Chennai: ధోనీ స్థానం భర్తీ చేయగలిగే భారత ఆటగాళ్లు ఎవరూ లేరు: బ్రాడ్ హాగ్
మరోసారి చెన్నై నాయకత్వ బాధ్యతలు ఆటగాడిపై చర్చకు తెరలేసింది. ఈ సీజన్ ప్రారంభానికి ముందు ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకొని...
రవీంద్ర జడేజాకే మళ్లీ అవకాశం ఇవ్వొచ్చన్న మాజీ క్రికెటర్
ఇంటర్నెట్ డెస్క్: మరోసారి చెన్నై నాయకత్వ బాధ్యతలు ఆటగాడిపై చర్చకు తెరలేసింది. ఈ సీజన్ ప్రారంభానికి ముందు ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకొని రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ అప్పగించాడు. అయితే వరుసగా ఓటముల నేపథ్యంతోపాటు వ్యక్తిగతంగా రాణించలేకపోవడంతో జడేజా సారథ్య బాధ్యతలను త్యజించాడు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ ఎంఎస్ ధోనీనే జట్టు పగ్గాలను అందుకొన్నాడు. హైదరాబాద్పై విజయం సాధించినా.. బెంగళూరుపై చెన్నై ఓడిపోయింది. ఈ సీజన్ వరకైతే ధోనీనే సారథ్యం వహిస్తాడు కాబట్టి ఫర్వాలేదు.. ఇప్పటికే 40 ఏళ్లు దాటిన ధోనీ వచ్చే సీజన్కు అందుబాటులో ఉంటాడో లేదో అనుమానమే. ఈ క్రమంలో ధోనీ తర్వాత చెన్నైకి కెప్టెన్గా ఎవరుంటారనే దానిపై బ్రాడ్ హాగ్ విశ్లేషించాడు.
‘‘ఇప్పుడైతే ఎంఎస్ ధోనీ బాధ్యతలను స్వీకరించాడు. మరి వచ్చే ఏడాది అతడి స్థానాన్ని భర్తీ చేసేదెవరు? ఇదే అందరి మదిలో మెదిలే ప్రశ్న.. చెన్నై జట్టులో అంత ప్రతిభావంతమైన, ప్రభావం చూపే ఆటగాడైతే నాకు ఎవరూ కనిపించడం లేదు. అందుకే వచ్చే ఏడాది వేలంలోకి వెళ్లి కెప్టెన్సీ నిర్వహించే సామర్థ్యం కలిగిన ఆటగాడిని కొనుగోలు చేస్తుందేమో అనిపిస్తోంది. అయితే అత్యుత్తమ టీమ్ఇండియా టీ20 ఫార్మాట్ ప్లేయర్లు అందుబాటులో లేరు. ఇప్పటికే ఇతర జట్లు సొంతం చేసుకొని కెప్టెన్సీని అప్పగించాయి. రవీంద్ర జడేజానే సరైన ఎంపిక. కాకపోతే ఈసారి మాత్రం అనుభవం లేకపోవడంతో సరిగ్గా రాణించలేకపోయాడు. ఒకవేళ ధోనీ వచ్చే సీజన్కు దూరమైతే మాత్రం జడేజాతో ఆ స్థానం భర్తీ చేయొచ్చు. జడేజా కాకుండా విదేశీ ప్లేయర్ను కెప్టెన్గా చేయదు. ఒకవేళ చేస్తే మాత్రం అలాంటి ఆటగాడు ఎవరనేది గుర్తించడం కూడా కష్టమే’’ అని బ్రాడ్ హాగ్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.