వరల్డ్కప్లో రోహిత్ కెప్టెన్సీ చేపడతాడని తెలుస్తోంది. దీంతో అతడికి జోడీగా ముగ్గురు ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అందులోనూ ఇద్దరికి దక్షిణాఫ్రికాతో సిరీస్ అత్యంత కీలకం కానుంది. -
Lionel Messi: టైమ్ మ్యాగజైన్ ‘అథ్లెట్ ఆఫ్ ది ఇయర్’గా మెస్సీ
ఫుట్బాల్ దిగ్గజ ఆటగాడు మెస్సీ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. టైమ్ పత్రిక అతడిని ఈ ఏడాది అత్యుత్తమ అథ్లెట్గా ప్రకటించింది. -
Team India: ధోనీలాంటి కెప్టెనే రోహిత్.. వారికి ఎల్లవేళలా అండగా ఉంటాడు: శ్రీశాంత్
వన్డే ప్రపంచ కప్లో (ODI World Cup 2024) భారత్ను ఫైనల్కు చేర్చిన రోహిత్ శర్మ నాయకత్వంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. అతడి కెప్టెన్సీని ధోనీతో పోలుస్తూ మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. -
T20 WC 2024: టీ20 ప్రపంచకప్లో రోహితే సారథి!
వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియాకు రోహిత్ శర్మ నాయకత్వం వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మెగా టోర్నీలో జట్టును నడిపించడానికి రోహితే సరైన వ్యక్తని కోచ్ రాహుల్ ద్రవిడ్, సెలక్టర్లు సహా బీసీసీఐలో అందరూ ఏకాభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. -
INDw vs ENGw: భారత అమ్మాయిలకు సవాల్
భారత మహిళల క్రికెట్ జట్టుకు సవాల్.. బలమైన ఇంగ్లాండ్తో మూడు టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ జరిగేది బుధవారమే. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్.. ఈ ఏడాది టీ20ల్లో మెరుగైన ప్రదర్శనే చేసింది. ఈ ఫార్మాట్లో ఆసియా క్రీడల్లో పసిడి పతకం గెలవడమే కాదు.. -
Pro Kabaddi League: విజృంభించిన సోను
రైడర్ సోను జగ్లాన్ (10 పాయింట్లు) అదరగొట్టడంతో ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-10లో గుజరాత్ జెయింట్స్ హ్యాట్రిక్ సాధించింది. జోరు కొనసాగిస్తూ మంగళవారం 39-37లో యు ముంబాపై విజయం సాధించింది. మలుపులు తిరుగుతూ ఉత్కంఠ రేపుతూ సాగిన ఈ పోరులో ఆరంభంలో ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. -
junior hockey wc: అర్జీత్ హ్యాట్రిక్
జూనియర్ హాకీ ప్రపంచకప్లో భారత్కు అదిరే ఆరంభం. అర్జీత్ సింగ్ హుందాల్ హ్యాట్రిక్ గోల్స్ కొట్టడంతో మంగళవారం పూల్-సి మ్యాచ్లో 4-2తో కొరియాను ఓడించింది. ఈ మ్యాచ్లో ఆరంభం నుంచి భారత్దే జోరు. 11వ నిమిషంలో అర్జీత్ పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. -
భారత్కు మూడు స్వర్ణాలు
ప్రపంచ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పాయల్, నిషా, ఆకాన్ష పసిడి పతకాలతో మెరిశారు. అర్మేనియాలో జరుగుతున్న ఈ పోటీల్లో మహిళల 52 కేజీల ఫైనల్లో నిషా 5-0తో ఫరినాజ్ (తజికిస్థాన్)ను చిత్తుగా చేయగా..70 కేజీల తుదిపోరులో ఆకాన్ష అంతే తేడాతో తైమజోవా (రష్యా)ను ఓడించింది. -
Sourav Ganguly: కోహ్లీని నేను తప్పించలేదు
టీమ్ఇండియా టీ20 కెప్టెన్గా విరాట్ కోహ్లీని తప్పించడంలో తన పాత్రేమీ లేదని అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ పునరుద్ఘాటించాడు. టీ20 ప్రపంచకప్ (2021) అనంతరం కోహ్లి టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత అతడికి, గంగూలీకి మధ్య వైరం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. -
హైదరాబాద్, ఆంధ్ర నిష్క్రమణ
విజయ్ హజారె ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ నుంచి హైదరాబాద్, ఆంధ్ర నిష్క్రమించాయి. పేలవ ప్రదర్శనతో గ్రూపు దశను దాటలేకపోయాయి. ఏడు మ్యాచ్ల్లో నాల్గింట్లో గెలిచి.. మూడింట్లో ఓడిన హైదరాబాద్ 16 పాయింట్లతో గ్రూపు-బి పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. -
Sports News: ఆ ఒక్క అథ్లెట్ డోపీనే
ఈ ఏడాది సెప్టెంబరులో సంచలనం సృష్టించిన దిల్లీ అథ్లెటిక్ మీట్లో మరో విచిత్రం చోటు చేసుకుంది. 100 మీటర్ల పరుగులో పాల్గొన్న ఏకైక అథ్లెట్ కూడా డోపీగా తేలాడు. సెప్టెంబరు 26న 100 మీ ఫైనల్ నిర్వహిస్తున్న సమయంలో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) అధికారులు వస్తున్నారని తెలియడంతో ఒక్కరు మినహా బరిలో ఉన్న అథ్లెట్లంతా పారిపోయారు. -
IPL 2024 mini auction: ‘ఆ ఇద్దరి కోసం ముంబయి ఇండియన్స్ పోటీ పడుతోంది’
మరికొన్ని రోజుల్లో ఐపీఎల్-2024 సీజన్ కోసం మినీ వేలం నిర్వహించనున్నారు. ఆసీస్ పేసర్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, హేజిల్వుడ్ ఈ వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉంది.


తాజా వార్తలు (Latest News)
-
BJP: అసెంబ్లీలకి ఎన్నికైన.. 10 మంది భాజపా ఎంపీల రాజీనామా
-
Automobile Sales: రికార్డు స్థాయికి వాహన విక్రయాలు.. నవంబర్లో 28.54 లక్షల అమ్మకాలు
-
AP High Court: ‘ఇసుక కేసు’లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
-
Pranab Mukherjee: వారి రాజకీయ చతురత రాహుల్ గాంధీకి అబ్బలేదు: డైరీలో రాసుకున్న ప్రణబ్ ముఖర్జీ
-
Telangana secretariat: రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగులకు మధ్య వారధిగా ఉంటా: కోదండరామ్
-
New sim card Rule: జనవరి 1 నుంచి సిమ్ కార్డుల జారీకి కొత్త రూల్