Olympics Winning Moments: వీడియోలు చూడండి!
ఈ విశ్వక్రీడల్లో భారత అథ్లెట్లు మొత్తంగా ఏడు పతకాలు సాధించి సత్తా చాటారు. ఆ గెలుపు క్షణాల్ని నెమరవేసుకుందామా!
టోక్యో 2020 ఒలింపిక్స్ సంబరాలు ఘనంగా ముగిశాయి. అథ్లెటిక్స్లో భారత్ వందేళ్లుగా వేచి చూసిన ‘స్వర్ణ’ సంబరం ఈ దఫా మన సొంతమైంది. ఈ విశ్వక్రీడల్లో భారత అథ్లెట్లు మొత్తంగా ఏడు పతకాలు సాధించారు. మరి ఈ క్రీడోత్సవంలో మన అథ్లెట్ల గెలుపు క్షణాల్ని ఓసారి నెమరవేసుకుందామా!
🥈 మీరాబాయి చాను (రజతం) 🥈
ఒలింపిక్స్ ఆరంభమైన రెండో రోజే భారత్కు పతకాన్ని అందించింది మీరాబాయి చాను. వెయిట్ లిఫ్టింగ్లో కరణం మల్లీశ్వరి తర్వాత ఆ ఘనత సాధించింది చానునే. దాదాపు 21 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్లో ఈ మణిపుర్ మణిపూస అద్భుతాన్ని ఆవిష్కరించింది. మహిళల 49 కిలోల విభాగంలో రజతం గెలిచి.. భారత కీర్తి పతాకను శిఖరాగ్రాలకు చేర్చింది. పోటీలో భాగంగా స్నాచ్లో 87 కిలోలు, క్లీన్ అండ్ జర్క్లో 115 కిలోలు.. మొత్తంగా 202 కిలోలు ఎత్తింది.
🥉 పీవీ సింధు (కాంస్యం) 🥉
ఒలింపిక్స్లో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో తెలుగు తేజం పీవీ సింధు కాంస్య పతకం సాధించి కొత్త రికార్డు నెలకొల్పింది. కాంస్య కోసం జరిగిన పోటీలో చైనా క్రీడాకారిణి హి బింగ్జియావోతో పోటీ పడింది మన సింధు. అయితే, మ్యాచ్ ప్రారంభం నుంచి పూర్తి ఆధిపత్యం చలాయించిన సింధు.. వరుస గేమ్స్లో 21-13, 21-15 తేడాతో అద్భుత విజయం సాధించింది. దీంతో టోక్యో ఒలింపిక్స్లో వరుసగా రెండు సార్లు పతకాలు సాధించిన క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. అయితే, 2016 రియో ఒలింపిక్స్లో రజతం సాధించిన సింధు.. తాజా ఒలింపిక్స్లో కాంస్యంతో సరిపెట్టుకుంది.
🥉 లవ్లీనా బొర్గొహెయిన్ (కాంస్యం) 🥉
ఒలింపిక్స్ బాక్సింగ్లో.. లవ్లీనా బొర్గొహెయిన్ చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్లో పతకం సాధించిన భారత మూడో బాక్సర్గా అవతరించింది. ‘మాగ్నిఫిసెంట్ మేరీ’ తర్వాత పతకం ముద్దాడిన రెండో మహిళగా ఘనకీర్తిని అందుకుంది. టోక్యో క్రీడల్లో ఆమెకు దక్కింది కాంస్యమే అయినా అది స్వర్ణంతో సమానమే! ఎందుకంటే భారత బాక్సింగ్కు 9 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో ఆమె తొలి పతకం అందించింది. ఒలింపిక్స్లో పాల్గొన్న తొలిసారే పతకం గెలవడం విశేషం.
🥉 హాకీ- పురుషుల జట్టు (కాంస్యం) 🥉
41 సంవత్సరాల తర్వాత భారత హాకీ జట్టు.. తిరిగి ఒలింపిక్స్లో పతకం సాధించడం గర్వించదగ్గ విషయం. అద్భుతమై ఆటతీరుతో సెమీస్కు దూసుకెళ్లిన భారత్.. ఆ మ్యాచ్లో బెల్జియం చేతిలో ఓటమిపాలైంది. దీంతో మూడోస్థానం కోసం జర్మనీతో బరిలోకి దిగిన భారత్.. ఆ జట్టును 5-4 గోల్స్తో ఓడించి కాంస్య పతకం కైవసం చేసుకుంది.
🥈 రవి కుమార్ దహియా (రజతం) 🥈
టోక్యో ఒలింపిక్స్లో రవి కుమార్ దహియా అద్భుత పోరాటంతో రెజ్లింగ్ 57 కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో రజతంతో మెరిశాడు. రెండు సార్లు ప్రపంచ విజేత అయిన రష్యాకు చెందిన యుగేవ్ జావుర్ చేతిలో పోరాడి ఓడినా దేశానికి పతకం తీసుకొచ్చాడు. ఇక 2012 తర్వాత పురుషుల రెజ్లింగ్ విభాగంలో భారత్కు పతకం రావడం ఇదే తొలిసారి. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో కాంస్యం సాధించిన సుశీల్కుమార్ తర్వాత 2012లో రజత పతకం గెలిచాడు.
🥉 బజరంగ్ పునియా (కాంస్యం) 🥉
భారత రెజ్లర్ బజరంగ్ పునియా.. పురుషుల 65 కిలోల కుస్తీపోటీల్లో కాంస్య పతకం సాధించాడు. వీరోచిత పోరాటంతో సెమీ ఫైనల్ వరకు దూసుకెళ్లిన బజరంగ్.. ఆ మ్యాచ్లో అజర్బైజాన్కు చెందిన అలియెవ్ హజీతో తలపడి ఓడిపోయాడు. అనంతరం జరిగిన ‘కాంస్య’ పోరులో కజక్స్థాన్కు చెందిన దౌలత్ నియజ్బెకోవ్ను 8-0తో చిత్తు చేశాడు.
🥇 నీరజ్ చోప్రా (స్వర్ణం) 🥇
ఒలింపిక్స్ ముగిసే ముందు రోజు భారత జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. అథ్లెటిక్స్లో శతాబ్దం తర్వాత తొలి పతకం అందించాడు. జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం ముద్దాడాడు. స్వతంత్ర భారత దేశంలో.. వ్యక్తిగత క్రీడల్లో అభినవ్ బింద్రా తర్వాత పసిడి పతకం అందుకున్న వీరుడిగా నిలిచాడు. పోటీలో మొదటి అవకాశంలో జావెలిన్ను నీరజ్ 87.03 మీటర్లు విసిరాడు. రెండోసారి 87.58మీటర్లు, మూడోసారి 76.79మీటర్లు విసిరాడు. ఆ తర్వాత రెండు అవకాశాలు ఫౌల్స్ అయినా.. అత్యుత్తమ ప్రదర్శన (87.58)తో అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకం అందుకున్నాడు.
వీళ్లంతా పతకాల సాధించి.. రికార్డులు నెలకొల్పితే.. మరికొన్ని విభాగాల్లో భారత అథ్లెట్లు చరిత్ర సృష్టించారు. వాటన్నింటిని మరో కథనంలో మీ ముందుంచుతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యంత దారుణంగా ట్రోలింగ్కు గురైన కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya). ఏ మైదానంలో చూసినా అతడిని హేళన చేస్తూ ఫ్యాన్స్ హోరెత్తించారు. -
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
లఖ్నవూ చేతిలో చెన్నైకి వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఈసారి సొంత మైదానంలోనే పరాజయం పొందడంతో ఆ జట్టు అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ తన టీమ్ను వెల్లడించాడు. -
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
David Warner: దిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్.. భారత గుర్తింపు కార్డు ఆధార్ కోసం పరిగెడుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో అతడు హిందీలో మాట్లాడటం విశేషం. -
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
సెంచరీతో చెన్నైపై భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో లఖ్నవూ బ్యాటర్ స్టాయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఒకదశలో ఓడిపోతామని భావించిన ఆ జట్టును చివరి వరకూ క్రీజ్లో ఉండి విజయతీరాలకు చేర్చాడు. -
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ సెంచరీతో అలరించినా.. లఖ్నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు