IND vs WI : భారత్ X విండీస్.. మూడో టీ20 మ్యాచ్ కూడా ఆలస్యమే
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్లో భాగంగా ఇవాళ మూడో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్కు కూడా సెయింట్ కిట్స్లోని వార్నర్ పార్క్ మైదానం...
అధికారికంగా వెల్లడించిన విండీస్ క్రికెట్ బోర్డు
(ఫొటో సోర్స్: విండీస్ క్రికెట్ ట్విటర్)
ఇంటర్నెట్ డెస్క్: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్లో భాగంగా ఇవాళ మూడో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్కు కూడా సెయింట్ కిట్స్లోని వార్నర్ పార్క్ మైదానం వేదిక కానుంది. సోమవారం ఇక్కడే రెండో టీ20 మ్యాచ్ జరిగింది. లగేజీ రావడం ఆలస్యం కావడంతో మ్యాచ్ను దాదాపు మూడుగంటలపాటు ఆపాల్సి వచ్చింది. సాధారణంగా భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభించాల్సి ఉంది. అయితే రెండో మ్యాచ్ ప్రారంభమయ్యేసరికి రాత్రి 11 గంటలు అయింది. అప్పటికీ అందరి ఆటగాళ్ల కిట్లు రాలేదు. దీంతో అర్ష్దీప్ జెర్సీ వేసుకొని మరీ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్కు రావడం గమనార్హం. ఈ క్రమంలో లాజిస్టికల్ సమస్య తీరినప్పటికీ ఇవాళ్టి మ్యాచ్ కూడా గంటన్నర ఆలస్యం కానుందని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
‘‘భారత్, విండీస్ జట్ల మధ్య జరిగే మూడో మ్యాచ్ కూడా ఆలస్యం కానుందని క్రికెట్ వెస్టిండీస్ బోర్డు అధికారికంగా ధ్రువీకరించింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు బదులు రాత్రి 9.30 గంటలకు మ్యాచ్ ఆరంభమవుతుంది. సోమవారం మ్యాచ్ను ఆలస్యంగా ప్రారంభించాల్సి వచ్చింది. అయితే మూడో మ్యాచ్కు ముందు ఆటగాళ్లకు కావాల్సినంత విశ్రాంతినిచ్చేందుకు అవకాశం ఇస్తామని చెప్పడంతోనే ఆయా జట్లు ఇవాళ టీ20 ఆడేందుకు అంగీకరించాయి’’ అని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రతినిధులు వెల్లడించారు. ఐదు టీ20ల సిరీస్లో చెరొక విజయంతో ప్రస్తుతం 1-1తో సమంగా నిలిచాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.