T20 League : ఈ మూడు జట్లకు కెప్టెన్లు వీరేనా..?
గత కొన్ని రోజులుగా అభిమానుల్లో ఆసక్తిరేపిన టీ20 మెగా వేలం...
ఇంటర్నెట్ డెస్క్: గత కొన్ని రోజుల నుంచి అభిమానుల్లో ఆసక్తిరేపిన టీ20 లీగ్ మెగా వేలం రెండు రోజులపాటు కోలాహలంగా జరిగింది. మొత్తం పది ఫ్రాంచైజీలు దాదాపు రూ. 550 కోట్లకుపైగా ఖర్చు చేసి 204 మంది ఆటగాళ్లను దక్కించుకున్నాయి. ఇప్పటికే ఏడు జట్లు తమ సారథులను ఎంపిక చేసుకోగా.. ఇంకో మూడు ఫ్రాంచైజీలు మాత్రమే కెప్టెన్ ఎవరనేది ప్రకటించాల్సి ఉంది. మరి ఆ మూడు ఫ్రాంచైజీలు ఏవి.. కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టగలిగే సామర్థ్యం కలిగిన ఆటగాళ్లు ఆ జట్లలో ఎవరున్నారనే విషయాలను ఓసారి పరిశీలిద్దాం..
కెప్టెన్ను వదిలేసుకుంది.. వేలంలో వద్దనుకుంది
గత సీజన్లో ఫైనల్కు వెళ్లిన కోల్కతా జట్టు చెన్నై చేతిలో పరాజయం పాలైంది. వ్యక్తిగతంగా రాణించని ఇయాన్ మోర్గాన్.. నాయకత్వపరంగా కేకేఆర్ను అద్భుతంగా నడిపించాడు. అయితే ఫామ్లేక ఇబ్బంది పడిన మోర్గాన్ను రిటెయిన్ చేసుకోకుండా కోల్కతా వదిలేసుకుంది. వేలంలోనూ కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపలేదు. ఇదే క్రమంలో శ్రేయస్ అయ్యర్ను రూ. 12.25 కోట్లు చెల్లించి మరీ సొంతం చేసుకుంది. శ్రేయస్కే కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించే అవకాశాలూ లేకపోలేదు. ఇప్పటికే రిటెయిన్ చేసుకున్నవారిలో సునిల్ నరైన్, ఆండ్రూ రస్సెల్, అజింక్య రహానె వంటి సీనియర్లు.. మరోవైపు ప్యాట్ కమిన్స్, నితీశ్ రాణా, టిమ్ సౌథీ ఉన్నా.. ఫ్రాంచైజీ మాత్రం శ్రేయస్ వైపే ఉన్నట్లుగా తెలుస్తోంది. దిల్లీని ఫైనల్కు చేర్చిన అనుభవం శ్రేయస్ సొంతం. ఇటీవల ఫామ్ను చూసినా మెరుగ్గానే ఉన్నాడు.
ఏ ఓపెనర్ సారథి అవుతాడో...?
మెగా వేలంలో చాలా తెలివిగా ఆటగాళ్లను ఎంచుకున్న ఫ్రాంచైజీల్లో పంజాబ్ ఒకటి. కేఎల్ రాహుల్ను వదిలేసుకుని మయాంక్ అగర్వాల్, అర్ష్దీప్ సింగ్లను మాత్రమే రిటెయిన్ చేసుకుంది. దీంతో కేఎల్ రాహుల్ లఖ్నవూ జట్టుకు కెప్టెన్గా వెళ్లిపోయాడు. మెగా వేలంలో టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ (రూ.8.25 కోట్లు), ఇంగ్లాండ్కు చెందిన జాన్ బెయిర్స్టో (రూ.6.75 కోట్లు), లియామ్ లివింగ్ స్టోమ్ (రూ.11.50 కోట్లు)లను దక్కించుకుంది. అయితే ఇందులో శిఖర్ ధావన్కు కెప్టెన్గా అనుభవం ఉంది. మయాంక్తో సహా వీరందరూ ఓపెనర్లే కావడం విశేషం. యువ క్రికెటర్కు సారథ్య బాధ్యతలను అప్పగించాలని భావిస్తే మాత్రం మయాంక్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. సీనియర్కు అయితే తొలి వరుసలో ధావన్ ఉంటాడు. విదేశీ క్రికెటర్కు అయితే లివింగ్ స్టోన్కు అవకాశం దక్కొచ్చు. మరి పంజాబ్ యాజమాన్యం, మెంటార్ అనిల్ కుంబ్లే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
అందరూ స్టార్లే.. మరోసారి మాజీ కెప్టెన్కు తప్పదా..?
టీ20 లీగుల్లో అత్యంత ఆసక్తికరమైన జట్లలో బెంగళూరు ముందు వరుసలో ఉంటుంది. విరాట్ కోహ్లీ, మ్యాక్స్వెల్, డుప్లెసిస్, దినేశ్ కార్తిక్ సీనియర్ ఆటగాళ్లు. అయితే ఇప్పటికే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలను వదిలేశాడు. డుప్లెసిస్ (36), కార్తిక్ (37) అధిక వయస్సు కలిగిన వారు. ఇక మ్యాక్స్వెల్కు కూడా 33 ఏళ్లు వచ్చేశాయి. మిగతావారిలో సిరాజ్, హర్షల్ పటేల్, హసరంగ, హేజిల్వుడ్, షాబాజ్ అహ్మద్ మాత్రమే అభిమానులకు పరిచయం ఉన్న పేర్లు. ఈ క్రమంలో మరోసారి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చేపట్టాలని బెంగళూరు యాజమాన్యం కోరే అవకాశం లేకపోలేదు. అప్పటికీ ససేమిరా అంటే మాత్రం మ్యాక్స్వెల్కు అదృష్టం కలిసొచ్చినట్లే. సిరాజ్, హర్షల్ పటేల్ వ్యక్తిగత ప్రదర్శన అద్భుతంగా ఉన్నా నాయకత్వంలో అనుభవరాహిత్యం ఉండటం వల్ల వచ్చే సీజన్కు అడ్డంకిగా మారే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో