IPL: ఐపీఎల్ రిటెన్షన్.. ఇవాళే డెడ్లైన్.. రాత్రికి లిస్ట్ విడుదల!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆటగాళ్ల రిటెన్షన్ గడువు మరికొద్ది గంటల్లో...
రాత్రికి లిస్ట్ను ప్రకటించే అవకాశం
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆటగాళ్ల రిటెన్షన్ గడువు మరికొద్ది గంటల్లో ముగియనుంది. బీసీసీఐ ఇచ్చిన తుది గడువు నవంబర్ 30 (మంగళవారం). ఎనిమిది ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించాల్సి ఉంటుంది. కొత్త జట్లైన అహ్మదాబాద్, లఖ్నవూకు వేలం నిర్వహణకు ముందే తొలుత నలుగురేసి ప్లేయర్లను ఎంచుకునే వెసులుబాటును బీసీసీఐ కల్పించింది. అనంతరం మిగిలిన క్రికెటర్లు మెగా వేలంలోకి వచ్చేస్తారు. అయితే మెగా వేలం నిర్వహిస్తారనేది ఇంకా నిర్ణయించలేదు. రిటెన్షన్కు సంబంధించి జాబితాను ఇవాళ రాత్రికి (అంచనా సమయం 9.30) బీసీసీఐ విడుదల చేసే అవకాశం ఉంది. అలానే మెగా వేలం తేదీని కూడా ప్రకటించొచ్చు.
కొత్తగా రెండు జట్లు వస్తుండటం.. పాత ఫ్రాంచైజీల్లోనూ భారీ మార్పులు ఉండే అవకాశం ఉండటంతో మెగా వేలంపై భారీ ఆసక్తి నెలకొని ఉంది. ఈ సారి ఏ ఆటగాడు అత్యధిక ధరను కైవసం చేసుకుంటాడనే దానిపై చర్చ కొనసాగుతోంది. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ఒక్కో ఫ్రాంచైజీ మెగా వేలంలో ఆటగాళ్ల కోసం రూ. 90 కోట్ల వరకు ఖర్చు చేయవచ్చు. అంతర్జాతీయంగా, దేశవాళీలో మంచి ఫామ్ కనబరిచిన క్రికెటర్లు అధిక మొత్తాన్ని అందుకుంటారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా రిటెయిన్ పద్ధతిలోనూ కొన్ని మార్పులు చేసింది.
* ఫ్రాంచైజీ అట్టిపెట్టుకునే నలుగురిలో భారతీయ ఆటగాళ్లు గరిష్ఠంగా ముగ్గురు ఉండొచ్చు. అలానే విదేశీ ఆటగాళ్లు ఇద్దరిని మించకూడదు.
* ఈ లెక్క ప్రకారం.. నలుగురిలో ముగ్గురు భారతీయులు, ఒకరు విదేశీ క్రికెటర్ ఉండొచ్చు.
* ఇద్దరు భారతీయ క్రికెటర్లు.. ఇద్దరు విదేశీయులను ఉంచుకునే అవకాశం ఉంది.
అత్యంత విలువైన ఆటగాళ్ల పరిస్థితి ఏంటో ఓసారి చూద్దాం..
విరాట్ కోహ్లీ: ఐపీఎల్లోనే అత్యధిక విలువ కలిగిన ఆటగాడు విరాట్ కోహ్లీ. ఆర్సీబీ కోహ్లీకి రూ. 17 కోట్లు వెచ్చించింది. అయితే ఈసారి ఆటగాడిగా మాత్రమే కోహ్లీ జట్టులో ఉండనున్నాడు. కెప్టెన్సీని వదిలేస్తున్నట్లు యూఏఈ ఎడిషన్ సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
క్రిస్ మోరిస్: రాజస్థాన్ రాయల్స్ రూ. 16.25 కోట్లకు కొనుగోలు చేసిన ఆల్రౌండర్ క్రిస్ మోరిస్. అయితే గత రెండు సీజన్లలో పెద్దగా రాణించిందేమీ లేదు. ఇప్పుడు ఆర్ఆర్ మోరిస్ను అట్టిపెట్టుకోవడం కష్టమే. వేలంలోకి వచ్చినా భారీ మొత్తం సొంతం చేసుకోకపోవచ్చు.
ప్యాట్ కమిన్స్: ఫాస్ట్బౌలర్ అయిన కమిన్స్ను కేకేఆర్ రూ. 15.5 కోట్లకు దక్కించుకుంది. భారీగా ఆశలు పెట్టుకున్నప్పటికీ ధరకు తగ్గ న్యాయం చేయలేదు. ఏడు మ్యాచుల్లో కేవలం తొమ్మిది వికెట్లను మాత్రం పడగొట్టాడు. కేకేఆర్ రిటెయిన్ చేసుకునేందుకు మొగ్గు చూపదని విశ్లేషకులు చెబుతున్నారు.
ఎంఎస్ ధోనీ, రోహిత్, పంత్: సీఎస్కే, ముంబయి, దిల్లీ సారథులు ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, రిషభ్ పంత్లను ఆయా జట్లు రిటెయిన్ చేసుకోవడం ఖాయం. వీరి బ్రాండ్ విలువ రూ. 15 కోట్లు. అయితే ఈ సారి ఎక్కువ ఆఫర్ చేయొచ్చని తెలుస్తోంది.
మ్యాక్స్వెల్: అంతకుముందు ఫామ్లో లేని మ్యాక్స్వెల్ను ఆర్సీబీ భారీ మొత్తం (రూ. 14.25 కోట్లు) వెచ్చించి దక్కించుకోవడంతో క్రీడాలోకం ఆశ్చర్య పోయింది. అయితే ఐపీఎల్ 14వ సీజన్లో తన స్థాయికి తగ్గ ఆటను ఆడిన మ్యాక్సీ.. ఆర్సీబీ ప్లేఆఫ్స్కు వెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఈ సారి కోహ్లీతోపాటు మ్యాక్స్వెల్ను ఆర్సీబీ రిటెయిన్ చేయనుంది.
సునిల్ నరైన్: విభిన్న స్పిన్తోపాటు బ్యాటింగ్లోనూ మెరుపు దాడి చేయగల ఆటగాడు సునిల్ నరైన్. కేకేఆర్ రూ. 12.55 కోట్లకు దక్కించుకుంది. ఇలాంటి కీలక ఆటగాడిని ఈసారి కూడా కోల్కతా రిటెయిన్ చేసుకుంటుంది.
డేవిడ్ వార్నర్: సన్రైజర్స్ అంటే డేవిడ్ వార్నర్.. అనేలా పెనవేసుకుని పోయిన బంధం ఎందుకో బీటలువారింది. ఎస్ఆర్హెచ్ రూ. 12.55 కోట్లు వెచ్చించి మరీ కొనుగోలు చేసిన డేవిడ్ వార్నర్కు 14వ సీజన్ రెండో అంచెలో సారథ్యంతోపాటు జట్టులోనూ స్థానం కల్పించలేదు. దీంతో ఈసారి వార్నర్ మెగా వేలంలోకి వచ్చేస్తానని తన ట్వీట్లతో చెప్పకనే చెప్పాడు. ఈ సారి మెగా వేలంలో హాట్ టాపిక్గా డేవిడ్ వార్నర్ మారే అవకాశం ఉంది.
కేఎల్ రాహుల్: పంజాబ్ కింగ్స్ జట్టుకు సారథ్యం వహించిన కేఎల్ రాహుల్ను రూ. 11.95 కోట్లకు సొంతం చేసుకుంది. పంజాబ్ కింగ్స్ రిటెయిన్ చేసుకోదనే వార్తల నేపథ్యంలో రాహుల్ మెగా వేలంలోకి వస్తాడా? లేదా ఏదైనా కొత్త జట్టుకి కెప్టెన్గా ఎంపిక కానున్నాడా? వేచి చూడాల్సిందే.
హార్దిక్ పాండ్య: ముంబయి ఇండియన్స్ జట్టులో హార్దిక్ పాండ్య కీలక ఆటగాడు. గతేడాది ముంబయి యాజమాన్యం అతడిని రూ.11 కోట్లతో అట్టిపెట్టుకుంది. అయితే వెన్నెముక సమస్యతో పద్నాలుగో సీజన్ మొత్తం బౌలింగ్ చేయలేకపోయాడు. దీంతో ముంబయి రిటెయిన్ చేసుకోకుండా మళ్లీ వేలంలో సొంతం చేసుకునే అవకాశం ఉందని క్రీడా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM