భారత టీ20 లీగ్.. కేన్ మామను వదిలేసిన హైదరాబాద్.. మిగతా జట్లు ఏం చేశాయంటే..?
భారత టీ20 లీగ్లో ఫ్రాంచైజీల పరస్పర అంగీకారంతో ఆటగాళ్ల మార్పిడి జరిగిపోయింది. తాజాగా అట్టిపెట్టుకొన్న/ విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను ఆయా ఫ్రాంచైజీలు విడుదల చేశాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారత టీ20 లీగ్ 2023 సీజన్కు సంబంధించి 10 ఫ్రాంచైజీలు తాము వదులుకొనే, అట్టిపెట్టుకొనే ఆటగాళ్ల పేర్లను వెల్లడించాయి. రిటెయిన్/రిలీజ్ చేసే ఆటగాళ్ల జాబితాను వెల్లడించాల్సిన గడువు ఇవాళ్టితో (నవంబర్ 15) ముగిసింది. అయితే గడువుకు ముందే ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు మార్పిడి చేసుకొనే అవకాశాన్ని నిర్వాహకులు కల్పించారు. ఇక మిగిలిన వారంతా డిసెంబర్ 23న కోచి వేదికగా జరిగే మినీ వేలంలోకి వచ్చేస్తారు. మరి ఏ జట్టు ఎవరిని వదులుకొంది.. ఎవరిని అట్టిపెట్టుకొంది అనే విషయాలను పరిశీలిస్తే..
కెప్టెన్తో సహా కీలక ప్లేయర్లు..
గత సీజన్లో దారుణ ప్రదర్శన చేసిన హైదరాబాద్ భారీ మార్పులకు శ్రీకారం చుట్టినట్లుంది. కెప్టెన్గా వ్యవహరించిన కేన్ విలియమ్సన్తోపాటు సీనియర్ బ్యాటర్ నికోలస్ పూరన్తోపాటు జగదీశ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెఫెర్డ్, సౌరభ్ దూబె, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయస్ గోపాల్, సుషాంత్ మిశ్రా, విష్ణు వినోద్ను వదులుకుంది. దీంతో ఆ ఫ్రాంచైజీ ఖాతాలో రూ. 42.25 కోట్లు ఉన్నాయి.
తుది జట్టు: అబ్దుల్ సమద్, ఐదెన్ మార్క్రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, ఫజల్హక్ ఫరూఖి, కార్తిక్ త్యాగి, భువనేశ్వర్ కుమార్, టి. నటరాజన్, ఉమ్రాన్ మాలిక్
ముంబయి జట్టులో..
ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబయికి గత సీజన్ ఓ పీడకల. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఈ క్రమంలో సీనియర్ బ్యాటర్ కీరన్ పొలార్డ్ను వదిలేసింది. అలాగే అన్మోల్ప్రీత్ సింగ్, ఆర్యన్ జుయల్, బసిల్ థంపి, డానియల్ సామ్స్, ఫాబియన్ అలెన్, జయ్దేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రాహుల్ బుద్ది, రిలీ మెరెడిత్, సంజయ్ యాదవ్, టైమల్ మిల్స్ను రిలీజ్ చేసింది.
తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), టిమ్ డేవిడ్, రమణ్దీప్ సింగ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, డేవాల్డ్ బ్రెవిస్, ట్రిస్టన్ స్టబ్స్, బుమ్రా, జొఫ్రా ఆర్చర్, అర్జున్ తెందూల్కర్, హృతిక్ షోకీన్, కుమార్ కార్తికేయ సింగ్, జాసన్ బెహ్రెన్డార్ఫ్, అర్షద్ ఖాన్, అకాశ్ మాధ్వాల్
చెన్నై జట్టు ఇలా..
రవీంద్ర జడేజాను పక్కన పెడతారేమోనని భావించిన అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ చెన్నై అతడిని రిటెయిన్ చేసుకొంది. అనూహ్యంగా డ్వేన్ బ్రావ్ను వదిలేసుకొంది. అతడితోపాటు ఆడమ్ మిల్నే, క్రిస్ జొర్డాన్, ఎన్ జగదీశన్, సి హరినిశాంత్, కే భగత్ వర్మ, కేఎం అసిఫ్, రాబిన్ ఉతప్ప (రిటైర్డ్)ను రిలీజ్ చేసింది.
తుది జట్టు: ఎంఎస్ ధోనీ (కెప్టెన్), డేవన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, శుభ్రాన్షు సేనాపతి, మొయిన్ అలీ, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, డ్వేన్ ప్రిటోరియస్, మహీష్ తీక్షణ, ప్రశాంత్ సోలంకి, దీపక్ చాహర్, ముకేశ్ చౌదరి, సిమర్జీత్ సింగ్, తుషార్ దేశ్పాండే, రాజ్వర్థన్ హంగర్గేకర్, మిచెల్ సాంట్నర్, మహీషా పతిరాన
లఖ్నవూ రిలీజ్ చేసింది వీరినే..
తొలిసారి టీ20 లీగ్ బరిలోకి దిగిన లఖ్నవూ పలువురిని వదిలేసింది. ఆండ్రూ టై, అంకిత్ రాజ్పూత్, దుష్మంత చమీర, ఇవిన్ లూయిస్, జాసన్ హోల్డర్, మనీష్ పాండే, షహబాజ్ నదీమ్ను రిలీజ్ చేసింది.
మిగిలిన టీమ్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), ఆయుష్ బదోని, కరణ్ శర్మ, మనన్ వోహ్రా, క్వింటన్ డికాక్, మార్కస్ స్టొయినిస్, కృష్ణప్ప గౌతమ్, దీపక్ హుడా, కైల్ మయేర్స్, కృనాల్ పాండ్య, అవేశ్ ఖాన్, మోహ్సిన్ ఖాన్, మార్క్వుడ్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్
రూథర్ ఫోర్డ్ను వదిలేసింది..
బెంగళూరు నుంచి పెద్ద ఆటగాళ్లను విడుదల చేయలేదు. జాసన్ బెహ్రెన్డార్ఫ్, అనీశ్వర్ గౌతమ్, చమ మిలింద్, లవ్నిత్ సిసోదియా, షెర్ఫానె రూథర్ఫోర్డ్ను వదిలేసింది. వీరిలో బెహ్రెన్డార్ఫ్ను ముంబయి సొంతం చేసుకొంది.
తుది జట్టు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సుయాష్ ప్రభుదేశాయ్, రాజత్ పాటిదార్, దినేశ్ కార్తిక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, గ్లెన్ మ్యాక్స్వెల్, వనిందు హసరంగ, షహబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లే, కర్ణ్ శర్మ, మహిపాల్ లామ్రోర్, మహమ్మద్ సిరాజ్, జోస్ హేజిల్వుడ్, సిద్దార్థ్ కౌల్, ఆకాశ్ దీప్
నీషమ్, డారిల్ మిచెల్ లేకుండా..
ఆల్రౌండర్ జేమ్స్ నీషమ్ను రాజస్థాన్ వదిలేసింది. అలాగే అరుణయ్ సింగ్, కార్బిన్ బాస్క్, డారిల్ మిచెల్, కరుణ్ నాయర్, నాథన్ కౌల్టర్నైల్, రస్సీ వాన్ డర్ డస్సెన్, శుభమ్ గర్హ్వాల్, తేజ్ బరోక తదితరులను రిలీజ్ చేసింది.
తుది జట్టు: సంజూ శాంసన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, షిమ్రోన్ హెట్మయేర్, దేవ్దుత్ పడిక్కల్, జోస్ బట్లర్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, ప్రసిధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్, ఒబెడ్ మెక్కాయ్, నవ్దీప్ సైని, కుల్దీప్ సేన్, కుల్దిప్ యాదవ్, ఆర్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, కేసీ కరియప్ప
కోల్కతా కఠిన నిర్ణయాలు..
కోల్కతా కఠిన నిర్ణయాలను తీసుకున్నట్లు కనిపిస్తోంది. కీలక ఆటగాళ్లు ప్యాట్ కమిన్స్, సామ్ బిల్లింగ్స్, అమన్ ఖాన్, శివమ్ మావి, మహమ్మద్ నబి, చమిక కరుణరత్నె, ఆరోన్ ఫించ్, అలెక్స్ హేల్స్, అభిజిత్ తోమర్, అజింక్య రహానె, అశోక్ శర్మ, బాబా ఇంద్రజిత్, పార్థుమ్ సింగ్, రమేశ్ కుమార్, రసిఖ్ సలామ్, షెల్డన్ జాక్సన్లను రిలీజ్ చేయడం గమనార్హం.
ఫైనల్ టీమ్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితిశ్ రాణా, రహ్మనుతుల్లా గుర్బాజ్, వెంకటేశ్ అయ్యర్, ఆండ్రూ రస్సెల్, సునిల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, ఉమేశ్ యాదవ్, టిమ్ సౌథీ, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్, రింకు సింగ్
పంజాబ్ కూడా కెప్టెన్ను..
పంజాబ్ తమ మాజీ కెప్టెన్ను రిలీజ్ చేసింది. మయాంక్ అగర్వాల్ (మాజీ కెప్టెన్), ఓడియన్ స్మిత్, వైభవ్ అరోరా, బెన్నీ హోవెల్, ఇషాన్ పోరెల్, అన్ష్ పటేల్, ప్రేరక్ మన్కడ్, సందీప్ శర్మ, వృత్తిక్ ఛటర్జీని వదిలేసింది.
తుది జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), షారుఖ్ ఖాన్, జానీ బెయిర్స్టో, ప్రభాసిమ్రన్ సింగ్, భానుక రాజపక్స, జితేశ్ శర్మ, రాజ్ బవా, రిషి ధావన్, లియామ్ లివింగ్స్టోన్, అథర్వ తైడే, అర్ష్దీప్ సింగ్, బాల్తేజ్ సింగ్, నాథన్ ఎల్లిస్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, హర్ప్రీత్ బ్రార్
జాసన్ రాయ్ లేకుండా..
అరంగేట్రం చేసిన తొలి సీజన్లోనే టైటిల్ను గుజరాత్ నెగ్గింది. గత సీజన్లో ఆడని జాసన్ రాయ్ను తప్పించేసింది. అతడితోపాటు రహమ్మనుతుల్లా గుర్బాజ్, లాకీ ఫెర్గూసన్, డొమినిక్ డ్రాక్స్, గుర్కీరత్ సింగ్, వరుణ్ అరోన్ రిలీజ్ చేసింది.
మిగిలిన జట్టు: హార్దిక్ పాండ్య (కెప్టెన్), శుభ్మన్ గిల్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా, మ్యాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాతియా, విజయ్ శంకర్, మహమ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, ప్రదీప్ సంగ్వాన్, దర్శన్ నల్కందే, జయంత్ యాదవ్, ఆర్ సాయి కిశోర్, నూర్ అహ్మద్
శార్దూల్ను వదిలేసిన దిల్లీ
మెగా వేలంలో చాలా ఉత్సాహంగా ఆటగాళ్లను కొనుగోలు చేసిన ఫ్రాంచైజీల్లో దిల్లీ ఒకటి. అయితే ఈసారి ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ను రిలీజ్ చేయడం గమనార్హం. టిమ్ సీఫెర్ట్, అశ్విన్ హెబ్బర్, శ్రీకర్ భరత్, మన్దీప్ సింగ్ను వదిలేసింది.
తుది జట్టు: రిషభ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, రిపల్ పటేల్, రోవ్మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, యశ్ ధుల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, ఆన్రిచ్ నోకియా, చేతన్ సకారియా, కమ్లేష్ నాగర్కోటి, ఖలీల్ అహ్మద్, లుంగి ఎంగిడి, ముస్తాఫిజర్ రహ్మాన్, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబె, విక్కీ ఓత్స్వాల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్