Ashesలో గెలిస్తే స్మిత్కు పగ్గాలిస్తా: టిమ్పైన్
ఈ ఏడాది చివర్లో ఇంగ్లాండ్తో జరిగే యాషెస్ సిరీస్లో తాము గెలిస్తే ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్సీని తిరిగి స్టీవ్స్మిత్కు అప్పగిస్తానని ప్రస్తుత సారథి టిమ్పైన్ ఆశాభావం వ్యక్తం చేశాడు...
ఇంటర్నెట్డెస్క్: ఈ ఏడాది చివర్లో ఇంగ్లాండ్తో జరిగే యాషెస్ సిరీస్లో తాము గెలిస్తే ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్సీని తిరిగి స్టీవ్స్మిత్కు అప్పగిస్తానని ప్రస్తుత సారథి టిమ్పైన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. 2018 మార్చిలో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకొని స్మిత్ కెప్టెన్సీ పగ్గాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా టిమ్పైన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘కచ్చితంగా నేనా నిర్ణయం తీసుకోలేను. కానీ, స్మిత్ సారథ్యంలో నేను ఆడినప్పుడు అతడు అద్భుతమైన సారథిగా ఉన్నాడు. నైపుణ్యం పరంగానూ చాలా మంచి ఆటగాడు. అలాగే స్మిత్ కూడా నాలాంటి వాడే. తస్మానియా జట్టుకు నేను కెప్టెన్గా కొనసాగుతున్న తొలినాళల్లో అతడు జాతీయ జట్టుకు కెప్టెనయ్యాడు. అదీ చాలా చిన్న వయసులో. అప్పుడు దానికి అతడు సిద్ధంగా లేడు. తర్వాత నేను జట్టులోకి వచ్చేసరికి ఆస్ట్రేలియా కెప్టెన్గా ఎంతో మెరుగయ్యాడు. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా పర్యటనలో బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకొని కెప్టెన్సీకి దూరమయ్యాడు. అయితే, తిరిగి అతడు కెప్టెన్సీ పగ్గాలు చేపడితే నేను మద్దతిస్తాను’ అని టిమ్పైన్ పేర్కొన్నాడు.
‘అలాగే యాషెస్ సిరీస్లో మేం 5-0 తేడాతో ఇంగ్లాండ్ను ఓడించాక.. ఇదే సరైన సమయం అని నేను భావించి కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే ఎంత బాగుంటుంది. కానీ, అదెంతో కష్టతరమైన సిరీస్గా ఉండొచ్చు. చివరి రోజు మేం 300 పరుగులు ఛేదించాల్సి రావచ్చు. అప్పుడు నేను సెంచరీతో చెలరేగడమే కాకుండా విన్నింగ్ షాట్ కొట్టాక.. అప్పుడు నేను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటా’ అని ఆసీస్ కెప్టెన్ వివరించాడు. అనంతరం టీమ్ఇండియాతో టెస్టు సిరీస్ ఓటమిపాలవ్వడంపై స్పందిస్తూ.. కోహ్లీసేన తమను పక్కదారి పట్టించిందని, అందువల్లే తాము ఓడిపోయామని వింత వ్యాఖ్యలు చేశాడు. కాగా, ఈ ఏడాది జనవరిలో సీనియర్లు లేని టీమ్ఇండియా మేటి కంగారూ జట్టును ఓడించిన సంగతి తెలిసిందే. 2-1 తేడాతో వరుసగా రెండోసారి ఆస్ట్రేలియాలో చారిత్రక బోర్డర్-గావస్కర్ ట్రోఫీలు సాధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98కోట్ల ఆస్తులు అటాచ్
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
-
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
-
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి